Gold Rate: రూ.2400 తక్కువలో బంగారం ధర.. త్వరపడి కొనుక్కోండి.. రేట్లు పెరుగుతున్నాయ్..
Gold Rate: అమెరికా డాలర్ కనిష్ఠాలకు చేరుకుని తడబడటం, US CPI రెండేళ్ల తక్కువకు చేరుకోవటంతో బంగారం రేట్లకు తిరిగి రెక్కలు వచ్చాయి. గత వారం ప్రారంభం నుంచి పసిడి మళ్లీ పరుగులు తీస్తోంది. డిమాండ్ తక్కువగా ఉన్నప్పటికీ రేట్లు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి.
దేశీయంగానే కాక గ్లోబల్ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది మే 5న 22 క్యారెట్ల బంగారం గరిష్ఠ ధర రూ.57,200ను తాకింది. ఇదే క్రమంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి రేటు అప్పట్లో రూ.62,400గా ఉంది. కానీ ప్రస్తుతం మార్కెట్లో 22 క్యారెట్ల పసిడి ధరలను గరిష్ఠాలతో పోల్చితే 10 గ్రాములకు రూ.2,200 తక్కువగా ఉంది. అలాగే 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.2,400 తక్కువ వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం గోల్డ్ ర్యాలీ ప్రారంభమైన తరుణంలో కొనుగోలు చేయాలనుకునే వారు అస్సలు ఆలస్యం చేయకపోవటం మంచిదని తెలుస్తోంది.

ఈరోజు దేశంలో బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల రిటైల్ విక్రయ ధర వివిధ నగరాల్లో పరిశీలిస్తే.. చెన్నైలో రూ.55,500, ముంబైలో రూ.55,000, దిల్లీలో రూ.55,150, కలకత్తాలో రూ.55,000, వడోదరలో రూ.55,050, విజయవాడలో రూ.55,000, గురుగ్రామ్ లో రూ.55,150, సేలమ్ లో రూ.55,500, హైదరాబాదులో రూ.55,000 వద్ద కొనసాగుతున్నాయి.
ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల పసిడి రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.60,550, ముంబైలో రూ.60,000, దిల్లీలో రూ.60,150, కలకత్తాలో రూ.60,000, వడోదరలో రూ.60,050, విజయవాడలో రూ.60,000, గురుగ్రామ్ లో రూ.60,150, సేలమ్ లో రూ.60,500, హైదరాబాదులో రూ.60,000 వద్ద కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి కిలో ధర రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో రూ.81,800 వద్ద కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications