Accenture layoffs: టెక్ దిగ్గజం యాక్సెంచర్ ఉద్యోగుల తొలగింపుల విషయంలో సంచలన ప్రకటన చేసింది. ప్రస్తుత వ్యాపార మందగమనం కారణంగా వ్యూహాత్మక ముందడుగులో భాగంగా ఉద్యోగులను భారీగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది. రానున్న 18 నెలల కాలంలో దాదాపు 19,000 మందికి ఉద్వాసన పలకాలని నిర్ణయించినట్లు వెల్లడించటం ఐటీ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించినప్పటికీ అందులో భారతీయ వ్యాపారంపై ఎలాంటి ప్రభావం ఉండనుందనే విషయాన్ని మాత్రం కంపెనీ బహిర్గతం చేయలేదు. గణాంగాల ప్రకారం యాక్సెంచర్ కు ఇండియాలో దాదాపు 3 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఇది కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెుత్తం ఉద్యోగుల సంఖ్యలో దాదాపు 40 శాతం. ఈ క్రమంలో లేఆఫ్ ప్రకటన సమయంలో ఇండియన్ టెక్కీలు కూడా భారీగానే ప్రభావితం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

కంపెనీ భారతదేశంలో అతిపెద్ద పాదముద్రను కలిగి ఉంది. అభివృద్ధి, మార్కెట్, వ్యాపారాల పరంగా కూడా కంపెనీకి ఇండియా చాలా కీలకమైనది. కంపెనీ తాజాగా ప్రకటించిన తొలగింపుల్లో సగానికిపైగా ఉద్యోగులు బిల్ చేయని కార్పొరేట్ విధుల్లో ఉన్నారని యాక్సెంచర్ తెలిపింది. ఈ తొలగింపులలో దాదాపు సగం FY23లో లేదా ఆగస్టు 31కి ముందు ఉంటాయని చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ KC మెక్క్లూర్ స్పష్టం చేశారు.

కంపెనీ ఉద్యోగుల తొలగింపులు, సిబ్బంది ఖర్చుల కోసం దాదాపు 1.2 బిలియన్ డాలర్ల మెుత్తాన్ని వెచ్చించాలని నిర్ణయించింది. 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో వ్యాపార ఆప్టిమైజేషన్ ఖర్చుల కోసం కంపెనీ వెచ్చించనున్న 1.5 బిలియన్ డాలర్లలో ఇది భాగమని కంపెనీ వెల్లడించింది. కంపెనీ ఆదాయం 8-11 శాతం మధ్య తగ్గే అవకాశం ఉన్నట్లు కంపెనీ ఇప్పటికే అంచనా వేసింది. కంపెనీ బ్యాలెన్స్ షీట్ బలపరిచేందుకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా 7.38 లక్షల మంది ఉద్యోగులను కలిగి ఉంది. తాజా త్రైమాసికంలో కంపెనీ దాదాపు 22 బిలియన్ డాలర్ల విలువైన ప్రాజెక్టులను సాధించింది.
More From GoodReturns

నోకియా నుంచి 14 వేల మంది రోడ్డు మీదకు.. టెలికాం రంగంలో ప్రకంపనలు రేపుతున్న తాజా లేఆప్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications