IT News: త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన టెక్ కంపెనీలు.. ఇప్పుడు ఏ స్టాక్ కొనొచ్చు..!!

Tech Stocks: ఇటీవల వరుసగా దేశీయ టెక్ కంపెనీలు తమ నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడించాయి. ఈ క్రమంలో టీసీఎస్, విప్రో, హెచ్‌సిఎల్ టెక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా కంపెనీలపై బెట్టింగ్ వేయాలనుకుంటున్న ఇన్వెస్టర్లు గందరగోళంలో ఉన్నారు.

ఏ టెక్ కంపెనీని వాల్యూ పిక్ కింద పెట్టుబడికి ఎంచుకోవాలనే విషయంలో వారు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. మార్చి త్రైమాసిక ఫలితాలను గమనిస్తే.. టీసీఎస్ ఫలితాలు విప్రో, ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్ టెక్ లను అధిగమించి అత్యుత్తమ పనితీరును కనబరిచినట్లు నిపుణులు వెల్లడించారు. దీర్ఘకాలంలో పరిశీలిస్తే ఏఐ సాంకేతికతను వేగంగా అందిపుచ్చుకున్న హెచ్‌సిఎల్ టెక్ షేర్లను ఇన్వెస్టర్లు తమ పెట్టుబడి కోసం ఓ కన్నేసి ఉంచాలని సూచించారు. అలాగే క్యూ4లో విప్రో నికర లాభం గత ఏడాదితో పోల్చితే 8 శాతం క్షీణించి ఇన్వెస్టర్లను నిరాశకు గురిచేసింది.

Know from TCS Infosys Wipro HCL Technologies which stock to buy on Monday experts openion

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా టెక్ స్పెండింగ్ తీరుతెన్నులను పరిశీలిస్తే.. కంపెనీలు ఎక్కువగా ఏఐ ఉత్పత్తుల వినియోగం వైపు మెుగ్గుచూపుతున్నాయి. దీంతో ఐటీ కంపెనీలు సైతం ఏఐ సాంకేతికపై దృష్టి సారిస్తూ దానిని తమకు ఆదాయవనరుగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న వ్యాపార వాతావరణంలో లాభదాయకతను పెంచుకోవాలంటే దేశీయ ఐటీ సేవల కంపెనీలు టెక్నాలజీ సర్వీసులతో పాటు ఏఐ ఉత్పత్తులను అందించాల్సి ఉంటుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. రానున్న వ్యాపార రేసులో ఏఐపై పట్టు సాధించిన దేశీయ టెక్ కంపెనీలు మాత్రమే విజయం సాధించగలవని వారు చెబుతున్నారు.

సోమవారం ఏ ఐటీ స్టాక్ కొనొచ్చు..?
నాలుగు టెక్ దిగ్గజ కంపెనీల టెక్నికల్ ప్యాట్రన్లను పరిశీలిస్తే.. టెక్ దిగ్గజాలైన ఇన్ఫోసిస్, విప్రో కంపెనీల షేర్లు మధ్య కాలం నుంచి దీర్ఘకాలిక పెట్టుబడి వ్యూహం కలిగిన పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ రెండింటిలో బలమైన పనితీరును కనబరిచిన ఇన్ఫోసిస్ కంపెనీ షేర్లను ఎంచుకోవటం ఉత్తమ నిర్ణయంగా నిపుణులు సూచిస్తున్నాయి. స్వల్ప కాలంలో కంపెనీ షేర్లు కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వారు అంచనా వేస్తున్నారు. దీర్ఘకాలంలో ఇన్ఫోసిస్ స్టాక్ ధర రూ.1900 స్థాయికి చేరుకోవచ్చని వెల్లడించారు. దీని తర్వాత రెండవ స్టాక్ ఎంపికగా విప్రోను పరిగణించొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. స్టాక్ దీర్ఘకాలంలో రూ.615 స్థాయికి చేరుకునే బలాన్ని కలిగి ఉన్నట్లు వెల్లడించింది. మూడో ఎంపికగా టీసీఎస్ టార్గెట్ ధర రూ.4750, చివరి ఎంపికగా ఉన్న హెచ్‌సిఎల్ టెక్ రూ.1250 చేరుకోవచ్చంది. అయిదే దీనిని డిప్స్ వద్ద కొనుగోలు చేయొచ్చని వారు సూచిస్తున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+