Ratan Tata Property: ఈ అక్టోబర్ 9న దేశంలో అందరికీ నచ్చే రతన్ టాటా దివంగతులయ్యారు. తన 86వ ఏట టాటా అనారోగ్యంతో ముంబైలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. దీంతో రతన్ టాటా మరణం తర్వాత టాటా ట్రస్ట్స్ కొత్త ఛైర్మన్ గా సవతి సోదరుడు నోయెల్ టాటా బాధ్యతలు చేపట్టారు. అయితే ఇప్పుడు రతన్ టాటా ఆస్థులు ఎవరికి వెళతాయనే చర్చ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎందుకంటే పెళ్లి చేసుకోని వ్యాపారవేత్తకు వారసులు లేకపోవటమే దీనికి కారణం.
ఇప్పుడు రతన్ టాటా సంకల్పంతో తీసుకున్న నిర్ణయం నెరవేరాల్సి ఉంది. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, రతన్ టాటా వీలునామాను అమలు చేయడానికి న్యాయవాది డారియస్ ఖంబటా, అతని సన్నిహితుడు మెహ్లీ మిస్త్రీ మరియు అతని సవతి సోదరీమణులు షిరీన్ మరియు డీన్నా జెజీబోయ్లను నియమించారు. ఇప్పుడు రతన్ టాటా సంకల్పంతో తీసుకున్న నిర్ణయం నెరవేరాల్సి ఉంది. ప్రముఖ వార్తా పత్రికల్లో కథనం ప్రకారం.. రతన్ టాటా వీలునామాను అమలు చేయడానికి న్యాయవాది డారియస్ ఖంబటా, అతని సన్నిహితుడు మెహ్లీ మిస్త్రీ, సవతి సోదరీమణులు షిరీన్, డీన్నా జెజీబోయ్లను నియమించారని వెల్లడైంది.

హురున్ ఇండియా రిచ్ లిస్ట్ నివేదిక ప్రకారం టాటా సన్స్లో రతన్ టాటాకు 0.83 శాతం వాటాలు ఉన్నాయి. దీని ప్రకారం రతన్ టాటా నికర విలువ రూ.7,900 కోట్లుగా ఉంది. రతన్ టాటా ఆస్థిలో ఎక్కువ భాగం టాటా సన్స్లో వాటాల రూపంలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు రతన్ టాటా అనేక స్టార్టప్ కంపెనీల్లో కీలక పెట్టుబడులను కలిగి ఉన్నారు. దేశంలోని సక్సెస్ఫుల్ స్టార్టప్ వెంచర్లుగా ఉన్న పేటీఎం, ఓలా, ట్రాక్ఎక్స్ఎన్, ఫస్ట్క్రై, బ్లూస్టోన్, కార్దేఖో, క్యాష్కరో, అర్బన్ కంపెనీ, అప్స్టాక్స్ సహా మరిన్ని కంపెనీల్లో తొలినాళ్లలో పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం ఆయన ఇన్వెస్ట్ చేసిన అనేక స్టార్టప్ కంపెనీలు మంచి వృద్ధిని సాధించి అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. దీనికి తోడు టాటాకు ముంబైలోని కోలాబా, అలీబాగ్లలో ఇళ్లు కూడా ఉన్నాయి.
ప్రస్తుతం టాటా తన వీలునామాలో ఆస్తులతో పాటు పెట్టుబడులకు సంబంధించిన వివరాలు గోప్యంగా ఉంచబడుతున్నాయి. సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్ లకు ట్రస్టీగా మెహ్లీ మిస్త్రీ ఉన్నారు. వాస్తవానికి మెహ్లీ రతన్ టాటాకు మంచి సన్నిహితుడు. ఈ రెండు ట్రస్టులు కలిపి సంయుక్తంగా టాటా సన్స్లో 52 శాతం వాటాను హోల్డ్ చేస్తున్నాయి. టాటా సన్స్లో టాటా ట్రస్ట్ల మొత్తం వాటా 66 శాతంగా ఉండగా.. లిస్టెడ్ కంపెనీల్లో టాటా సన్స్ మార్కెట్ విలువ రూ.16.71 లక్షల కోట్లుగా ఉందని తెలుస్తోంది. దివంగతులైన రతన్ టాటా వీలువామా సిద్ధం చేయటంలో సీనియర్ న్యాయవాది డారియస్ ఖంబట్టా సహకరించినట్లు వెల్లడైంది.


Click it and Unblock the Notifications