Mukesh Ambani: కలల నగర నిర్మాణంలో ముఖేష్ అంబానీ.. వామ్మో ఎన్ని ప్రత్యేకతలో..
Mukesh Ambani: డబ్బున్నోళ్లకి ఆలోచనలు సైతం వారి రేంజ్ లోనే ఉంటాయి. అవును దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త, బిలియనీర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ డ్రీమ్ సిటీ నిర్మాణంపై దృష్టి సారించారు. అసలు ఈ డ్రీమ్ సిటీ ఏమిటి..? దీని ప్రత్యేకతలు ఏమిటి..? పూర్తి వివరాలు తెలుసుకుందాం..
అంబానీ కలల నగరం ఉత్తర భారతదేశంలోని ప్రత్యేక నగరంగా అభివృద్ధి చెందుతోంది. ఈ డ్రీమ్ సిటీ నివాస గృహాలతో పాటు పారిశ్రామిక పట్టణాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. కంపెనీ దీనికి మోడల్ ఎకనామిక్ టౌన్షిప్ అని పేరు పెట్టింది. ఈ ప్రత్యేక నగరాన్ని హర్యానాలోని ఝజ్జర్లో అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ మెగా మోడల్ ఎకనామిక్ టౌన్షిప్ నిర్మాణ ప్రాజెక్టును రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ వెంచర్స్ లిమిటెడ్ చేపడుతోంది. టౌన్ షిప్ను ఏకంగా 8,250 ఎకరాల్లో జరుగుతోంది. ఇక్కడ రెసిడెన్షియల్ టౌన్షిప్తో పాటు పారిశ్రామిక టౌన్షిప్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఝజ్జర్ నగరానికి 14 కి.మీ దూరంలో, గుర్గావ్కు 30 కి.మీ దూరంలో, నజఫ్గఢ్ కు 18 కి.మీ దూరంలో, ఫరూఖ్నగర్ రైల్వే స్టేషన్ నుంచి 2 కి.మీ దూరంలో ఉంది.
సమాచారం ప్రకారం డ్రీమ్ సిటీ కుండ్లీ-మనేసర్ ఎక్స్ప్రెస్వేతో పాటు ఢిల్లీ-ముంబై ఇండస్ట్రియల్ కారిడార్, DFC నుంచి కూడా కనెక్టివిటీని కలిగి ఉంటుంది. ఈ నగరంలో జపాన్ ఇండస్ట్రియల్ టౌన్షిప్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో డెన్సో, పానాసోనిక్ కూడా తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. ఇక్కడ వాణిజ్య ప్లాట్లు కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ వాస్తవానికి రిలయన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ కల అని తెలుస్తోంది.
నీటి సరఫరా, విద్యుత్ సరఫరా నుంచి రోడ్ల వరకు ప్రపంచ స్థాయి నగరంపై దృష్టి సారించింది. ఇందులో 220 కెవి పవర్ సబ్స్టేషన్, పోనీ సప్లై నెట్వర్క్, ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఉన్నాయి. ముఖేష్ అంబానీ దీనిని ఉత్తర భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. పూర్తయిన తర్వాత నగరం 5,00,000 కంటే ఎక్కువ మంది ప్రజలు, వేలాది సంస్థలకు నిలయంగా మారనుంది. వచ్చే పదేళ్లలో రూ.60 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తుందని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications