Hyderabad News: హైదరాబాద్కు చెందిన ఓ విద్యార్థి ప్లాస్టిక్ క్యారీబ్యాగ్స్ వల్ల వస్తున్న కాలుష్యాన్ని నివారించాలని నిర్ణయించుకున్నాడు. దీంతో 2022లో Bioreform పేరుతో ఒక కంపెనీని ప్రారంభించి ప్రస్తుతం కోట్లలో వ్యాపారం చేస్తూ సూపర్ సక్సెస్ అయ్యాడు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది మహ్మద్ అజర్ మొయిదీన్ సక్సెస్ స్టోరీ గురించే. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల జరుగుతున్న కాలుష్యాన్ని పరిష్కరించేందుకు మహ్మద్ ప్లాస్టిక్ బ్యాగ్లకు ప్రత్యామ్నాయం బయోడిగ్రేడబుల్, కంపోస్టబుల్ మెటీరియల్తో పర్యావరణ అనుకూలమైన ఉత్పత్తులతో ముందుకొచ్చాడు. దీనికి ముందు 14 ఏళ్ల వయస్సులో ఇన్సూరెన్స్ పాలసీలు విక్రయించటంతో కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాతా లోగో డిజైన్, వెబ్సైట్ డెవలప్మెంట్, క్లీనింగ్ సర్వీసెస్ వంటి వ్యాపారాలను చేశాడు. అయితే కరోనా మహమ్మారి రాక అతని జీవితాన్ని మలుపు తిప్పింది.

2019లో ప్రధానమంత్రి తన ప్రసంగంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిర్మూలించాలని పిలుపునిచ్చినప్పుడు ప్రజలకు పర్యావరణానికి అనుకూలమైన ఫీచర్లతో కూడిన ఉత్పత్తిని తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. బయోపాలిమర్లను ఉపయోగించి బయోటెక్నాలజీ ద్వారా విప్లవాత్మక ఉత్పత్తిని రూపొందించే దిశగా అడుగులు వేశాడు. ఉత్పత్తి వ్యయం అడ్డంకి అయినప్పటికీ.. సరసమైన ధరలకు ఈ ప్యాక్లను తయారు చేయడానికి బయోర్ఫార్మ్ మార్గదర్శకత్వం వహించింది. ప్లాస్టిక్ కిలో రూ.130కి విక్రయిస్తుండగా, బయోరిఫార్మ్ బ్యాగులు కిలో రూ.190కి అందుబాటులోకి తీసుకొచ్చాడు. మెుదటి నుంచి ఈ వ్యాపారం మంచి ఆదరణను అందుకుంది.
ప్రస్తుతం Bioreform ప్యాక్ విక్రయాలు 8 నగరాలకు విస్తరించాయి. 2022-23 మొదటి సంవత్సరంలో వార్షిక ఆదాయం రూ.16 లక్షలు ఉండగా.. ఆ తర్వాత ఏడాది ఆదాయం రూ.1.3 కోట్లకు పెరిగింది. అయితే 2024-25లో రూ.3 నుంచి రూ.3.5 కోట్ల ఆదాయాన్ని చేరుకోవాలని యోచిస్తున్నట్లు మహ్మద్ తెలిపారు. ప్రస్తుతం ఈ కంపెనీలో 11 మంది ఉద్యోగులు పనిచేస్తాయి. తన కంపెనీ ద్వారా పర్యావరణ పరిరక్షణలో భారత్ ను అగ్రగామిగా నిలపాలని అజహర్ భావిస్తున్నాడు. ఇదిని భూమిని ఆరోగ్యవంతంగా మార్చే ఉద్యమంగా చెబుతున్నాడు.


Click it and Unblock the Notifications