Muhurat Trading 2024: దేశీయ స్టాక్ మార్కెట్లలో రెగ్యులర్ ట్రేడింగ్ కి భిన్నంగా సంవత్సరంలో ఒక్కరోజు కేవలం దీపావళి రోజున మాత్రమే స్పెషల్ ట్రేడింగ్ నిర్వహించబడుతుంది. ఈ సారి కూడా ఎన్ఎస్ఈ రోజు నవంబర్ 1 సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు అంటే ఒక గంట పాటు ట్రేడింగ్ సెషన్ ఓపెన్ చేయబడుతుంది. హిందువుల క్యాలెండర్ సాంవత్ 2081 ప్రారంభాన్ని పురస్కరించుకుని ఈ స్పెషన్ ట్రేడింగ్ నిర్వహించబడుతుంది.
వాస్తవానికి దీపావళి రోజున దేశీయ స్టాక్ మార్కెట్లు సెలవులో ఉంటాయి. కానీ ప్రతి ఏటా సాయంత్రం ముహురత్ ట్రేడింగ్ కోసం 1 గంట సమయం పాటు మాత్రం ఓపెన్ చేయబడతాయి. ఈ క్రమంలో సాయంత్రం 5.45 నుంచి 6 గంటల వరకు ప్రీ ఓపెనింగ్ సెషన్ కూడా ట్రేడింగ్ విండోలో ఉంటుంది. ఈ సమయంలో ట్రేడింగ్ నిర్వహించటాన్ని శుభప్రదంగా ఏళ్ల నుంచి ఆనవాయితీగా ట్రేడర్లు నమ్ముతుంటారు. అనుకూలమైన గ్రహ స్థానాలతో సమలేఖనం చేయబడిన శుభ సమయంగా పరిగణించబడుతుంది. దీపావళి ఉత్సవాల వెలుగులో పెట్టుబడిదారులు కొత్త ఆర్థిక ప్రయాణానికి ఈ ఒక-గంట ట్రేడింగ్ విండో చాలా కాలంగా వ్యాపారాల కోసం కొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది.

ఈ ప్రత్యేక ట్రేడింగ్ సెషన్లలో ఇన్వెస్టర్లు సానుకూల రాబడులను అందుకున్నారు. గడచిన 17 ముహురత్ ట్రేడింగ్ సెషన్లలో 13 లాభాలతోనే ప్రయాణాన్ని ముగించాయి. ఈ క్రమంలో 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ ముహూర్తం ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ 5.86% పెరుగుదలను చూసింది. 2012 నుంచి జరిగిన 12 సెషన్లలో 9 సానుకూలంగానే నిలిచాయి. చాలా మంది పెట్టుబడిదారులు నూతన ఆర్థిక సంవత్సరానికి ప్రతీకగా చూస్తుంటారు. ఈ సెషన్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఆర్థిక వృద్ధి లభిస్తుందని చాలామంది పెట్టుబడిదారులు నమ్ముతుంటారు. దీని ద్వారా రానున్న ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ల పనితీరుపై ఒక అవగాహన కలిగిస్తుంది.
ఈ క్రమంలో కొత్తగా మార్కెట్లలోకి అడుగుపెట్టేవారు సైతం తమ ప్రయాణాన్ని ముహురత్ ట్రేడింగ్ నుంచి ప్రారంభించాలని భావిస్తున్నారు. నేటి కాలంలో ఎక్కువ మంది యువత, కొత్త ట్రేడర్లు తమ ప్రయాణాన్ని ప్రారంభించాలని చూస్తుంటారు. అలాగే దీర్ఘకాలిక పెట్టుబడిదారుల కోసం, సెషన్ కొత్త పెట్టుబడులను కిక్స్టార్ట్ చేయడానికి లేదా పోర్ట్ఫోలియోలను సర్దుబాటు చేయడానికి అవకాశాన్ని అందిస్తుంది.


Click it and Unblock the Notifications