Gold News: 2025లో పసిడి ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా?.. ముందుగా మేల్కోండి..

2025 Gold Forecast: బంగారంతో భారతీయులకు విడదీయలేదని అనుబంధం సెంటిమెంటల్ గా ఉంటుంది. ఇంట్లో చిన్న శుభకార్యం నుంచి పెద్ద ఫంక్షన్ల వరకు అన్నింటిలోనూ పసిడికి ప్రత్యేక స్థానం ఉంటుంది. 2024లో గోల్డ్ పెట్టుబడిదారులకు అక్టోబర్ నాటికి 35 శాతం రాబడిని అందించింది. అయితే అక్టోబరులో 5 శాతం పతనాన్ని చూసినప్పటికీ మెరుగైన రాబడులను అందించటంతో చాలా మంది పెట్టుబడిదారులు రికార్డు రిటర్న్స్ పొందారు.

గడచిన నాలుగు దశాబ్ధాల్లో అత్యుత్తమ పనితీరును కనబరిచింది. మెుత్తానికి పసిడి పెట్టుబడిదారులు 2024లో 28 శాతం రాబడిని అందించింది. ఈ క్రమంలో మరికొన్ని రోజుల్లో ఈ ఏడాది పూర్తవుతున్న వేళ 2025లో రాబడి ఎలా ఉంటుందనే గందరగోళంలో పెట్టుబడిదారులు ఉన్నారు. వాస్తవానికి గడచిన వారంలో అమెరికా సెంట్రల్ బ్యాంక్ తన వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గింపును ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే 2025లో మాత్రం రేట్ల కోతలు తక్కువగా ఉంటాయని వెల్లడించిన వేళ డాలర్ బలపడటంతో పాటు ట్రెజరీ ఈల్డ్స్ పెరిగాయి. అయితే ఇదే క్రమంలో పసిడి ధరలు మాత్రం పతనాన్ని చూశాయి.

Know Gold rates Forecast for 2025 as in 2024 gold gave 28 return in 4 decades

నిపుణుల ప్రకారం మార్కెట్లు ఆసక్తిగా చూసే సాంకేతిక స్థాయిలు 2634 డాలర్ల మార్కును ఉల్లంఘిస్తే గణనీయమైన అమ్మకాలను ప్రేరేపిస్తుందని భావిస్తున్నారు. బులియన్ రికార్డ్-బ్రేకింగ్ ర్యాలీ మధ్య రిటైల్ ఇన్వెస్టర్ల నుండి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి CME జనవరిలో ఒక ఔన్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ఒప్పందాన్ని ప్రారంభించనుంది. పెరుగుతున్న అనిశ్చిత ప్రపంచ వాతావరణంలో ఎదురయ్యే ప్రతికూలతల నుంచి రక్షించడానికి ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు తమ బంగారం కొనుగోళ్లను భారీగా పెంచటం కూడా ధరల పెరుగుదలకు దారితీస్తోంది. ఈ క్రమంలో ఇండియా ఈ ఏడాది దాదాపు 77 టన్నులను కొనుగోలు చేసింది. కరెన్సీ విలువ పతనాన్ని రక్షించటం కోసం సెంట్రల్ బ్యాంకులు ఈ చర్య చేపడుతున్నాయి.

రష్యా-ఉక్రెయిన్, ఇరాన్-ఇరాక్, సిరియా వంటి ఉద్రిక్తతలు సురక్షితమైన పెట్టుబడిగా బంగారంపై ప్రజల ఆకర్షణకు మద్దతునిస్తోంది. దీనికారణంగా ప్రాంతీయ అస్థిరత గురించి ఆందోళనలను పెంచుతుందని ప్రస్తుత అధ్యక్షుడు జో బిడెన్ కూడా హెచ్చరించారు. అలాగే రానున్న అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఇతర దేశాలపై విధించనున్న సుంకాలు ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీస్తాయనే ఆందోళనలు కొనసాగుతున్నాయి. డాలర్ డిమాండ్ పెరగటంతో పాటు చైనా పాలసీ మార్పులు యువాన్ ను బలహీనంగా మారుస్తోంది. ఇలాంటి పరిస్థితులు కరెన్సీలపై ఒత్తిడిని పెంచుతోందని నిపుణులు చెబుతోంది.

నేటి పసిడి ధరలు..
వరుసగా రెండు రోజుల నుంచి పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నేడు రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7100గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7745 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7100గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7745 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి రూ.100 తగ్గి నేడు రూ.98,900 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+