Loan: పర్సనల్ లోన్స్ తీసుకునే వారికి షాకింగ్ వార్త.. RBI మార్చిన రూల్స్‌తో ఇబ్బందులే..

Personal Loan: బ్యాంకింగ్ సేవలు డిజిటలైజేషన్ వేగంగా జరగటంతో ప్రజలకు ప్రస్తుతం లోన్స్ నుంచి పెట్టుబడుల వరకు అన్ని ఆర్థికపరమైన అంశాలు నిమిషాల్లో పూర్తి చేసుకుంటున్నారు. ఈ క్రమంలో చాలా మంది సులువుగా రుణ సౌకర్యాలను పొందుతున్న సంగతి తెలిసిందే.

తాజాగా పర్సనల్ లోన్స్ కి సంబంధించిన రూల్స్ లో రిజర్వు బ్యాంక్ కీలక మార్పులను చేసింది. దీని వల్ల ఏకకాలంలో అనేక పర్సనల్ లోన్స్ పొందుతున్న వ్యక్తులకు ఇబ్బందులు పెరగవచ్చని తెలుస్తోంది. మార్చబడిన రూల్స్ ప్రకారం రుణం ఇచ్చే బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు అటువంటి ఖాతాదారుల క్రెడిట్ బ్యూరో రికార్డులను 15 రోజుల్లోగా అప్‌డేట్ చేయాల్సి ఉంటుందని రిజర్వు బ్యాంక్ వెల్లడించింది. గతంలో ఫైనాన్షియల్ సంస్థలు వీటిని నెలకు ఒకసారి అప్ డేట్ చేసేవి. ప్రస్తుతం కొత్త నిబంధనలు రుణగ్రహీతల నష్టాన్ని బాగా అంచనా వేసేందుకు దోహదపడుతోందని ఆర్బీఐ వెల్లడించింది.

Know how RBI New rules may impact people going for multiple personal loans

పర్సనల్ లోన్స్ విషయంలో ఒకటి కంటే ఎక్కువ రుణాలను కలిగి ఉన్న వ్యక్తి సదరు ఈఎంఐలు వేరువేరు తేదీల్లో ఉంటాయి. ఈ క్రమంలో వాయిదా చెల్లించటంలో విఫలమైనప్పుడు దీనికి సంబంధించిన సమాచారాన్ని నెలకు ఒకసారి క్రెడిట్ రికార్డుల్లోకి ఎక్కించటం ద్వారా ఆర్థిక సంస్థలు సమాచారాన్ని పొందటానికి 40 రోజులు సమయం పడుతుంది. దీనివల్ల వ్యక్తులు ఈ సమయంలో మరో ఫైనాన్స్ సంస్థ నుంచి ఈ కాలంలో రుణం పొందే అవకాశం ఉన్నందున ఆర్థిక సంస్థలపై ప్రభావం ఉంటుందని రిజర్వు బ్యాంక్ భావిస్తోంది. అందుకే తరుచుగా పర్సనల్ లోన్స్ తీసుకునే వ్యక్తుల విషయంలో వివరాలను 15 రోజులకు ఒకసారి అప్‌డేట్ చేయటం వల్ల జాప్యాలు తగ్గి డిఫాల్టర్ల వివరాలను బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు వెంటనే పొందటానికి వీలు ఉంటుందని, తద్వారా సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోగలవని రిజర్వు బ్యాంక్ భావిస్తోంది.

వాస్తవానికి రుణాలను అందించే ఆర్థిక సంస్థలకు ఇది పెద్ద ప్రయోజనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది రుణగ్రహీతలు పాత రుణాలను చెల్లించటం కోసం కొత్తగా మరో సంస్థ నుంచి రుణాన్ని పొందుతుంటారు. దీనిని ఎవర్ గ్రీనింగ్ అని పిలుస్తుంటారు. ఇలాంటి వ్యక్తులు రుణ చెల్లింపుల విషయంలో డిఫాల్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

అందువల్ల రిజర్వు బ్యాంక్ పర్సనల్ లోన్స్ విషయంలో తెస్తున్న కొత్త నిబంధనలు ఆర్థిక సంస్థలకు రుణగ్రహీత గురించి స్పష్టమైన అభిప్రాయాన్ని పొందేందుకు దోహదపడతాయి. వాస్తవానికి రిజర్వు బ్యాంక్ ఆగస్టు 2024లో దీనికి సంబంధించిన ఆదేశాలను జారీ చేసింది. దేశంలోని రుణ సంస్థలు, క్రెడిట్ బ్యూరోలు దీనికి తగినట్లుగా తమ సిస్టమ్‌లను అప్‌డేట్ చేసేందుకు జనవరి 1, 2025 వరకు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇది ప్రజల్లో కూడా అనవసరంగా రుణాలు తీసుకునే ధోరణిని తగ్గిస్తుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+