Tata Group: 33 ఏళ్లకే టాటా కంపెనీకి సీఈవో.. అసలు ఎవరు ఈ అవనీ.. పూర్తి వివరాలు
Tata Group: చాలా మంది తమ కెరీర్ ప్లానింగ్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న తరుణంలో పిన్న వయస్సులోనే అవనీ అనే యువతి సంచలనం సృష్టించింది. తన 33వ ఏటనే టాటా గ్రూప్ లోని ఒక కంపెనీకి సీఈవోగా మారింది.
ముంబైకి చెందిన అవనీ దావ్డా ప్రతిష్టాత్మక HR కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుంచి బ్యాచిలర్ డిగ్రీతో తన విద్యా ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత నర్సీ మోంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత 2002లో టాటా గ్రూప్లో వారి ఫ్లాగ్షిప్ లీడర్షిప్ ప్రోగ్రామ్ టాటా అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్లో చేరింది. ఇది ఆమె జీవితాన్ని పెద్ద మలుపు తిప్పింది. అప్పటి నుంచి ఆమె వివిధ టాటా కంపెనీలలో శ్రద్ధగా పనిచేసింది.

అవనీ దావ్డా టాటా సన్స్ డైరెక్టర్ RK కృష్ణ కుమార్తో కలిసి పనిచేసింది. కుమార్ టాటా గ్లోబల్ బెవరేజెస్ లిమిటెడ్, స్టార్బక్స్ కాఫీ కంపెనీ మధ్య జాయింట్ వెంచర్ను పర్యవేక్షించడానికి అవనిని ఎంచుకున్నారు. ఆమె సామర్థ్యాన్ని, విశేషమైన లక్షణాలను గుర్తించారు. ఈ క్లిష్టమైన చర్య టాటా స్టార్బక్స్ CEOగా మారేందుకు అవనీని ముందంజలో ఉంచింది. ప్రస్తుతం అవనీ స్టార్బక్స్ కాఫీ కంపెనీ, టాటా గ్లోబల్ బెవరేజెస్ లిమిటెడ్ మధ్య 50/50 జాయింట్ వెంచర్ అయిన టాటా స్టార్బక్స్ ప్రైవేట్ లిమిటెడ్కు సీఈవోగా పనిచేస్తున్నారు.
గడచిన మూడేళ్లుగా టాటా స్టార్బక్స్ దేశవ్యాప్తంగా 85 కంటే ఎక్కువ స్టోర్లను ప్రారంభించింది. ప్రధానంగా మెట్రో నగరాల్లో వీటి ఏర్పాటు జరిగింది. స్టోర్ల వేగవంతమైన విస్తరణ వెనుక అవనీ పాత్ర ఉంది. టాటా స్టార్బక్స్ సీఈవోగా విజయవంతమైన తర్వాత.. అవనీ దావ్డా కొత్త ఛాలెంజ్ని ప్రారంభించారు. ఆమె గోద్రెజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన గోద్రెజ్ నేచర్స్ బాస్కెట్ లిమిటెడ్లో మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించింది.


Click it and Unblock the Notifications