Lohit Shetty Success: కొన్ని సంవత్సరాల కిందట వ్యవసాయం వృధా అంటూ రైతన్నను చిన్నచూపు చూసిన సంగతి తెలిసిందే. ఇది ఎంత వరకు వెళ్లిందంటే కేవం ఐటీ కంపెనీలో లక్షల ప్యాకేజీ ఉంటేనే జాబ్ అనే స్థాయికి భారతదేశంలో పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే కొందరు మాత్రం దీనిని పూర్తిగా మార్చేస్తున్నారు. సాగులో ప్రత్యేక కృషితో సొంత గ్రామాల్లోనే ప్రశాంత వాతావరణంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి కంటే ఎక్కువ డబ్బును సంపాదిస్తూ కోటీశ్వరులుగా మారుతున్నారు. అవునండీ బాబు పచ్చని పొలాల నుంచి పచ్చ కరెన్సీ నోట్ల వర్షం కురిపిస్తున్న రైతన్న సెక్సెస్ స్టోరీ చాలా మందికి ఆదర్శంగా నిలుస్తోంది.
కర్ణాటకకు చెందిన 42 ఏళ్ల లోహిత్ శెట్టి వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. 21 ఎకరాల భూమిలో రబ్బరు, కొబ్బరి, తమలపాకులు, జీడిపంటలు పండిస్తున్న తండ్రి, మేనమామలను చూస్తూ పెరిగాడు. చిన్నతనంలో అందరిమాదిరిగానే అనేక ఆశలు ఉన్నప్పటికీ ఆర్థిక సమస్యల కారణంగా చదువును 10వ తరగతి తర్వాత కొనసాగించలేదు. అప్పటి నుంచి ఫ్యామిలీ ఆదాయాన్ని పెంచే పనిలో నిమగ్నమయ్యాడు లోహిత్. ఈ క్రమంలోనే చిన్న దుకాణం నుంచి రెస్టారెంట్ వరకు వ్యాపారాల్లోకి అడుగుపెట్టాడు. కుటుంబ కష్టాలు తీవ్రతరం కావటంతో క్వారీలో ఉద్యోగం సంపాదించాడు. దీని తర్వాత స్వగ్రామానికి దగ్గరలోనే ఉన్న ధర్మస్థలలోని ఒక పొలంలో 10 ఏళ్ల పాటు పనిచేశాడు.

ఈ సమయంలో లోహిత్ రాంబుటాన్, డ్రాగన్ ఫ్రూట్, మాంగోస్టీన్ వంటి విదేశీ పండ్ల రకల సాగుపై శిక్షణ పొందాడు. ఈ క్రమంలో గ్రహించిన అనేక విషయాలతో కుటుంబ ఎదుగుదల వచ్చినట్లు లోహిత్ చెప్పారు. సాగులో అన్ని విషయాలను క్షుణ్ణంగా నేర్చుకున్న తర్వాత 2016లో ఇంటికి తిరిగి వచ్చేశాడు. ఆ సమయంలోనే తన నైపుణ్యాలను లాభదాయకమైన వ్యాపారంగా మార్చేందుకు తాను సైతం రాంబూటాన్, మామిడికాయ, డ్రాగన్ ఫ్రూట్ సాగు కోసం కుటుంబానికి చెందిన 21 ఎకరాలతో పాటు మరో 20 ఎకాల భూమిని కౌలుకు తీసుకున్నారు. కేరళలోని నర్సరీ నుంచి మరిన్ని మొక్కలను సేకరించాడు.
ప్రస్తుతం లోహిత్ పంటలు మరియు కూరగాయలు పండించడంలో ఆసక్తి ఉన్న వ్యక్తులకు కూడా సహాయం చేస్తున్నాడు. ఈ వెంచర్ల ద్వారా ఏటా రూ.కోటికి పైగా సంపాదిస్తున్నాడు. ఒక రాంబుటాన్ మొక్క సంవత్సరానికి 45 కిలోలు, డ్రాగన్ ఫ్రూట్ మొక్క సంవత్సరానికి 300 పండ్లను ఉత్పత్తి చేస్తుంటాయి. అయితే లోహిత్ 12 ఎకరాల భూమిలో రాంబుటాన్ పండిస్తూ 500 డ్రాగన్ ఫ్రూట్ మొక్కలతో రంబుటాన్ కిలో రూ.180-300, మామిడికాయ కిలో రూ.350 -750, డ్రాగన్ ఫ్రూట్ రూ.100-150కి విక్రయిస్తూ భారీ లాభాలను అందుకుంటున్నాడు. మంచి దిగుబడి కోసం లోహిత్ గో ఆధారిత ఎరువులను వినియోగిస్తూ, బిందు సేద్యం పద్దతులను అవలంబిస్తున్నాడు.
ప్రస్తుతం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోయంబత్తూర్, ముంబై, కేరళలోని వినియోగదారులకు నేరుగా తన వ్యవసాయ క్షేత్రం నుంచే పండ్లను సరఫరా చేస్తున్నారు. జీవితంలో విజయం సాధించటానికి పట్టుదల ఉంటే సరిపోతుందని లోహిత్ సక్సెస్ చెబుతోంది. ప్రకృతిని అర్థం చేసుకుంటూ తోటలను సాగు చేయటంలో పట్టు సాధించి భారీగా లాభాలను పొందుతున్నాడు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?



Click it and Unblock the Notifications