Market Rally: నెల చివరి రోజుకు ఒక్కరోజు ముందు, కొత్త వారం తొలిరోజైన నేడు దేశీయ స్టాక్ మార్కెట్లలో అనూహ్యమైన ర్యాలీ కొనసాగింది. వాస్తవానికి ఇంట్రాడేలో బెంచ్ మార్క్ సూచీల దౌడు అస్సలు ఊహించనిది. ఈ క్రమంలో సెన్సెక్స్ దాదాపు 990 పాయింట్లు ఇంట్రాడేలో పెరగగా.. నిఫ్టీ 22,600 మార్కును అధిగమించింది.
ముందుగా నేడు బ్యాంకింగ్ రంగంలోని ఐసీఐసీఐ, ఎస్బీఐ కంపెనీల షేర్లలో నెలకొన్న ర్యాలీ మార్కెట్లను ముందుకు నడవటంలో దోహదపడింది. ఈ క్రమంలో ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు 5 శాతం పెరిగి రూ.1161 మార్కును చేరుకోగా.. ఎస్బీఐ షేర్లు సైతం 4 శాతం ర్యాలీ అయ్యాయి. బ్యాంకింగ్ దిగ్గజాలు ప్రధానంగా నాలుగో త్రైమాసికంలో ఆరోగ్యకరమైన ఆదాయాలను నమోదు చేయటంతో ఇన్వెస్టర్లు కంపెనీల షేర్లను కొనుగోలు చేసేందుకు నేడు ఇంట్రాడేలో ఎగబడ్డారు. సెన్సెక్స్ సూచీలో ఐసీఐసీఐకి 21 శాతం, ఎస్బీఐకి 19 శాతం వెయిటేజ్ ఉన్న సంగతి తెలిసిందే. వీటికి తోడు ఇతర ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకింగ్ సంస్థల షేర్లు సైతం ర్యాలీలో పాల్గొనటం రెండవ కారణంగా నిలిచింది.

దీనికి తోడు ఇన్వెస్టర్లు గమనించాల్సిన మూడో విషయం తగ్గిన 10 సంవత్సరాల బాండ్ రాబడులు. శుక్రవారం 7.199 శాతం ఉన్న బాండ్ ఈల్డ్ సోమవారం ఇంట్రాడేలో 7.176కి తగ్గటం ఈక్విటీలను మరింత ఆకర్షనీయంగా మార్చాయి. దీంతో ఇన్వెస్టర్లు నేడు స్టాక్ మార్కెట్లలోకి తమ డబ్బును గుమ్మరించారు. అమెరికాలో ద్రవ్యోల్బణం సంఖ్యలు అంచనాలకు అనుగుణంగా ఉండటంతో ఎఫ్ఐఐలు స్వల్ప విక్రయాలకు పాల్పడుతున్నారు.
నేడు భారతీయ మార్కెట్లు పైపైకి ఎగబడాకటానికి అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల అంశాలు సైతం తోడ్పాటును అందించాయి. ప్రధానంగా యూరోపియన్ మార్కెట్లలో పెరుగుదల.. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల ప్రకటన ఈవారం ఉండటం, ఇంజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొంత చల్లారటం భారతీయ మార్కెట్లను నడిపించిన నాలుగో గ్లోబల్ అంశాలుగా ఉన్నాయి. ఇక చివరిగా టెక్నికల్స్ సైతం మార్కెట్లను ముందుకు నడవటంలో దోహదపడ్డాయి. ఈ వారం నిఫ్టీ సూచీ 22,000-22,800 స్థాయిలో, సెన్సెక్స్ సూచీ 72,500-75,000 రేంజ్లో ట్రేడ్ అవుతాయని ప్రభుదాస్ లిల్లాధర్ టెక్నికల్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ వైశాలి పరేఖ్ తెలిపారు.
More From GoodReturns

Stock Market: సెన్సెక్స్ టాప్ లూజర్స్ ఇవే.. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలా, లేక ఇన్వెస్ట్ చేయాలా?

Stock market: ఐటీ స్టాక్స్ క్రాష్! నిఫ్టీ ఐటీ ఇండెక్స్ డౌన్.. భారీ నష్టాల్లో టాప్ కంపెనీలు!

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?



Click it and Unblock the Notifications