Unified Pension System: దేశంలో ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ విధానంపై చాలా కాలంగా సందిగ్ధత కొనసాగుతోంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కొత్త పన్ను విధానం అమలులో ఉండగా.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలతో పాటు మరికొన్ని చోట్ల పాత పన్ను విధానాన్నే కొనసాగించాలని ప్రభుత్వాలు పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్రం వినూత్న ఆలోచనతో ముందుకొచ్చినట్లు కనిపిస్తోంది.
ఇప్పటికే సిస్టమ్లో నమోదు చేసుకున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జాతీయ పెన్షన్ సిస్టమ్లో ప్రత్యామ్నాయంగా ఏకీకృత పెన్షన్ పథకాన్ని కేంద్రం అమలు చేయనుంది. ఈ క్రమంలో కేంద్రం పాత పెన్షన్ స్కీమ్, కొత్తగా తెచ్చిన నేషనల్ పెన్షన్ సిస్టమ్ రెండింటిలోని అంశాలను మిళితం చేసి ఏకీకృత పెన్షన్ స్కీమ్ (UPS)ని కేంద్రం గత ఏడాది ప్రవేశపెట్టింది. ఇది ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత స్థిరత్వం, గౌరవం, ఆర్థిక భద్రతను పెన్షన్ అందించటం ద్వారా కల్పించనుంది.

తాజా నోటిఫికేషన్ ప్రకారం హామీ ఇవ్వబడిన చెల్లింపు కొన్ని షరతులతో కూడి ఉంటుందని వెల్లడించింది. ముందుగా పదవీ విరమణ తేదీ నుంచి పదేళ్ల సర్వీస్ పూర్తి చేసిన వారికి మాత్రమే అందించబడుతుంది. FR 56 (j) నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఉద్యోగిని పదవీ విరమణ చేసిన సందర్భంలో అందించబడుతుంది. అలాగే 25 సంవత్సరాల కనీస అర్హత సర్వీస్ వ్యవధి తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నప్పుడు కూడా పెన్షన్ పొందటానికి అర్హులుగా పరిగణించబడతారు. అయితే సర్వీస్ నుంచి తొలగించబడిన లేదా రాజీనామా చేసిన ఉద్యోగులకు హామీ ఇవ్వబడిన చెల్లింపు అందుబాటులో ఉండబోదు.
యూనిఫైడ్ పెన్షన్ పథకం ప్రయోజనాలను పరిశీలిస్తే.. పూర్తి హామీ చెల్లింపు పన్నెండు నెలల సగటు బేసిక్ పేలో 50% చొప్పున పదవీ విరమణకు ముందు లెక్కించబడుతుంది. ఇది కనీసం 25 ఏళ్ల పాటు సర్వీస్ కలిగిన వ్యక్తులకు మాత్రమే అందించబడుతుంది. కనీస నెలవారీ పెన్షన్ హామీ రూ.10,000 క్వాలిఫైయింగ్ సర్వీస్ తర్వాత ఉంటుంది. ఒకవేళ 25 ఏళ్ల సర్వీస్ తర్వాత స్వచ్చందంగా పదవీ విరమణను తీసుకుంటే వాస్తవ సర్వీస్ ప్రకారం ఎప్పుడు పదవీ విరమణ ఉంటుందో అప్పటి నుంచి పెన్షన్ చెల్లించబడుతుందని గుర్తుంచుకోవాలి.
పెన్షన్ పొందుతున్న వ్యక్తి మృతి చెందినప్పుడు పరిణామాలను పరిశీలిస్తే.. వారి మరణానికి ముందు, చెల్లింపుదారునికి అనుమతించబడే చెల్లింపులో @60% కుటుంబ చెల్లింపుకు అర్హత పొందుతుంది. చట్టబద్ధంగా వివాహం చేసుకున్న జీవిత భాగస్వామికి ఇది అందించబడుతుంది. డియర్నెస్ రిలీఫ్ హామీ ఇవ్వబడిన చెల్లింపు, కుటుంబ చెల్లింపులపై అందుబాటులో ఉంటుంది. సేవ చేస్తున్న ఉద్యోగులకు వర్తించే డియర్నెస్ అలవెన్స్ మాదిరిగానే డియర్నెస్ రిలీఫ్ పని చేస్తుంది. చెల్లింపు ప్రారంభమైనప్పుడు మాత్రమే డియర్నెస్ రిలీఫ్ చెల్లించబడుతుంది.
కేంద్ర ప్రభుత్వం ఏకీకృత పెన్షన్ స్కీమ్ని ఎంచుకున్న ఉద్యోగులందరికీ ప్రాథమిక వేతనం మరియు డియర్నెస్ అలవెన్స్లో 8.5% కంట్రిబ్యూషన్ను పూల్ కార్పస్కు అందిస్తుంది.


Click it and Unblock the Notifications