Stocks In Focus: ఇజ్రాయెల్తో కనెక్షన్ ఉన్న ఇండియన్ స్టాక్స్.. మీ దగ్గర ఉన్నాయా.??
Stocks In Focus: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇన్వెస్టర్లను కలవరానికి గురిచేస్తున్న ఏకైక అంశం ఇజ్రాయెల్ యుద్ధం. దీని ప్రభావం చాలా దేశాలపై పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అయితే తాజా యుద్ధం ఉక్రెయిన్-రష్యా దాని కంటే చిన్నదేనని. ఈక్విటీ మార్కెట్లపై భారీ ప్రభావం ఉండకపోవచ్చని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం భారతదేశానికి చెందిన కొన్ని కంపెనీలను ప్రభావితం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ రాజకీయ పరిస్థితులు మారిన వేళ పెట్టుబడిదారులు ఈ కంపెనీలపై అప్రమత్తతను ప్రదర్శిస్తున్నారు. ఇదే క్రమంలో క్రూడ్ ఆయిల్ ధరలు సైతం పెరుగుతున్నాయి.

భారత్కు సంబంధించి అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, లుపిన్, ఎన్ఎమ్డీసీ, కళ్యాణ్ జ్యూవెలర్స్, టైటాన్, టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, ఎల్&టి కంపెనీల షేర్లపై ఇన్వెస్టర్ల దృష్టి పడింది. ఎందుకంటే ఈ కంపెనీలు ఇజ్రాయెల్లో వ్యాపార భాగస్వామ్యాలు ఉన్నాయి కాబట్టి. ఇటీవల జీ20 సదస్సు వేదికగా నిర్ణయించిన.. భారతదేశం-మిడిల్ ఈస్ట్-యూరోప్ ఎకనామిక్ కారిడార్ను నిర్మించాలనే భారతదేశ ప్రణాళికపై తాజా పరిస్థితులు ప్రభావం చూపవచ్చని నిపుణులు చెబుతున్నారు.
తాజా పరిణామాల కారణంగా పెరుగుతున్న చమురు ధరలతో వివాదం ఆయిల్ కంపెనీలు, రైల్వే స్టాక్స్, షిప్పింగ్ కంపెనీలపై ప్రభావం చూపుతోంది. అలాగే బాండ్స్ అండ్ ఈక్విటీ మార్కెట్లు తాత్కాలికంగా ఓలటాలిటీకి గురవుతున్నాయి. దీనికి తోడు క్యాపిటల్ మార్కెట్, బ్యాంకింగ్ రంగం, ద్రవ్య లోటుపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున పరిస్థితులను పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. హటాత్తుగా ఏర్పడిన ఈ పరిణామాలు దలాల్ స్ట్రీట్ పెట్టుబడిదారులు ఆందోళనకు స్పష్టమైన సంకేతాలను చూపుతోంది.


Click it and Unblock the Notifications


