Railway Tickets: దేశంలో భారతీయ రైల్వే సంస్థ కోట్ల మంది ప్రయాణికులను రోజూ వారి గమ్యస్థానాలకు చేర్చుతోంది. దశాబ్ధాలుగా తక్కువ ఖర్చులో దూర ప్రయాణాలు చేసేందుకు ఈ ప్రభుత్వ సంస్థ వీలు కల్పిస్తున్న సంగతి తెలిసిందే. మారుతున్న కాలానికి అనుగుణంగా రైల్వే సంస్థ కూడా ప్రజలకు వెసులుబాటును కల్పిస్తూ డిజిటలైజ్ అవుతోంది.
ఈ క్రమంలోనే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ 'ఇప్పుడే బుక్ చేయండి-తర్వాత చెల్లించండి'(Book Now-Pay Later) కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనికింద ప్రయాణికులు టిక్కెట్లను వెంటనే బుక్ చేసుకుని తర్వాత డబ్బులు పే చేసేందుకు వెసులుబాటును అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ఇకపై ముందస్తుగా టిక్కెట్ కొనుగోలుకు డబ్బు చెల్లించకుండానే కన్ఫర్మ్ టిక్కెట్ను పొందవచ్చని తెలుస్తోంది. దీనికోసం మొత్తం బుకింగ్ ప్రక్రియను ఆన్లైన్లోనే పూర్తి చేయాల్సి ఉంటుందని గమనించాలని జీ న్యూస్ నివేదించింది.

బుక్ నౌ-పే లేటర్ ప్రక్రియకు వెళ్లటానికి దీనికి సంబంధించిన షరతుల గురించి ప్రయాణికులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలను ఇప్పుడు గమనిద్దాం..
* ముందుగా ప్రయాణికులు తమ IRCTC ఖాతాలోకి లాగిన్ చేసి, ఆపై 'బుక్ నౌ' ఎంపికను ఎంచుకోవాల్సి ఉంటుంది.
* ఈ సమయంలో క్యాప్చా కోడ్తో పాటు ప్రయాణీకుల వివరాలను అందించాల్సిన కొత్త పేజీ తెరవబడుతుంది. ఇక్కడ ప్రయాణం చేస్తున్న వ్యక్తులకు సంబంధించిన వయస్సుతో పాటు ఇతర వివరాలను నమోదు చేసిన తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి.
* వివరాలను అందించిన తర్వాత చెల్లింపు పేజీకి వెళ్లినప్పుడు పేమెంట్ పేజ్ తెరవబడుతుంది. ఇక్కడ BHIM UPI యాప్ లేదా నెట్ బ్యాంకింగ్ని ఉపయోగిస్తున్నప్పుడు క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ల ద్వారా చెల్లించటానికి వెసులుబాటు ఉంటుంది.
* ఇప్పుడు ప్రయాణికులు పే లేటర్ ఫీచర్ని ఉపయోగించాలనుకునే కస్టమర్లు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. ఇందుకోసం www.epaylater.inకి వెళ్లాల్సి ఉంటుంది. కస్టమర్ ఈ నమోదు ప్రక్రియను పూర్తి చేసుకున్న తర్వాత ఎలాంటి ముందస్తు చెల్లింపులు లేకుండానే రైలు టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు.
ఈ డబ్బును కస్టమర్లు ఎప్పుడు చెల్లించాలి?
పే లేటర్ సౌకర్యాన్ని రైల్వే సంస్థ ఇంటిగ్రేట్ చేయటం వరకు బాగానే ఉన్నప్పటికీ చాలా మందికి తెలియని విషయం ఆ సొమ్మును తిరిగి ఎప్పుడు చెల్లించాలన్నదే. టిక్కెట్లను పే లేటర్ కింద బుక్ చేసుకున్న వ్యక్తులు టిక్కెట్ రిజర్వేషన్ తర్వాత 14 రోజుల్లోపు చెల్లింపును పూర్తి చేయాల్సి ఉంటుంది.
సకాంలో పేమెంట్ చెల్లించటంలో విఫలమైతే 3.5 శాతం సర్వీస్ ఛార్జీ పెనాల్టీగా విధించబడుతుంది. అదే సకాలంలో పేమెంట్ చేసేవారికి మాత్రం ఎలాంటి అదనపు ఖర్చులు ఉండబోవు. IRCTC థర్డ్-పార్టీ పేమెంట్ ప్లాట్ఫారమ్లతో భాగస్వామ్యాల ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేసిన తర్వాత చెల్లించే ఆప్షన్ అందుబాటులోకి తీసుకొచ్చింది.
More From GoodReturns

హైదరాబాద్లో పాడ్ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయ్.. మెట్రో స్టేషన్ నుంచి నేరుగా ఆఫీసుకే వెళ్లిపోవచ్చు ఇక..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

Bengaluru: టీసీఎస్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్! మీ స్నేహితుడిని చేర్పించండి.. రూ. 40,000 గెలుచుకోండి!

హైదరాబాద్, పుణే వద్దు బెంగళూరు ముద్దు.. అధిక అద్దెలున్నా బెంగళూరును వదలమంటున్న టెక్ కంపెనీలు..

బంగారం ధరలు తగ్గాయి ..ఎంత తగ్గాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. ఫిబ్రవరి 26, గురువారం పసిడి ధరలు ఇవే..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

Bengaluru: దక్షిణాది నుంచి ఉత్తరాదికి జెట్ స్పీడ్.. కొత్త రైల్వే లైన్లకు గ్రీన్ సిగ్నల్!

Gold: బంగారం ధరలు తగ్గేది అందుకు కాదు! అసలు విషయం బయటపెట్టిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సీఈఓ!

వెండి ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. వచ్చే నెలలో రూ. 3 లక్షలకు.. కొనేందుకు ఎగబడుతున్న పెట్టుబడిదారులు

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications