మరో రెండు రోజుల్లో ఉగాది ఇంకా ఈద్ పండుగలు రాబోతున్నాయి. అయితే ఈసారి ఉగాది పండుగ ఆదివారం, ఈద్ సోమవారం రోజున రానుంది. దీనికి తోడు రేపు శనివారం, దింతో స్కూల్స్, కాలేజెస్ ఇంకా ఉద్యోగాలు చేసేవారికి వరుసగా హాలీడేస్ రానున్నాయి. ఈ తరుణంలో ఉగాది ఇంకా ఈద్ అల్-ఫితర్ పండుగల సందర్భంగా సొంత ఊరు, ప్రయాణాలు చేసేవారికి సౌకర్యాలు కల్పించడానికి అదనపు బస్సులను నడపనున్నట్లు కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) తాజాగా ప్రకటించింది. ఈ రోజుల్లో అంచనా వేసినట్లుగా అధిక రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ పండుగల సమయంలో 2 వేల అదనపు బస్సులు నడపనున్నట్లు కర్ణాటక స్టేట్ RTC తెలిపింది.

మార్చి 30న ఉగాది పండుగ, మార్చి 31న ఈద్ అల్-ఫితర్ జరుపుకునే అవకాశం ఉండటంతో బెంగళూరుకు పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు వివరాలు అందిస్తూ పేర్కొన్నారు. మార్చి 28 నుండి 30 మధ్య బెంగళూరు నుండి వివిధ ప్రాంతాలకు అదనపు బస్సులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ గమ్యస్థానాల నుండి కర్ణాటక రాజధానికి తిరిగి వచ్చే సర్వీసులు మార్చి 31 వరకు అందుబాటులో ఉంటాయని అధికారిక ప్రకటన సూచించింది. మరిన్ని వివరాలను అందిస్తూ బెంగళూరులోని కెంపెగౌడ బస్ స్టేషన్ నుండి ధర్మస్థల, కుక్కేసుబ్రమణ్య, శివమొగ్గ, హసన్, మంగళూరు, కుందపుర, శృంగేరి, హొరనాడు, దావణగెరె, హుబ్బళ్లి, ధార్వాడ్ వంటి వివిధ గమ్యస్థానాలకు మరిన్ని బస్సులు నడుస్తాయని అధికారులు తెలిపారు.
అంతే కాకుండా బెలగావి, విజయపుర, గోకర్ణ, సిర్సి, కార్వార్, రాయచూర్, కలబురగి, బళ్లారి, కొప్పాల, యాద్గిర్, బీదర్, తిరుపతి, విజయవాడ, హైదరాబాద్ ఇంకా ఇతర ప్రాంతాలకు కూడా బస్సులు నడుస్తాయి. మైసూరు రోడ్ బస్ స్టేషన్ నుండి బస్సులు మైసూరు, హున్సూరు, పిరియాపట్న, విరాజ్పేట, కుశాలనగర్ అలాగే మడికేరికి వెళ్తాయని అధికారులు తెలిపారు.
శాంతినగర్లోని BMTC బస్ స్టేషన్ నుండి తమిళనాడు అండ్ కేరళలోని గమ్యస్థానాలకు KSRTC ప్రీమియం సేవలను కూడా నిర్వహిస్తుందని అధికారిక ప్రకటన పేర్కొంది. ఈ బస్సులు మధురై, కుంభకోణం, చెన్నై, కోయంబత్తూర్, తిరుచ్చి, పాలక్కాడ్, త్రిస్సూర్ ఇంకా కోజికోడ్ వంటి ఇతర నగరాలకు ప్రయాణిస్తాయి. కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ సిస్టమ్ ద్వారా ప్రయాణికులు ప్రత్యేక సేవలకు ప్రి బుకింగ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ పండుగల సమయంలో పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రయాణించే అవకాశం ఉన్నందున, రద్దీని నియంత్రించడానికి ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications