Market Next week: నష్టాల్లో ముగిసి మార్కెట్లు.. వచ్చే వారం పరిస్థితి ఇదే.. జాగ్రత్త ఇన్వెస్టర్స్
Stock Market: వరుసగా రెండు వారాల పాటు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలను నమోదు చేశాయి. ఈ క్రమంలో బెంచ్ మార్క్ సూచీలు తమ ప్రయాణాన్ని నష్టాల్లో ముగించటానికి అనేక కారణాలు ఉన్నాయి.
ముఖ్యంగా అధిక ఓలటాలిటీ కారణంగా భారత మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తమ డబ్బును వెనక్కి తీసుకోవటం కొనసాగింది. అలాగే ఇప్పటి వరకు ఎర్నింగ్ సీజన్ ఫలితాల విడుదల కారణంగా మూడో త్రైమాసికంలో కంపెనీల ఫలితాలు మార్కెట్లను కొంత నిరాశకు గురిచేయటం మరో కారణంగా ఉంది. అలాగే ఇటీవల ఎర్ర సముద్రంలో పెరిగిన ఉద్రిక్తతలు పెట్టుబడిదారులను లాభాల స్వీకరణకు మెుగ్గుచూపేలా ప్రేరేపించాయి.

రంగాల వారీగా చూస్తే గడిచిన వారంలో బీఎస్ఈ పవర్ ఇండెక్స్ అత్యధికంగా 1.6 శాతం పెరిగింది. బీఎస్ఈ హెల్త్కేర్ సూచీ 1 శాతం లాభాన్ని నమోదు చేసింది. మరోవైపు బీఎస్ఈ రియాల్టీ ఇండెక్స్ 4.4 శాతం పడిపోయింది. మిశ్రమ ప్రపంచ మార్కెట్ ట్రెండ్కు ప్రతిస్పందనగా ఐటి-బ్యాంకింగ్ స్టాక్లలో గణనీయమైన క్షీణతతో మార్కెట్ తిరోగమనం నమోదైందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కు చెందిన వినోద్ నాయర్ పేర్కొన్నారు. అలాగే భారత పీఎంఐ డేటా సానుకూలంగా ఉన్నప్పటికీ మార్కెట్లు ర్యాలీకి కష్టపడ్డాయని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం మార్కెట్లోని పెట్టుబడిదారులు చైనా సమగ్ర ఉద్దీపన ప్రణాళికలపై అదనపు వివరాల కోసం ఎదురు చూస్తున్నారు. అధిక వాల్యుయేషన్లు, సబ్పార్ ఫలితాలు, మిడిల్ ఈస్ట్లో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత కారణంగా విస్తృత మార్కెట్ లాభాలను కలిగి ఉండదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే రానున్న కాలంలో ప్రధాన దేశాల పాలసీ రేట్ నిర్ణయాలు వంటి గ్లోబల్ మార్కెట్ కారకాలు మార్కెట్ను ప్రభావితం చేయనున్నాయి. జనవరి 25 నాటికి FPIలు రూ.27,664 కోట్ల విలువైన ఈక్విటీని విక్రయించారు. దీనికి తోడు అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది.


Click it and Unblock the Notifications