Market Crash: రెండురోజుల్లో సెన్సెక్స్ 2000 పాయింట్లు ఆవిరి.. దీనికి 5 కారణాలివే..

Market Fall: భారీగా ర్యాలీ కొనసాగించిన భారత బెంచ్ మార్క్ సూచీలు ఒక్కారిగా నిన్న మధ్యాహ్నం నుంచి నష్టాల్లోకి జారుకున్నారు. బేర్స్ పంజాతో సెన్సెక్స్ సూచీ రెండు రోజుల్లో 1990 పాయింట్లు కోల్పోయింది.

నిపుణులు శాంటా ర్యాలీ ముగిసిందని అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు మార్కెట్ పతనం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. అలాగే ఈ నెలలో భారీగా కొనసాగిన షేర్ ధరల పెరుగుదలతో వాల్యుయేషన్‌లపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. FPI అవుట్‌ఫ్లోలు, బలహీనమైన గ్లోబల్ సెంటిమెంట్లు, దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసుపై ఆందోళనలు, డాలర్ బలహీనత, ఎర్ర సముద్రపు దాడులతో చమురు ధరలు పెరుగుతాయనే భయాలు ఇటీవలి ర్యాలీని నిలిపివేసాయి. ప్రధాన 5 కారణాలను పరిశీలిస్తే..

Know 5 key reasons behind indian stock markets crash sensex tanked 2000 points in 2 days

- సెన్సెక్స్ సూచీ అక్టోబర్ 26 నుంచి డిసెంబర్ 15 మధ్య కాలంలో 8,350 పాయింట్లు ర్యాలీ అయ్యాయి. ఇదే సమయంలో నిఫ్టీ సూచీ 21,600 స్థాయికి ఎగబాకింది. మార్కెట్ క్యాప్-టు-జీడీపీ నిష్పత్తి స్థాయిలకు చేరుకోవటం సంభావ్య ఓవర్‌వాల్యుయేషన్‌ను సూచిస్తుందని ఓల్డ్ బ్రిడ్జ్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ కెన్నెత్ ఆండ్రేడ్ ఫౌండర్ అన్నారు. అలాగే స్మాల్, మైక్రోక్యాప్ స్పేస్‌లో ర్యాలీ మితిమీరిపోవడం ఆందోళనలను కలిగిస్తుంది.

- విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవటం సెన్సెక్స్, నిఫ్టీల పతనానికి పాక్షికంగా నిలిచాయి. ఎన్‌ఎస్‌ఈతో తాత్కాలిక డేటా ప్రకారం బుధవారం దేశీయ స్టాక్‌లను రూ.1,322.08 కోట్లకు విక్రయించారు. క్రిస్మస్ సెలవులకు ముందు అమ్మకాలు కనిపించాయి. ఖచ్చితంగా చెప్పాలంటే రూ.56,617 కోట్ల ఎఫ్‌పీఐ ఇన్‌ఫ్లోల పరంగా డిసెంబర్ రికార్డు నమోదు చేసింది. దీనికి తోడు ప్రపంచ మార్కెట్ల నుంచి బలహీనమైన సంకేతాలు రావటం దేశీయ మార్కెట్లను ప్రభావితం చేస్తోంది.

- ఇక పోతే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలు పెరగవచ్చని ఆందోళనలు మార్కెట్ సెంటిమెంట్లను ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నాయి. ఎర్ర సముద్రంలో దాడుల కారణంగా సరఫరా ఆందోళనల కారణంగా ముడి చమురు గణనీయమైన అస్థిరతను ప్రదర్శించిందని విశ్లేషకులు తెలిపారు. నౌకలపై యెమెన్‌కి చెందిన ఇరాన్-సమగ్ర హౌతీ మిలిటెంట్లు జరిపిన దాడులు సముద్ర వాణిజ్యానికి అంతరాయం కలిగించాయి. కొత్త ఏడాది చమురు ధరలు పెరగొచ్చని, చైనా నుంచి డిమాండ్ కూడా ప్రభావాన్ని చూపుతోంది.

వీటన్నిటికి తోడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు ఆందోళనలు కలిగిస్తున్నాయి. ప్రస్తుతం కరోనా సబ్-వేరియంట్ JN.1 కారణంగా ఎక్కువ మంది ఎఫెక్ట్ అవుతున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+