Slum Princess: ముంబై ధారావికి చెందిన 15 ఏళ్ల అమ్మాయి మలీషా ఖర్వా. తన ప్రతిభతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ బుల్లి మోడల్ నిరాడంబరమైన కుటుంబ నేపథ్యం నుంచి వచ్చింది.
మూడేళ్ల క్రితం 'ది ప్రిన్సెస్ ఆఫ్ స్లమ్స్'ని ఒక హాలీవుడ్ దర్శకుడు కనుగొన్నాడు మరియు అప్పటి నుండి ఆమె వెనుదిరిగి చూడలేదు. ఆమె ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తోంది. ముంబైలోని ధారవి స్లమ్కు చెందిన మలీషా ఖర్వా.. లగ్జరీ బ్యూటీ బ్రాండ్ ఫారెస్ట్ ఎసెన్షియల్స్ కొత్త ప్రచారమైన 'The Yuvati Collection' ఉత్పత్తులపై మెరిసింది.

ఏప్రిల్ నెలలో ఫారెస్ట్ ఎసెన్షియల్స్ మలీషా ఖర్వాకు చెందిన ఒక వీడియోను తమ అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఉంచింది. అందులో ఆమె క్యాంపెయిన్ ఫోటోలను సైతం కంపెనీ ఉంచింది. ఆమె కోరుకున్న కలల జీవితం ఒక్కసారిగా కళ్ల ముందు ఆవిష్కుతం కావటంతో మలీషా ఖర్వా ఆనందానికి అవదుల్లనే దృశ్యం ఇప్పుడు వైరల్గా మారింది.
ప్రజలు తనను మురికివాడల్లో నివసించే అమ్మాయిగా భావిస్తారని, కానీ నేను నా జీవితాన్ని ప్రేమిస్తున్నానని మలీషా ఖర్వా తన ఇన్స్టాలో వెల్లడించింది. తాను ఒక సూపర్ మోడల్ గా మారి తన కుటుంబాన్ని పోషించటాలని అనుకుంటున్నానని వెల్లడించింది. ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్లో 225,000 మంది ఫాలోవర్లతో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మలీషా మారిపోయింది. ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ సృష్టికర్తగా ఆమె ప్రయాణంతో నటన, మోడలింగ్లో నైపుణ్యాలు అభివృద్ధి చెందాయి.
ఇప్పటికే రెండు హాలీవుడ్ సినిమా ఆఫర్లను సొంతం చేసుకుంది మోడల్ మలీషా. ఆమె అర్సాలా ఖురేషి, జాస్ సాగూ రూపొందించిన "లివ్ యువర్ ఫెయిరీ టేల్" అనే షార్ట్ ఫిల్మ్లో కూడా కనిపించింది. యూట్యూబ్లో ప్రైమ్ చేసిన ఈ చిత్రం ప్రొఫెషనల్ నటీనటులను కలిగి ఉండదు. జీవితంలో మొదటిసారిగా రెస్టారెంట్లో భోజనం చేసే ఐదుగురు మురికివాడల పిల్లల అనుభవాన్ని ఇందులో చక్కగా చిత్రీకరించారు.


Click it and Unblock the Notifications