Exicom Tele Systems IPO: భారత్ వేగంగా తన రవాణా వ్యవస్థలో ఈవీలను ప్రవేశపెట్టే దిశగా పలు అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోని ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేవారికి అనేక సబ్సిడీలను కూడా అందిస్తోంది. ఈ క్రమంలో ఈవీ రంగంలోని కంపెనీ ఒకటి తాజాగా తన ఐపీవోను ఫ్లోట్ చేసేందుకు ముందుకొస్తోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన ఛార్జర్ల తయారీ వ్యాపారంలో ఉన్న ఎక్సికామ్ టెలి-సిస్టమ్స్ లిమిటెడ్ కంపెనీ ఐపీవో గురించే. రానున్న వారంలో ఈ ఐపీవో ఇష్యూ దేశీయ రిటైల్ పెట్టుబడిదారులకు అందుబాటులోకి రాబోతోంది. ఐపీవో ఫిబ్రవరి 27 నుంచి 29 వరకు పెట్టుబడిదారుల కోసం తెరవబడుతోంది. ఇదే క్రమంలో యాంకర్ ఇన్వస్టర్లకు ఒకరోజు ముందు అంటే ఫిబ్రవరి 26న అందుబాటులోకి రానుంది. షేర్ ఇష్యూ ధర దాదాపు రూ.140గా ఉండవచ్చని తెలుస్తోంది. కంపెనీ ఇంకా ఇష్యూ ధరను ప్రకటించనప్పటికీ గ్రేమార్కెట్లో ఒక్కో షేరు రూ.55 ప్రీమియం రేటుకు ట్రేడవుతున్నాయి.

ఈవీ రంగంలో ఉన్న కంపెనీ తన ఐపీవో ద్వారా మెుత్తంగా రూ.329 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇందులో తాజా ఈక్విటీ షేర్ల ఇష్యూతో పాటు ఆఫర్ ఫర్ సేల్ కూడా ఉంటుందని వెల్లడైంది. కంపెనీ ప్రమోటర్లకు చెందిన దాదాపు 70.42 లక్షల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయించబడుతున్నాయి. కంపెనీ పవర్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్. ఇది ఎలక్ట్రికల్ వాహనాలకు ఛార్జర్ సొల్యూషన్స్, పవర్ సొల్యూషన్స్ బిజినెస్ అనే రెండు వ్యాపార విభాగాలను కలిగి ఉంది.
ప్రస్తుతం కంపెనీలో నెక్స్ట్వేవ్ కమ్యూనికేషన్స్ మెజారిటీ వాటాను 76.55 శాతం కలిగి ఉండగా, ప్రమోటర్ గ్రూప్లోని హెచ్ఎఫ్సీఎల్ సంస్థలో 7.74 శాతం వాటాను కలిగి ఉంది. మొత్తం మీద ప్రమోటర్లు సమిష్టిగా ఆక్సికామ్ టెలి-సిస్టమ్స్లో 93.28 శాతం యాజమాన్య ఆసక్తిని కలిగి ఉన్నారు. ఈ క్రమంలో కంపెనీ తన షేర్లు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో ఏకకాలంలో లిస్ట్ చేయాలని నిర్ణయించింది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications