Google: ప్రస్తుతం దేశంలో స్టార్టప్ కల్చర్ దేశంలో కనిపిస్తోంది. ఇక్కడ వ్యాపార ఆలోచన కలిగిన యువతకు అవసరమైన నిధులు, ఇతర సహాయాన్ని ప్రభుత్వాలు అందిస్తున్నాయి. అయితే అగ్రగామి కంపెనీలుగా మారిన గూగుల్, అమెజాన్ లకు పెట్టుబడి పెట్టిన ఇండియన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అవును ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ సర్వీస్ కంపెనీగా పేరొందిన గూగుల్ ఒకప్పుడు భారతీయుడు పెట్టిన పెట్టుబడితోనే దూసుకుపోతోందని మనలో చాలా మందికి తెలియదు. వినటానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది వాస్తవం. కంపెనీలు వేగంగా విస్తరించాలంటే వాటికి ప్రారంభ దశలో పెట్టుబడి చాలా అవసరం. నిధుల కొరతతో కనుమరుగైన అద్భుతమైన కంపెనీలు చరిత్రలో చాలానే ఉన్నాయి.

అమెరికాలో స్థిరపడిన భారతీయుడు కవితార్క్ రామ్ శ్రీరామ్.. ఇంటి గ్యారేజీలో ఇద్దరు యువ గ్రాడ్యుయేట్లు సెర్గీ బ్రిన్, లారీ పేజ్ గూగుల్ అనే చిన్న స్టార్టప్ కంపెనీని ప్రారంభించారు. ఆ సమయంలో ఇన్వెస్టర్లు లేక నిధుల కోసం ఇబ్బంది పడుతున్న గూగుల్ ఆలోచనను నమ్మిన శ్రీరామ్ అందులో పెట్టుబడి పెట్టారు. అలా భారతీయుడు నమ్మిన కంపెనీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి.. కోట్ల మందికి తన సేవలను అందిస్తోంది.
పేదరికం నుంచి బయటపడాలనే ఏకైక లక్ష్యంతో ఇండియా నుంచి అమెరికాకు వెళ్లారు కవితార్క్ రామ్ శ్రీరామ్. తన కాళ్లపై తాను నిలబడి రూ.19,600 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. మూడేళ్ల వయస్సులో తండ్రిని కోల్పోయిన కవితార్క్ రామ్ ప్రాథమిక విద్యకోసం పాఠశాలకు వెళ్లటానికి కూడా కష్టపడ్డారు. మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీతో పట్టభద్రుడయ్యేందుకు అనేక అడ్డంకులను అధిగమించాడు. ఆ తర్వాత అమెరికా వెళ్లి అక్కడ ఎంబీఏ పూర్తి చేశారు.
ఇంజనీర్గా తన కెరీర్ను ప్రారంభించిన కవితార్క్ రామ్ నేడు టెక్ ప్రపంచాన్ని శాసిస్తున్న రెండు కంపెనీల వృద్ధికి కారణమయ్యారు. ఆయన గూగుల్లో దాదాపు 0.5 మిలియన్ డాలర్ల ప్రారంభ పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం కంపెనీలో ఆయన వాటాలను దాదాపు విక్రయించినప్పటికీ ఆల్ఫాబెట్ ఎగ్జిక్యూటివ్ టీమ్లో కీలక సభ్యుడిగా కొనసాగుతున్నారు. అదేవిధంగా 1998లో అమెజాన్ కంపెనీ ప్రారంభ దశలో అగ్రగామిగా ఉన్న జంగ్లీని కొనుగోలు చేసింది. ఆ తర్వాత 2000 సంవత్సరంలో ఆయన అమెజాన్ కంపెనీని వీడారు.


Click it and Unblock the Notifications