SEBI News: భారత స్టాక్ మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీకి తొలి మహిళా ఛైర్మన్ మాధవి పూరీ బుచ్. అయితే నిన్నటి నుంచి ఆమె పాత్రకు సంబంధించి అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ భారీ ఆరోపణలతో కొత్త నివేదికను ప్రచురించింది. దీంతో మార్కెట్లో అందరి దృష్టి ఆమెపై పడింది.
వాస్తవానికి హిండెన్ బర్గ్ నిన్న విడుదల చేసిన నివేదికలో సెబీ చీఫ్ మాధవి బుచ్పై దాడి చేసింది. అదానీ కంపెనీల్లో పెట్టుబడులు కలిగిన ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో సెబీ చైర్పర్సన్ మాధవి బుచ్, ఆమె భర్తకు వాటాలు ఉన్నట్లు కొన్ని రహస్య నివేదికలను ఉటంకించింది. అదానీ గ్రూప్ అక్రమాలకు పాల్పడిందని, షేర్ ధరలో కుంభకోణం జరిగిందంటూ సంచలన నివేదిక విడుదల చేసి దాదాపు 18 నెలలు గడిచినప్పటికీ షార్ట్ సెల్లర్ ఇప్పటికీ దానికి సంబంధించిన అనేక వివరాలను విడుదల చేస్తూనే ఉంది.

మారిషస్లోని అదానీ గ్రూప్ నెట్వర్క్కు సంబంధించిన పూర్తి వివరాలను అందించినప్పటికీ సెబీ దర్యాప్తును ముందుకు తీసుకెళ్లేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించింది. అలాగే వినోద్ అదానీ నేతృత్వంలోని షెల్ కంపెనీల్లో సెబీ చైర్పర్సన్, ఆమె భర్త ధవల్ బుచ్ విదేశాల్లో అదానీకి చెందిన వాటాలు కలిగి ఉన్నారని హిండెన్బర్గ్ పేర్కొంది.
మాధబి పూరీ బుచ్ 1966లో జన్మించారు. ఆమె బాల్యం ముంబైలోనే గడిపారు. తండ్రి కమల్ పూరి కార్పొరేట్ రంగంలో పని చేయగా, అతని తల్లి పొలిటికల్ సైన్స్లో డాక్టరేట్ పొందారు. 18 ఏళ్ల వయస్సులోనే ఆమెకు ధవల్ బుచ్తో వివాహం నిశ్చయించబడింది. ఆమె భర్త ధవల్ బహుళజాతి కంపెనీ యూనిలీవర్లో డైరెక్టర్. అయితే 21 ఏళ్లు వచ్చేసరికీ వివాహం పూర్తైంది. పెళ్లి తర్వాత మాధవి కెరీర్ను సీరియస్గా తీసుకుని ముందుకు సాగారు. మాధవి పూరి బుచ్ ఐఐఎం అహ్మదాబాద్ నుండి MBA డిగ్రీని, దిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ నుంచి గణితంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు.

మార్చి 2022లో సెబీకి తొలి మహిళా చైర్పర్సన్గా మాధబి పూరి బుచ్ నియమితులై చరిత్ర సృష్టించారు. కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఆమెను మూడేళ్ల కాలానికి అంటే 2025 వరకు సెబీ చీఫ్గా నియమించారు. దీనికి ముందు ఆమె సెబీ బోర్డులో పూర్తికాల సభ్యురాలుగా కూడా పనిచేశారు.
వీటికి ముందు బుచ్ షాంఘైలోని న్యూ డెవలప్మెంట్ బ్యాంక్కు సలహాదారుగా, ప్రైవేట్ ఈక్విటీ సంస్థ గ్రేటర్ పసిఫిక్ క్యాపిటల్ సింగపూర్ కార్యాలయానికి అధిపతిగా పనిచేశారు. దీనితో పాటు ఆమె ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లిమిటెడ్ ఎండీ, సీఈవో, ICICI బ్యాంక్ బోర్డులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కూడా పనిచేశాడు. ఇదే క్రమంలో ఆమె అనేక కంపెనీ బోర్డుల్లో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కూడా పనిచేసిన అనుభవాన్ని కలిగి ఉన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications