Landcraft Agro Success: నేటి కాలంలో యువత ఐఐటీ, ఐఐఎం వంటి ప్రఖ్యాత విశ్వవిద్యాయలయాల్లో చదువు పూర్తి చేసిన తర్వాత ఫ్యాన్సీ జాబ్ ఆఫర్స్ వచ్చినప్పటికీ వాటిని వదులుకుంటున్నారు. తమలోని వ్యాపార ఆలోచనలకు జీవం పోసేందుకు కృషి చేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతున్నాయి. అలా స్టార్టప్ కల్చర్ అన్ని రంగాల్లోని కొత్త వ్యాపార అవకాశాలను టెక్నాలజీ ద్వారా ట్యాప్ చేసేందుకు నేటి యువత ఎక్కువగా ఆసక్తి చూపుతోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ల్యాండ్ క్రాష్ట్ ఆగ్రో సంస్థ సక్సెస్ స్టోరీ గురించే. దీనిని స్థాపించింది ఐఐటీ బంబేలో స్నేహితులైన మయాంక్ గుప్తా, లలిత్ ఝవార్. వాస్తవానికి మహారాష్ట్రలోని పశ్చిమ బెల్ట్, కొల్హాపూర్ జిల్లా బెల్లం, పాదరక్షలు, పర్యాటక ప్రదేశాలకు ప్రసిద్ధి చెందింది. కానీ ఇప్పుడు ఈ ప్రాంతం సేంద్రియంగా పండించిన విదేశీ కూరగాయలకు ప్రసిద్ధి చెందింది. ఈ క్రమంలో అక్వాపోనింగ్, హైడ్రోపోనింగ్ వంటి సాంకేతికతలతో దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో కూరగాయలను పండించటమే. ఇక్కడ పాలకూర నుంచి పుట్టగొడుకుల వరకు దాదాపు 40 వివిధ రకాల దేశీయ, విదేశీ ఆకుకూరలను ల్యాండ్ క్రాఫ్ట్ ఆగ్రో పేరుతో స్నేహితులు పండిస్తున్నారు.

మయాంక్ గుప్తా, లలిత్ ఝవార్ అనే ఇద్దరు స్నేహితులు ఐఐటీలో ఇంజనీరింగ్ చదువుతున్నారు. మయాంక్ జిలింగో అనే కంపెనీని స్థాపించి 2012-2018 వరకు ఆగ్నేయాసియా అంతటా పర్యటించారు. లలిత్ 2011లో తన కుటుంబం టెక్స్టైల్ అండ్ రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో చేరాడు. 2018లో మయాంక్ ఇంటికి తిరిగి వచ్చేశాడు. ఆ సమయంలోనే సేంద్రియ పద్ధతుల్లో పండించిన తాజా కూరగాయలను విక్రయించటాని ఇకామర్స్ ప్లాట్ఫారమ్ ప్రారంభించాలనే ఆలోచనను లలిత్తో చర్చించాడు. కొంత రీసెర్చ్ తర్వాత ఈ ఆలోచన సక్సెస్ కాదని వారు గ్రహించారు. ఈ క్రమంలో నాణ్యమైన సేంద్రియంగా పండించిన విదేశీ కూరగాయల రైతులు చాలా తక్కువగా ఉన్నారని వారు గుర్తించినట్లు మయాంక్ పేర్కొన్నాడు.
వినియోగదారులు, రైతుల మధ్య వారధిగా మారాలనుకున్నప్పటికీ చాలా తక్కువ మంది నాణ్యమైన ఉత్పత్తిదారులు మార్కెట్లో ఉన్నట్లు వారు గ్రహించారు. దీంతో వారిద్దరూ విదేశీ కూరగాయలను సొంతంగా పండించి విక్రయించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం అవరసమైన నీరు, వాతావరణం, నేల వంటి వాటిని ఏర్పాటు చేసుకున్నారు. తమకు వ్యవసాయంలో ఎలాంటి ముందస్తు అనుభవం లేనప్పటికీ ఏప్రిలో 2019లో మిత్రులిద్దరూ కలిసి కొల్హాపూర్ నగరానికి 30 కిలోమీటర్ల దూరంలోని ఇచల్కరంజిలో ల్యాండ్క్రాఫ్ట్ ఆగ్రోను ఏర్పాటు చేశారు. ల్యాండ్క్రాఫ్ట్ 20 ఎకరాల హైడ్రోపోనిక్స్, 3 ఎకరాల ఆక్వాపోనిక్స్ పొలాలలో 40 రకాల కూరగాయలను పండిస్తుంది. కూరగాయల సాగు కోసం 100 ఎకరాల భూమిని పాలీ హౌస్లుగా మార్చేందుకు దాదాపు 150 మంది రైతులకు శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం వారు తమ కూరగాయలు ట్రూగానిక్ బ్రాండ్ పేరుతో విక్రయిస్తున్నారు.
ప్రస్తుతం ఈ స్టార్టప్ కంపెనీ నెల వ్యాపార టర్నోవర్ దాదాపు రూ.80 లక్షల కంటే ఎక్కువగా ఉంది. తొలినాళ్లలో తమకు వ్యవసాయంపై పట్టులేకపోవటం వల్ల కొన్ని తప్పులు చేశామని, అయితే వాటి నుంచి వేగంగా నేర్చుకుని ముందుకు సాగినట్లు ఈ మిత్రులు చెబుతున్నారు. ఈ క్రమంలో తాము చాలా పరిశోధనలను యాక్సెస్ చేశామని, తప్పులను సరిదిద్దుకోవటానికి సలహాదారులు, నిపుణులను సంప్రదించినట్లు వారు వెల్లడించారు. అలా సేంద్రియ పద్ధతుల్లో ఆహారాన్ని పండించటం నేర్చుకున్నట్లు తెలిపారు. ఇది వారికి కరోనా సమయంలో ప్రజలు మంచి ఆహారాలవైపు మరలటంతో మరింత సహాయం చేసిందన్నారు. రానున్న కాలంలో మరింత మంది రైతులతో కాంట్రాక్ట్ ఫార్మింగ్ కోసం చేర్చుకోవటంతో పాటు అనేక నగరాలకు చేరుకోవటానికి లాజిస్టిక్స్ మెరుగుపరుచుకునే పనిలో ఉన్నట్లు వారు చెబుతున్నారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications