War Stocks: ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి.. స్టాక్ మార్కెట్‌లో రెచ్చిపోయిన 14 స్టాక్స్ ఇవే..!!

Iran - Israel Attack: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ విన్నా ఇజ్రాయెల్-ఇరాన్ దాడి గురించే చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇది ముదిరి యుద్ధ దిశగా దారితీస్తుందా అనే అనుమానాలు భయాలను పెంచుతున్నాయి. ఈ పరిస్థితులు పరోక్షంగా భారత స్టాక్ మార్కెట్లను సైతం నష్టాల్లోకి నెట్టిన సంగతి తెలిసిందే.

దీంతో కొత్త వారం మెుదటి రోజున దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రారంభం కాగానే కొన్ని నిమిషాల్లోనే ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.6 లక్షల కోట్ల మేర ఆవిరైపోయింది. ఇరాన్-ఇజ్రాయెల్ దాడి మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను పెంచటంతో పాటు ప్రపంచ మార్కెట్లను నష్టాల్లోకి నెట్టేసింది. దీంతో గతకొంత కాలంగా కొనసాగుతున్న భారత స్టాక్ మార్కెట్ల ర్యాలీకి బ్రేక్ పడింది. ప్రస్తుతం మార్కెట్లు భారీ కరెక్షన్ చూస్తున్నాయి.

Know 14 stocks that impacted with escalating tensions between Iran - Israel after Attack

ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్ల చూపు ఇజ్రాయెల్‌తో ముడిపడి ఉన్న భారతీయ కంపెనీలపై పడింది. ఇరాన్-ఇజ్రాయెల్ వివాదం వల్ల ప్రభావితమయ్యే 14 భారతీయ కంపెనీలను పెట్టుబడిదారులు నిశితంగా గమనిస్తున్నారు. కొన్ని ప్రముఖ కంపెనీల్లో అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, లుపిన్‌తో పాటు టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి IT కంపెనీలు కూడా ఉన్నాయి. అదానీ పోర్ట్స్ ఇజ్రాయెల్‌లోని హైఫా పోర్ట్‌ను కలిగి ఉండగా.. టారో ఫార్మాలో మెజారిటీ వాటాను సన్ ఫార్మా కలిగి ఉంది. అదేవిధంగా ఎన్‌ఎంటీసీ, కళ్యాణ్ జ్యువెలర్స్, టైటాన్, విప్రో, టెక్ మహీంద్రా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లార్సెన్ అండ్ టూబ్రో కూడా ఇజ్రాయెల్‌లో పెట్టుబడులు కలిగి ఉన్నాయి.

నేడు ప్రభావితమైన 14 కంపెనీల జాబితాలో షేర్లు కలిగి ఉన్న వ్యక్తులు మార్కెట్ పరిస్థితిని విశ్లేషించి.. దీర్ఘకాల కోణంలో బై ఆన్ డిప్స్ ఆధారంగా కొనుగోలు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే షేర్లు ఇంకా పతనమవుతాయనే భయం ఉన్న వారు వేచి ఉండే ధోరణిని కాదనుకున్నట్లయితే సరైన సమయంలో స్టాక్స్ విక్రయించవచ్చని వారు చెబుతున్నారు. అలాగే స్టాక్ మార్కెట్లు ఇప్పటికే గరిష్ఠ స్థాయిల్లో ట్రేడవుతుండడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని మార్కెట్ నిపుణులు అంటున్నారు.

భారతదేశ ప్రధాన స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్- నిఫ్టీ గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలను తాకినప్పటికీ.. తాజాగా క్షీణించిన భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ఐటీ, ఎక్స్‌పోర్ట్స్, ఫార్మా, బ్యాంకింగ్ సహా మరిన్ని రంగాలు ప్రభావితం అవుతున్నాయి. ఈ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలను 50-100 డాలర్లు పెంచవచ్చు. అదేవిధంగా ముడి చమురు ధరలు 90 డాలర్ల స్థాయి నుంచి 93-95 డాలర్లకు పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+