Personal Loan: బ్యాంకింగ్ సేవలు డిజిటలైజేషన్ వేగంగా జరగటంతో ప్రజలకు ప్రస్తుతం లోన్స్ నుంచి పెట్టుబడుల వరకు అన్ని ఆర్థికపరమైన అంశాలు నిమిషాల్లో పూర్తి చేసుకుంటున్నారు. ఈ క్రమంలో చాలా మంది సులువుగా రుణ సౌకర్యాలను పొందుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా పర్సనల్ లోన్స్ కి సంబంధించిన రూల్స్ లో రిజర్వు బ్యాంక్ కీలక మార్పులను చేసింది. దీని వల్ల ఏకకాలంలో అనేక పర్సనల్ లోన్స్ పొందుతున్న వ్యక్తులకు ఇబ్బందులు పెరగవచ్చని తెలుస్తోంది. మార్చబడిన రూల్స్ ప్రకారం రుణం ఇచ్చే బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు అటువంటి ఖాతాదారుల క్రెడిట్ బ్యూరో రికార్డులను 15 రోజుల్లోగా అప్డేట్ చేయాల్సి ఉంటుందని రిజర్వు బ్యాంక్ వెల్లడించింది. గతంలో ఫైనాన్షియల్ సంస్థలు వీటిని నెలకు ఒకసారి అప్ డేట్ చేసేవి. ప్రస్తుతం కొత్త నిబంధనలు రుణగ్రహీతల నష్టాన్ని బాగా అంచనా వేసేందుకు దోహదపడుతోందని ఆర్బీఐ వెల్లడించింది.

పర్సనల్ లోన్స్ విషయంలో ఒకటి కంటే ఎక్కువ రుణాలను కలిగి ఉన్న వ్యక్తి సదరు ఈఎంఐలు వేరువేరు తేదీల్లో ఉంటాయి. ఈ క్రమంలో వాయిదా చెల్లించటంలో విఫలమైనప్పుడు దీనికి సంబంధించిన సమాచారాన్ని నెలకు ఒకసారి క్రెడిట్ రికార్డుల్లోకి ఎక్కించటం ద్వారా ఆర్థిక సంస్థలు సమాచారాన్ని పొందటానికి 40 రోజులు సమయం పడుతుంది. దీనివల్ల వ్యక్తులు ఈ సమయంలో మరో ఫైనాన్స్ సంస్థ నుంచి ఈ కాలంలో రుణం పొందే అవకాశం ఉన్నందున ఆర్థిక సంస్థలపై ప్రభావం ఉంటుందని రిజర్వు బ్యాంక్ భావిస్తోంది. అందుకే తరుచుగా పర్సనల్ లోన్స్ తీసుకునే వ్యక్తుల విషయంలో వివరాలను 15 రోజులకు ఒకసారి అప్డేట్ చేయటం వల్ల జాప్యాలు తగ్గి డిఫాల్టర్ల వివరాలను బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు వెంటనే పొందటానికి వీలు ఉంటుందని, తద్వారా సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోగలవని రిజర్వు బ్యాంక్ భావిస్తోంది.
వాస్తవానికి రుణాలను అందించే ఆర్థిక సంస్థలకు ఇది పెద్ద ప్రయోజనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది రుణగ్రహీతలు పాత రుణాలను చెల్లించటం కోసం కొత్తగా మరో సంస్థ నుంచి రుణాన్ని పొందుతుంటారు. దీనిని ఎవర్ గ్రీనింగ్ అని పిలుస్తుంటారు. ఇలాంటి వ్యక్తులు రుణ చెల్లింపుల విషయంలో డిఫాల్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అందువల్ల రిజర్వు బ్యాంక్ పర్సనల్ లోన్స్ విషయంలో తెస్తున్న కొత్త నిబంధనలు ఆర్థిక సంస్థలకు రుణగ్రహీత గురించి స్పష్టమైన అభిప్రాయాన్ని పొందేందుకు దోహదపడతాయి. వాస్తవానికి రిజర్వు బ్యాంక్ ఆగస్టు 2024లో దీనికి సంబంధించిన ఆదేశాలను జారీ చేసింది. దేశంలోని రుణ సంస్థలు, క్రెడిట్ బ్యూరోలు దీనికి తగినట్లుగా తమ సిస్టమ్లను అప్డేట్ చేసేందుకు జనవరి 1, 2025 వరకు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇది ప్రజల్లో కూడా అనవసరంగా రుణాలు తీసుకునే ధోరణిని తగ్గిస్తుంది.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

ఇరాన్ యుద్ధాన్ని బంగారంపై అస్త్రంగా వాడుకుంటున్న చైనా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులపై భారీ స్కెచ్..



Click it and Unblock the Notifications