Success Story: తెలుగు గడ్డపై పుట్టి.. అమెరికా కంపెనీని నడిపిస్తూ.. తెలుగు సీఈవో సక్సెస్ స్టోరీ

Adobe Ceo: ప్రస్తుత గ్లోబలైజేషన్ సమయంలో కంపెనీలు ప్రతిభ కలిగినవారికే పట్టం కడుతున్నాయి. ఈ క్రమంలో చాలా అమెరికన్ టెక్ కంపెనీలకు నాయకత్వం వహించే బాధ్యతలు భారత సంతతికి చెందిన వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయి. అలా తెలుగు గడ్డపై పుట్టి అంతర్జాతీయ కంపెనీని నడిపిస్తున్న వ్యక్తి విజయగాథను ఇప్పుడు తెలుసుకుందాం.

మన హైదరాబాదీ..

మన హైదరాబాదీ..

ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది అడోబ్ సీఈవో శంతను నారాయణ్ గురించే. ఆయన ప్రస్తుతం ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్‌వేర్ కంపెనీ అడోబ్ సిస్టమ్స్‌కి నాయకత్వం వహిస్తున్నారు. ప్రపంచంలో అత్యంత విజయవంతమైన వ్యాపార నిర్వాహకుల్లో ఒకరిగా శంతను నిలిచారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన ఆయన ఆ తర్వాత హాస్ స్కూల్ ఆఫ్ బిజినెస్, యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో చదివారు. బర్కిలీలో ఎంబీఏ కూడా పూర్తి చేశారు.

ఆపిల్‌ కంపెనీతో కెరియర్ స్టార్ట్..

ఆపిల్‌ కంపెనీతో కెరియర్ స్టార్ట్..

తెలుగు తేజం శంతను నారాయణ్ సాఫ్ట్‌వేర్, ఇంటర్నెట్ పరిశ్రమలోకి ప్రవేశించారు. ఆ తర్వాత ఆయన ఐఫోన్ మేకర్ ఆపిల్ కంపెనీలో తన తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత పిక్ట్రా పేరుతో ఒక కంపెనీని సొంతంగా ఏర్పాటు చేశారు. ప్రపంచంలోని మొట్టమొదటి ఇంటర్నెట్ ఫోటో షేరింగ్ కంపెనీల్లో ఇది కూడా ఒకటి కావటం విశేషం. ఈ కంపెనీని విజయవంతంగా నడిపి సాఫ్ట్‌వేర్ ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు. ఫోటో షేరింగ్ రంగంలో అతని కృషి 1998లో అడోబ్ సిస్టమ్స్‌లో చేరేలా చేసింది.

కేవలం 10 ఏళ్లలో..

కేవలం 10 ఏళ్లలో..

అడోబ్ సిస్టమ్స్ కంపెనీలో 10 ఏళ్ల పాటు వివిధ స్థాయిల్లో పనిచేసిన తర్వాత శంతను నారాయన్ కంపెనీకి సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. తొలుత ఆయన అడోబ్‌లో గ్లోబల్ ప్రొడక్ట్ రీసెర్చ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా కెరీర్ ప్రారంభించారు. శంతను రాకతో అడోబ్ పురోగతి కొత్త పుంతలు తొక్కింది. కంపెనీ లాభాలు, ఆదాయం అనేక రెట్లు పెరిగింది. కంపెనీ దాదాపుగా 350 విజయవంతమైన ఒప్పందాలను కలిగి ఉంది. అడోబ్ ఫ్లాష్ ప్లే కు నారాయణ్ బాధ్యతలు వహిస్తున్నారు.

హైదరాబాద్ సదస్సులో..

హైదరాబాద్ సదస్సులో..

ఇటీవల తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జరిగిన టై గ్లోబల్ సమ్మిట్ ప్రారంభోత్సవానికి అడోబ్ సీఈవో శంతను నారాయణ్ అతిథిగా హాజరయ్యారు. సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం వ్యాపార వాతావరణం చాలా బాగుందని.. తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు, కార్యదర్శి జయేష్ రంజన్ కృషిని అభినందించటం దేశంలో హైదరాబాద్ కు ఉన్న బ్రాండ్ ఇమేజ్ ను మరింత పెంచుతోంది. ప్రస్తుత కాలంలో తాను పుట్టి హైదరాబాద్‌లో పెరిగి ఉంటే ఉద్యోగరీత్యా అమెరికా వెళ్లేవాడిని కాదని సమావేశంలో ఆయన అనటం భారత ఐటీ పురోగతిలో హైదరాబాద్ పాత్రకు అద్ధం పడుతోంది.

వార్షిక వేతనం..

వార్షిక వేతనం..

అడోబ్ కంపెనీలో సీఈవోగా ఉన్న శంతను ఏడాదికి రూ.4,500 కోట్లను జీతనంగా అందుకుంటున్నారు. ఆయన మెుత్తం ఆస్తి విలువ దాదాపుగా రూ.85,000 కోట్లుగా ఉందని తెలుస్తోంది. 2013లో శంతను జీతం 15.7 మిలియన్ డాలర్లుగా ఉంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+