Facebook: ప్రపంచ వ్యాప్తంగా చాలా పాపులర్ అయిన సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్బుక్. అయితే కంపెనీ కార్యకలాపాలను దేశంలో మూసివేయాలని ఆదేశించాల్సి వస్తుందని కర్ణాటక హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది.
అమెరికాకు చెందిన సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మన దేశంలో మంచి ఆధరణ కలిగి ఉంది. ఈ క్రమంలో ఫేస్బుక్ కార్యకలాపాలను మూసివేయడానికి ఆర్డర్ జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తామని కర్ణాటక హైకోర్టు హెచ్చరించింది. సౌదీ అరేబియాలో ఖైదు అరెస్టైన భారతీయ పౌరుడి కేసు దర్యాప్తులో స్థానిక పోలీసులకు సహకరింకచలేదనే ఆరోపణల నేపథ్యంలో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

అవసరమైన సమాచారంతో కూడిన పూర్తి నివేదికను ఒక వారంలోగా కోర్టు ముందు సమర్పించాలని జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్తో కూడిన ధర్మాసనం ఆదేశించింది. మంగళూరు సమీపంలోని బికర్నకట్టే నివాసి కవిత సమర్పించిన పిటిషన్ విచారణ సమయంలో ఫేస్బుక్కు ఆదేశాలు జారీ చేసింది. తప్పుడు కేసులో భారతీయ పౌరుడిని అరెస్టు చేసిన కేసులో ఎలాంటి చర్యలు తీసుకున్నారనే దానిపై కేంద్ర ప్రభుత్వం సమాచారం ఇవ్వాలని పేర్కొంది.
గత 25 ఏళ్లుగా శైలేష్ కుమార్ (52) సౌదీ అరేబియాలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర రిజిస్టర్కు మద్దతుగా ఫేస్బుక్లో మెసేజ్ పెట్టినట్లు ఆమె తెలిపారు. అయితే తెలియని వ్యక్తులు శైలేష్ పేరు మీద నకిలీ Facebook ఖాతాను తెరిచారు. వారు సౌదీ, ఇస్లాం రాజుకు వ్యతిరేకంగా అభ్యంతరకరమైన పోస్ట్లను పోస్ట్ చేశారు. దీంతో సౌదీ పోలీసులు శైలేష్ కుమార్ను అరెస్టు చేసి జైలులో పెట్టారు. విషయం తెలియటంతో అతని కుటుంబసభ్యులు మంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దర్యాప్తు చేపట్టిన మంగళూరు పోలీసులు ఫేస్బుక్కు నకిలీ ఫేస్బుక్ ఖాతా తెరిచినట్లు సమాచారం అందించారు. దీనిపై సోషల్ మీడియా దిగ్గజం అస్సలు స్పందించలేదు. 2021లో విచారణలో జాప్యాన్ని ప్రశ్నిస్తూ పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు. తన భర్తను జైలు నుంచి విడుదల చేయాలని కవిత కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అభ్యర్థించారు.


Click it and Unblock the Notifications