Success Story: ఇల్లు తాకట్టుపెట్టి బిజినెస్ స్టార్ట్.. అమెరికా-కెనడాలో కింగ్, పూర్తి వివరాలు..

Mani Krishnan Success: ప్రస్తుత కాలంలో యువత చాలా చిన్న వయస్సులోనే తమ వ్యాపార ఆలోచనలకు ప్రాణం పోయటానికి స్టార్టప్ కంపెనీలను స్థాపిస్తున్నారు. అయితే ఆ పరిస్థితులు కొన్ని దశాబ్ధాల కింద లేవు. వేరే వాళ్ల డబ్బులతో రిస్క్ చేసే అంతటి సాహసాలు ఆ కాలంలో ప్రజలు, వ్యాపారవేత్తలు అస్సలు చేసేవారు కాదు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. మారిన కాలానికి సైతం గతకాలంలోని వ్యాపారవేత్తలే మార్గనిర్థిశకులుగా నిలవటం గమనార్హం.

కానీ ఇప్పుడు ఒక వ్యక్తి తన సక్సెస్ స్టోరీతో యువ వ్యాపారవేత్తలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది మణి కృష్ణన్ సుబ్రహ్మణియన్ సక్సెస్ స్టోరీ గురించే. తమిళనాడులోని చిన్న టౌన్ తిరున్వేలిలో ఆయన పుట్టారు. ముంబైలో కొంత కాలం అకౌంటెంట్ జాబ్ చేసిన ఆయన తర్వాత 1977లో అమెరికాలోని సాన్ జోస్ ప్రాంతంలో స్థిరపడ్డారు. అక్కడే ఒక టెక్ కంపెనీలో ఉద్యోగానికి చేరారు. ఆ తర్వాత హార్డ్ డిస్కులు, మథర్ బోర్డులు ఎగుమతిచేయటం ప్రారంభించాడు. ఇదే క్రమంలో అమెరికాలోని భారతీయులు ఇష్టపడే కాఫీతో పాటు ఇడ్లీ, దోశ పిండి తయారీ వ్యాపారంలోకి కూడా దిగారు. ఇంటికి దూరంగా ఉండే ప్రజలు వీరి ఉత్పత్తులను భారీగా ఆదరించటం ప్రారంభించారు.

Know success story of Dosa King Mani Krishnan of Shastha Foods in USA

దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఎక్కువగా ఇడ్లీ, దోశ తినటం సహజమే. అయితే వాటిని తయారు చేసుకునేందుకు ఎక్కువ సమయం పట్టడంతో చాలా మంది ఇబ్బంది పడటాన్ని గమనించి ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేసినట్లు మణి పేర్కొన్నారు. 2003లో ఈ వ్యాపారాన్ని ప్రారంభించిన తొలినాళ్లలో చేతిలో చాలా తక్కువ డబ్బు మిగలటంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమయంలో భార్య ఆనంది ఆయనకు తోడుగా నిలిచి పిండి తయారీ నుంచి లేబులింగ్, పంపిణీ వరకు ప్రతిదానిలోనూ సహాయంగా నిలిచారు. ఉదయాన్నే లేచిన తర్వాత 7 గంటలకల్లా గ్రైండర్ల దగ్గరకు చేరుకుని పిండి తయారు చేయటం ప్రారంభించేవారు. తయారీ తర్వాత వీటిని శాన్ జోస్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని స్టోర్ల యజమానులను ఒప్పించి సేల్ చేయటాన్ని మణి చూసుకునేవారు.

అయితే ఏడాదిలోనే మణి ప్రారంభించిన శాస్థా ఫుడ్స్ తన అన్ని అప్పులను తీర్చేసింది. దీంతో డెలివరీ సిస్టమ్ నుంచి రిఫ్రిజరేటెడ్ ట్రక్కుల వరకు అన్నింటినీ అప్‌గ్రేడ్ చేశారు. ప్రస్తుతం డజనుకు పైగా రిఫ్రిజిరేటెడ్ ట్రక్కులు ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. వీటి తయారీ కోసం ముడి సరుకులను ఆఫ్రికా, దుబాయ్, అమెరికా నుంచి కొనుగోలు చేస్తున్నారు. ప్రధాన కార్యాలయంలో ప్రతిరోజూ 12,500 కిలోల పిండిని తయారు చేయబడుతోంది. ఈ ప్రక్రియ పూర్తిగా ఆటోమేటెడ్. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా గంటకు నాలుగు కంటైనర్ల స్టాక్ విక్రయించబడుతోందని వెల్లడైంది. ప్రస్తుతం ప్రంపచవ్యాప్తంగా ఆర్గానిక్ ఉత్పత్తులకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ కారణంగా కంపెనీ 2017లో వీటిని కూడా స్టార్ట్ చేసింది.

ప్రస్తుతం కంపెనీ బ్యాటర్ బిజినెస్ నుంచి పచ్చళ్ల వరకు దాదాపు 600లకు పైగా ఉత్పత్తులను విక్రయిస్తోంది. ప్రస్తుతం చాలా స్టోర్లు ఈ ఉత్పత్తులను విక్రయించటానికి అంగీకరించటంతో వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది. వీరి ఉత్పత్తుల్లో కింగ్ దోశ పిండి. కంపెనీ దాదాపు 16 వివిధ రకాల దోశపిండెలను ప్రస్తుతం మార్కెటింగ్ చేస్తోంది. దీంతో అమెరికా, కెనడా వ్యాప్తంగా భారతీయ ప్రజలకు మణి ఉత్పత్తులు రోజువారీ అవసరాలను తీర్చుతున్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+