Budget 2024: సామాన్యుల కోరికల జాబితా.. నిర్మలమ్మ నిర్ణయం ఎటో..?

Budget News: ప్రతి ఏటా ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతుంది కేంద్రంలో అధికార పార్టీ. అయితే ఎన్నికలకు ముందర వచ్చే బడ్జెట్ చాలా కీలకమైనది. పైగా అటు ఎన్నికల తాయిలాలు.. ఇటు ప్రజాభీష్టాలు ఏకకాలంలో నెరవేర్చేందుకు ఇదొక వేధికగా రాజకీయ పార్టీలు భావిస్తుంటాయి.

ఈ క్రమంలో 2024లో వస్తున్న మధ్యంతర బడ్జెట్ పార్లమెంట్ ఎన్నికల్లో కొత్త ప్రభుత్వం ఎన్నికయ్యేంత వరకు ఆదాయ వ్యయాల కోసం మాత్రమే ఉద్ధేశించబడినది. ప్రజలు మాత్రం కోటి ఆశలతో చూస్తున్నప్పటికీ.. మధ్యంతర బడ్జెట్‌లో ఎలాంటి అద్భుతమైన ప్రకటనలు ఉండవని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత నెలలోనే చెప్పిన సంగతి తెలిసిందే.

Exemptions and rate cuts that common man expecting from budget 2024

ఏదేమైనా ద్రవ్యోల్బణ వాతావరణంలో ఆర్థిక వ్యవస్థ బాగా పనిచేసినందున, ఇప్పటికే ఉన్న నిబంధనల్లో ఏవైనా క్రమరాహిత్యాలను తొలగించడానికి, సాధారణ పన్ను చెల్లింపుదారుల చేతిలో పొదుపులను పెంచడానికి కొన్ని మార్పులు ప్రకటించబడవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత బడ్జెట్ ప్రసంగంలో పన్ను విధానంలో కొన్ని మార్పులు చేసిన సంగతి తెలిసిందే. అయితే పన్ను రేట్లలో, ప్రత్యేకించి వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల కోసం ప్రభుత్వం ఎటువంటి తీవ్రమైన మార్పులను ప్రవేశపెట్టే అవకాశం లేదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వ్యక్తులకు వర్తించే 25 శాతం సర్‌ఛార్జ్ గరిష్ఠ రేటును తగ్గించడాన్ని ప్రభుత్వం పరిశీలించొచ్చని తెలుస్తోంది.

ప్రభుత్వం కొత్త తయారీ కంపెనీలకు 15 శాతం లాభదాయకమైన పన్ను రేటును ప్రస్తుత మార్చి 2024కి మించి పొడిగించే అవకాశం ఉంది. ఇది మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహించే విధానానికి అనుగుణంగా ఉంటుంది. పెట్టుబడి ఆధారిత తగ్గింపులను ప్రోత్సహించడం నుంచి ప్రభుత్వం క్రమంగా వైదొలిగింది. పెరుగుతున్న ఆదాయ స్థాయిలు, ద్రవ్యోల్బణం కారణంగా వీటిపై ఉంచిన రూ.1,50,000 పరిమితి ఇప్పటికే తక్కువగా పరిగణించబడుతుంది. పైగా ఇది దేశీయ పొదుపు రేటులో క్షీణతకు దారితీసింది.

ఈ తరుణంలో మ్యూచువల్ ఫండ్స్, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు, ఈటీఎఫ్‌లు వంటి స్టాక్ మార్కెట్‌లకు అనుసంధానించబడిన పెట్టుబడులకు పరిమితులను పెంచడాన్ని ప్రభుత్వం పరిగణించవచ్చు. అలాగే వ్యక్తులు చెల్లించే ఆరోగ్య బీమా ప్రీమియంలకు తగ్గింపులకు అందుబాటులో ఉన్న పరిమితులను పెంచడం కూడా వైద్య ఖర్చుల పెరుగుదలను పరిగణనలోకి తీసుకోవచ్చు. అలాగే ఆస్తి అమ్మకంపై చెల్లించాల్సిన మూలధన లాభాల పన్ను నుంచి మినహాయింపులను క్లెయిమ్ చేయడం కోసం వ్యక్తులు ప్రస్తుతం NHAI బాండ్లలో రూ.50 లక్షల వరకు పెట్టుబడులు పెట్టడానికి అనుమతించబడ్డారు. అయితే ఈ పరిమితిని కోటికి పెంచటాన్ని పరిగణించవచ్చు.

అలాగే స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు చెల్లించే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ చార్జీలు అన్యాయమైనవని చాలా మంది భావిస్తుంటారు. అందువల్ల ఈ రేటును ఈ బడ్జెట్లో తగ్గించే అవకాశాలపై ప్రభత్వం దృష్టి పెట్టొచ్చని ప్రజలు కోరుకుంటున్నారు. పార్లమెంటరీ ఎన్నికలకు ముందు ప్రభుత్వం అవలంబించే విధానం, పన్ను చట్టాల్లో ఏ మేరకు మార్పులు చేయాలనుకుంటున్నది చూడటం ఆసక్తికరంగా ఉంటుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+