Stocks In Focus: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇన్వెస్టర్లను కలవరానికి గురిచేస్తున్న ఏకైక అంశం ఇజ్రాయెల్ యుద్ధం. దీని ప్రభావం చాలా దేశాలపై పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అయితే తాజా యుద్ధం ఉక్రెయిన్-రష్యా దాని కంటే చిన్నదేనని. ఈక్విటీ మార్కెట్లపై భారీ ప్రభావం ఉండకపోవచ్చని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం భారతదేశానికి చెందిన కొన్ని కంపెనీలను ప్రభావితం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ రాజకీయ పరిస్థితులు మారిన వేళ పెట్టుబడిదారులు ఈ కంపెనీలపై అప్రమత్తతను ప్రదర్శిస్తున్నారు. ఇదే క్రమంలో క్రూడ్ ఆయిల్ ధరలు సైతం పెరుగుతున్నాయి.

భారత్కు సంబంధించి అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, లుపిన్, ఎన్ఎమ్డీసీ, కళ్యాణ్ జ్యూవెలర్స్, టైటాన్, టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, ఎల్&టి కంపెనీల షేర్లపై ఇన్వెస్టర్ల దృష్టి పడింది. ఎందుకంటే ఈ కంపెనీలు ఇజ్రాయెల్లో వ్యాపార భాగస్వామ్యాలు ఉన్నాయి కాబట్టి. ఇటీవల జీ20 సదస్సు వేదికగా నిర్ణయించిన.. భారతదేశం-మిడిల్ ఈస్ట్-యూరోప్ ఎకనామిక్ కారిడార్ను నిర్మించాలనే భారతదేశ ప్రణాళికపై తాజా పరిస్థితులు ప్రభావం చూపవచ్చని నిపుణులు చెబుతున్నారు.
తాజా పరిణామాల కారణంగా పెరుగుతున్న చమురు ధరలతో వివాదం ఆయిల్ కంపెనీలు, రైల్వే స్టాక్స్, షిప్పింగ్ కంపెనీలపై ప్రభావం చూపుతోంది. అలాగే బాండ్స్ అండ్ ఈక్విటీ మార్కెట్లు తాత్కాలికంగా ఓలటాలిటీకి గురవుతున్నాయి. దీనికి తోడు క్యాపిటల్ మార్కెట్, బ్యాంకింగ్ రంగం, ద్రవ్య లోటుపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున పరిస్థితులను పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. హటాత్తుగా ఏర్పడిన ఈ పరిణామాలు దలాల్ స్ట్రీట్ పెట్టుబడిదారులు ఆందోళనకు స్పష్టమైన సంకేతాలను చూపుతోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications