కార్వీ కేసులో రూ.2,300 కోట్లు ఇన్వెస్టర్ల ఖాతాల్లోకి...

కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ కేసులో 2.35 లక్షల ఇన్వెస్టర్లకు ఇప్పటి వరకు రూ.2,300 కోట్ల విలువైన ఫండ్స్, సెక్యూరిటీస్‌ను సెటిల్ చేసినట్లు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్(NSE) మంగళవారం తెలిపింది. రూ.30వేల వరకు ఉన్న బకాయిలను సెటిల్ చేసినట్లు తెలిపింది. 2.35 లక్షల మంది పెట్టుబడిదారుల డీమ్యాట్ ఖాతాల నుండి అక్రమంగా షేర్లను మళ్లించిందని కార్వీ స్టాక్ బ్రోకింగ్ ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇందులో భాగంగా రూ.2300 కోట్ల మేర పరిష్కరించినట్లు NSE తెలిపింది.

సెబి మార్గదర్శకాల ప్రకారం ఆయా ఖాతాదారులకు సంబంధించిన షేర్లను వారి ఖాతాల్లోకి జమ చేసినట్లు తెలిపింది. క్లియరింగ్ కార్పోరేషన్లలో జమ చేసిన బ్యాంకు హామీలు, కార్వీ గ్రూప్ వద్ద ఉన్న లిక్విడేటెడ్ సెక్యూరిటీలను ఇందుకు వినియోగించినట్లు తెలిపింది. క్రమశిక్షణ చర్యలు కొనసాగుతున్నాయని, చిన్న ఇన్వెస్టర్ల ప్రయోజనాలు కాపాడేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపింది.

Karvy case: NSE settles claims worth Rs 2,300 crore of 2.35 lakh investors

కార్వీ కేసులో ఇప్పటివరకు రూ.2,300 కోట్ల విలువైన షేర్లను మదుపరుల ఖాతాలకు బదిలీ చేసినట్లు ఎన్ఎస్ఈ తాజాగా ప్రకటించడం గమనార్హం. పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా లభించిన ఖాతాదారుల షేర్లను కార్వీ సంస్థ తన అవసరాల కోసం బ్యాంకులు, ఆర్థిక సంస్థల వద్ద తనఖా పెట్టడంతో ఈ కేసు బయటపడింది. దీంతో గత ఏడాది సెబీ... కార్వీ సంస్థను వ్యాపార లావాదేవీల నుంచి నిషేధించింది. సెబీ ఆదేశాలతో స్టాక్ ఎక్స్చేంజీలు ఈ షేర్లను మళ్లీ ఖాతాదారుల ఖాతాలకు బదిలీ చేసేందుకు చర్యలు తీసుకున్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+