Personal Loan: బ్యాంకింగ్ సేవలు డిజిటలైజేషన్ వేగంగా జరగటంతో ప్రజలకు ప్రస్తుతం లోన్స్ నుంచి పెట్టుబడుల వరకు అన్ని ఆర్థికపరమైన అంశాలు నిమిషాల్లో పూర్తి చేసుకుంటున్నారు. ఈ క్రమంలో చాలా మంది సులువుగా రుణ సౌకర్యాలను పొందుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా పర్సనల్ లోన్స్ కి సంబంధించిన రూల్స్ లో రిజర్వు బ్యాంక్ కీలక మార్పులను చేసింది. దీని వల్ల ఏకకాలంలో అనేక పర్సనల్ లోన్స్ పొందుతున్న వ్యక్తులకు ఇబ్బందులు పెరగవచ్చని తెలుస్తోంది. మార్చబడిన రూల్స్ ప్రకారం రుణం ఇచ్చే బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు అటువంటి ఖాతాదారుల క్రెడిట్ బ్యూరో రికార్డులను 15 రోజుల్లోగా అప్డేట్ చేయాల్సి ఉంటుందని రిజర్వు బ్యాంక్ వెల్లడించింది. గతంలో ఫైనాన్షియల్ సంస్థలు వీటిని నెలకు ఒకసారి అప్ డేట్ చేసేవి. ప్రస్తుతం కొత్త నిబంధనలు రుణగ్రహీతల నష్టాన్ని బాగా అంచనా వేసేందుకు దోహదపడుతోందని ఆర్బీఐ వెల్లడించింది.

పర్సనల్ లోన్స్ విషయంలో ఒకటి కంటే ఎక్కువ రుణాలను కలిగి ఉన్న వ్యక్తి సదరు ఈఎంఐలు వేరువేరు తేదీల్లో ఉంటాయి. ఈ క్రమంలో వాయిదా చెల్లించటంలో విఫలమైనప్పుడు దీనికి సంబంధించిన సమాచారాన్ని నెలకు ఒకసారి క్రెడిట్ రికార్డుల్లోకి ఎక్కించటం ద్వారా ఆర్థిక సంస్థలు సమాచారాన్ని పొందటానికి 40 రోజులు సమయం పడుతుంది. దీనివల్ల వ్యక్తులు ఈ సమయంలో మరో ఫైనాన్స్ సంస్థ నుంచి ఈ కాలంలో రుణం పొందే అవకాశం ఉన్నందున ఆర్థిక సంస్థలపై ప్రభావం ఉంటుందని రిజర్వు బ్యాంక్ భావిస్తోంది. అందుకే తరుచుగా పర్సనల్ లోన్స్ తీసుకునే వ్యక్తుల విషయంలో వివరాలను 15 రోజులకు ఒకసారి అప్డేట్ చేయటం వల్ల జాప్యాలు తగ్గి డిఫాల్టర్ల వివరాలను బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు వెంటనే పొందటానికి వీలు ఉంటుందని, తద్వారా సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోగలవని రిజర్వు బ్యాంక్ భావిస్తోంది.
వాస్తవానికి రుణాలను అందించే ఆర్థిక సంస్థలకు ఇది పెద్ద ప్రయోజనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది రుణగ్రహీతలు పాత రుణాలను చెల్లించటం కోసం కొత్తగా మరో సంస్థ నుంచి రుణాన్ని పొందుతుంటారు. దీనిని ఎవర్ గ్రీనింగ్ అని పిలుస్తుంటారు. ఇలాంటి వ్యక్తులు రుణ చెల్లింపుల విషయంలో డిఫాల్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అందువల్ల రిజర్వు బ్యాంక్ పర్సనల్ లోన్స్ విషయంలో తెస్తున్న కొత్త నిబంధనలు ఆర్థిక సంస్థలకు రుణగ్రహీత గురించి స్పష్టమైన అభిప్రాయాన్ని పొందేందుకు దోహదపడతాయి. వాస్తవానికి రిజర్వు బ్యాంక్ ఆగస్టు 2024లో దీనికి సంబంధించిన ఆదేశాలను జారీ చేసింది. దేశంలోని రుణ సంస్థలు, క్రెడిట్ బ్యూరోలు దీనికి తగినట్లుగా తమ సిస్టమ్లను అప్డేట్ చేసేందుకు జనవరి 1, 2025 వరకు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇది ప్రజల్లో కూడా అనవసరంగా రుణాలు తీసుకునే ధోరణిని తగ్గిస్తుంది.
More From GoodReturns

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications