బ్యాంకులతో పాటు తన క్లయింట్స్ను మోసం చేశారనే ఆరోపణలపై కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్(KSBL) చైర్మన్ సీ పార్థసారథిని హైదరాబాదా సీసీఎస్, డిటెక్టివ్ డిపార్టుమెంట్(DD) పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల కార్వీ సంస్థపై ప్రముఖ బ్యాంకు ఇండస్ఇండ్ బ్యాంకు వైస్ ప్రెసిడెంట్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో కేసు నమోదు చేసిన డిటెక్టివ్ విభాగం పోలీసులు దర్యాఫ్తును ప్రారంభించారు. పార్థసారథి ఇండస్ఇండ్ బ్యాంకులో సెక్యూరిటీలు, షేర్లు తనఖా పెట్టడంతో పాటు వ్యక్తిగత పూచీకత్తుతో బ్యాంకు నుండి రూ.137 కోట్ల రుణం పొందినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ రుణాలను తన సొంత అవసరాల కోసం ఇతర బ్యాంకు ఖాతాలకు మళ్లించినట్లు పేర్కొంది. మార్చి 31వ తేదీతో ముగిసిన 2020-21 ఆర్థిక సంవత్సరానికి కార్వీ రుణాలు చెల్లించడంలో విఫలమైనందున చర్యలు తీసుకోవాలని ఇండస్ఇండ్ బ్యాంకు తన ఫిర్యాదులో పేర్కొంది.
తనఖా పెట్టిన సెక్యూరిటీ బాండ్స్, షేర్లు ఖాతాదారులకు తెలియకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడి, వాటిని మోసపూరితంగా బ్యాంకుకు సమర్పించినట్లు విచారణలో వెల్లడైంది. ఆయా ఖాతాదారులు కార్వీలో ఉన్న తమ డీమ్యాట్ అకౌంట్లకు బదిలీ చేసిన సెక్యూరిటీస్ను తనఖా పెట్టి మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. రెండేళ్ల నుండి సాగుతున్న ఈ మోసాన్ని 2019 నవంబర్ 22వ తేదీన మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ గుర్తించింది. కార్వీ పైన నిషేధం కూడా విధించింది.

స్టాక్ బ్రోకింగ్ నిర్వహించే KSBLకు దాదాపు రెండు లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. ఇందులో ఆయా కస్టమర్లకు చెందిన డీమ్యాట్ ఖాతాలను చాలా వరకు KSBL నిర్వహించేంది. ఈ క్రమంలో కస్టమర్లకు సంబంధించిన స్టాక్స్ను తమ ఖాతాలోకి బదలీ చేసుకొని బదలీ చేసుకున్న వాటిని ఇండస్ఇండ్ బ్యాంకులో మార్చి 2019 నుండి తనఖా పెడుతూ రూ.137 కోట్ల రుణం పొందారు. ఈ రుణం చెల్లించకపోవడంతో ఇండస్ఇండ్ బ్యాంకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాఫ్తు చేసి, పార్ధసారథిని అరెస్ట్ చేశారు.
నిందితులు బ్యాంకుల నుండి భారీగా రుణాలు పొంది రూ.720 కోట్లు ఇతర ఖాతాల్లోకి మళ్లించినట్లు దర్యాఫ్తులో తేలింది. దర్యాఫ్తులో నిందితులు బ్యాంకుల నుండి భారీగా రుణాలు పొంది రూ.720 కోట్లు ఇతర ఖాతాల్లోకి మళ్ళించినట్లు వెలుగు చూసింది. కేవలం ఇండస్ఇండ్ బ్యాంకు మాత్రమే కాకుండా, ఇతర బ్యాంకుల నుండి కూడా ఇలా తమ కస్టమర్స్ షేర్లను సెక్యూరిటీగా పెట్టి రూ.680 కోట్ల వరకు రుణాలు తీసుకున్నట్లు పోలుసులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా కస్టమర్ల షేర్లను తనఖా పెట్టడంతో కార్వీపై గత ఏడాది సెబి నిషేధం విధించింది.
రుణాలు పొంది మోసం చేసిన రెండు కేసుల్లో రూ.347 కోట్లు కాజేసినట్లు సీసీఎస్ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం కేసులన్నీ విచారణలో ఉన్నట్లు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అవినాష్ మహంతి తెలిపారు. ఆయా కేసుల విచారణతో పాటు తాజా కేసుల్లో నిందితుడిగా ఉన్న పార్థసారథిని పోలీసులు జూబ్లీహిల్స్లో అదుపులోకి తీసుకున్నారు. అతనిని రిమాండుకు తరలించారు. ఇదిలా ఉండగా బ్యాంకు రుణం ఎగవేత, మనీలాండరింగ్ కేసులో మరో ఎండీని పోలీసులు అరెస్టు చేశారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications