Lohit Shetty Success: కొన్ని సంవత్సరాల కిందట వ్యవసాయం వృధా అంటూ రైతన్నను చిన్నచూపు చూసిన సంగతి తెలిసిందే. ఇది ఎంత వరకు వెళ్లిందంటే కేవం ఐటీ కంపెనీలో లక్షల ప్యాకేజీ ఉంటేనే జాబ్ అనే స్థాయికి భారతదేశంలో పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే కొందరు మాత్రం దీనిని పూర్తిగా మార్చేస్తున్నారు. సాగులో ప్రత్యేక కృషితో సొంత గ్రామాల్లోనే ప్రశాంత వాతావరణంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి కంటే ఎక్కువ డబ్బును సంపాదిస్తూ కోటీశ్వరులుగా మారుతున్నారు. అవునండీ బాబు పచ్చని పొలాల నుంచి పచ్చ కరెన్సీ నోట్ల వర్షం కురిపిస్తున్న రైతన్న సెక్సెస్ స్టోరీ చాలా మందికి ఆదర్శంగా నిలుస్తోంది.
కర్ణాటకకు చెందిన 42 ఏళ్ల లోహిత్ శెట్టి వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. 21 ఎకరాల భూమిలో రబ్బరు, కొబ్బరి, తమలపాకులు, జీడిపంటలు పండిస్తున్న తండ్రి, మేనమామలను చూస్తూ పెరిగాడు. చిన్నతనంలో అందరిమాదిరిగానే అనేక ఆశలు ఉన్నప్పటికీ ఆర్థిక సమస్యల కారణంగా చదువును 10వ తరగతి తర్వాత కొనసాగించలేదు. అప్పటి నుంచి ఫ్యామిలీ ఆదాయాన్ని పెంచే పనిలో నిమగ్నమయ్యాడు లోహిత్. ఈ క్రమంలోనే చిన్న దుకాణం నుంచి రెస్టారెంట్ వరకు వ్యాపారాల్లోకి అడుగుపెట్టాడు. కుటుంబ కష్టాలు తీవ్రతరం కావటంతో క్వారీలో ఉద్యోగం సంపాదించాడు. దీని తర్వాత స్వగ్రామానికి దగ్గరలోనే ఉన్న ధర్మస్థలలోని ఒక పొలంలో 10 ఏళ్ల పాటు పనిచేశాడు.

ఈ సమయంలో లోహిత్ రాంబుటాన్, డ్రాగన్ ఫ్రూట్, మాంగోస్టీన్ వంటి విదేశీ పండ్ల రకల సాగుపై శిక్షణ పొందాడు. ఈ క్రమంలో గ్రహించిన అనేక విషయాలతో కుటుంబ ఎదుగుదల వచ్చినట్లు లోహిత్ చెప్పారు. సాగులో అన్ని విషయాలను క్షుణ్ణంగా నేర్చుకున్న తర్వాత 2016లో ఇంటికి తిరిగి వచ్చేశాడు. ఆ సమయంలోనే తన నైపుణ్యాలను లాభదాయకమైన వ్యాపారంగా మార్చేందుకు తాను సైతం రాంబూటాన్, మామిడికాయ, డ్రాగన్ ఫ్రూట్ సాగు కోసం కుటుంబానికి చెందిన 21 ఎకరాలతో పాటు మరో 20 ఎకాల భూమిని కౌలుకు తీసుకున్నారు. కేరళలోని నర్సరీ నుంచి మరిన్ని మొక్కలను సేకరించాడు.
ప్రస్తుతం లోహిత్ పంటలు మరియు కూరగాయలు పండించడంలో ఆసక్తి ఉన్న వ్యక్తులకు కూడా సహాయం చేస్తున్నాడు. ఈ వెంచర్ల ద్వారా ఏటా రూ.కోటికి పైగా సంపాదిస్తున్నాడు. ఒక రాంబుటాన్ మొక్క సంవత్సరానికి 45 కిలోలు, డ్రాగన్ ఫ్రూట్ మొక్క సంవత్సరానికి 300 పండ్లను ఉత్పత్తి చేస్తుంటాయి. అయితే లోహిత్ 12 ఎకరాల భూమిలో రాంబుటాన్ పండిస్తూ 500 డ్రాగన్ ఫ్రూట్ మొక్కలతో రంబుటాన్ కిలో రూ.180-300, మామిడికాయ కిలో రూ.350 -750, డ్రాగన్ ఫ్రూట్ రూ.100-150కి విక్రయిస్తూ భారీ లాభాలను అందుకుంటున్నాడు. మంచి దిగుబడి కోసం లోహిత్ గో ఆధారిత ఎరువులను వినియోగిస్తూ, బిందు సేద్యం పద్దతులను అవలంబిస్తున్నాడు.
ప్రస్తుతం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోయంబత్తూర్, ముంబై, కేరళలోని వినియోగదారులకు నేరుగా తన వ్యవసాయ క్షేత్రం నుంచే పండ్లను సరఫరా చేస్తున్నారు. జీవితంలో విజయం సాధించటానికి పట్టుదల ఉంటే సరిపోతుందని లోహిత్ సక్సెస్ చెబుతోంది. ప్రకృతిని అర్థం చేసుకుంటూ తోటలను సాగు చేయటంలో పట్టు సాధించి భారీగా లాభాలను పొందుతున్నాడు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications