ఆఫ్ఘనిస్తాన్ రాజధాని, కాబుల్ ఇప్పుడు ప్రపంచంలోనే తొలి ఆధునిక నగరంగా పూర్తిగా నీటి వనరులు ఎండిపోయే ప్రమాదంలో ఉంది. ఇది హెచ్చరిక కాదు జులై 2025లో, ఐక్యరాజ్యసమితి హాబీటట్ (UN-Habitat), మేర్సి కార్ప్స్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఈ పరిస్థితిని "Unprecedented humanitarian disaster"గా పేర్కొన్నాయి.

ఎందుకు ఈ స్థితికి చేరింది కాబుల్?
2001లో కాబుల్ జనాభా కేవలం 1 మిలియన్ మంది మాత్రమే. ఇప్పుడు అదే నగరంలో 6 మిలియన్కి పైగా ప్రజలు నివసిస్తున్నారు. ఈ వేగమైన జనాభా పెరుగుదల, నియంత్రణలేని పట్టణీకరణ, మారిన వాతావరణ పరిస్థితులు కలిసిపడి నగరంలోని నీటి మూలాలపై తీవ్రమైన ఒత్తిడిని కలిగించాయి.
మేర్సి కార్ప్స్ నివేదిక ప్రకారం, కాబుల్లోని మూడు ప్రధాన Aquifers (భూమిగర్భపు నీటి నిల్వలు) గత పదేళ్లలో 25-30 మీటర్లు దిగిపోయాయి. నగరం సంవత్సరానికి 44 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని వాడుతోంది. ఇది ప్రకృతి సిద్ధంగా పునరుత్పత్తి అయ్యే పరిమితిని రెట్టింపు చేస్తోంది.
ఈ పరిస్థితిలో, 2030 నాటికి నగరంలోని నీటి మూలాలు పూర్తిగా ఎండిపోయే అవకాశం ఉంది. దీనివల్ల సుమారు 30 లక్షల మంది నిరాశ్రయులవుతారు. ఇది అఫ్ఘానిస్తాన్కే కాక, గ్లోబల్ హ్యూమానిటేరియన్ సంక్షోభాన్ని తలపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే భూగర్భజలాల్లో 50% బోర్లు ఎండిపోయాయ\కాబుల్ ప్రజలు ఎక్కువగా బోర్వెల్స్ ద్వారా తాగునీటిని పొందుతుంటారు. వాటిలో సగం కంటే ఎక్కువ ఇప్పటికే నీరు లేకపోవడంతో పూర్తిగా నిరుపయోగంగా మారిపోయాయి. అదనంగా, పట్టణ వ్యాప్తంగా 1.2 లక్షలకు పైగా నియంత్రణలేని బోర్లు, సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిశ్రమల, పొలాల అవసరాలు - ఇవన్నీ కలిసిపోయి నిల్వల్ని ఖాళీ చేస్తున్నాయి.
Mercy Corps తాజా నివేదిక ప్రకారం:
1. చాలా కుటుంబాలు తమ ఆదాయంలో 25%-30% వరకు నీటి కోసం ఖర్చు చేస్తున్నాయి.
2. మూడవ వంతు కుటుంబాలు ఇప్పటికే నీటి అప్పుల్లో ఉన్నాయన్నది ఆందోళనకరం.
3. ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లపై ఆధారపడే పరిస్థితి వల్ల వినియోగదారులకు నీటి ధరలు మరింత భారంగా మారాయి.
ఇప్పటికైనా ఉన్న భూగర్భజలాల్లో 80% నీరు మలినమైపోయింది. అరసెనిక్, సేవేజ్, ఉప్పు లాంటి కలుషితాలు తాగునీటిని ప్రమాదకరంగా మార్చాయి. శుభ్రమైన నీటి లభ్యత లేకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి.
అధిక జనాభా పెరుగుదలతో నీటి సరఫరా మౌలిక సదుపాయాలు అభివృద్ధి కాలేదు. పురపాలక విభాగాల్లో ప్రణాళికా లోపం, నీటి పంపిణీలో లీకేజ్లు, మరమ్మత్తుల రాహిత్యం కారణంగా నీటి నష్టం అధికమైంది. సుదీర్ఘ కాలం యుద్ధాలు, అస్థిర పాలన, సరైన నీటి విధానాల లేకపోవడం వల్ల నగర పాలన నీటి నేతృత్వాన్ని సక్రమంగా చేయలేకపోయింది. తాత్కాలిక ప్రభుత్వం పై ప్రజలు దీనికి తక్షణ పరిష్కారాలు కోరుతున్నారు.
హిందూ కుష్ పర్వతాల శీతలీకరణ తగ్గిపోవడం, తక్కువ శీతాకాల వర్షపాతం ఇవి కాబుల్ నదికి, ఉపనదులకు వచ్చే జలప్రవాహాన్ని మరింత తగ్గిస్తున్నాయి. దీన్ని అధిగమించాలంటే వర్షపు నీటి సేకరణ, ప్రారంభ కాలమునుంచి నీటి అభివృద్ధి ప్రణాళికలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉపాధి, మౌలిక సదుపాయాల్లో మద్దతు కోసం UN మరియు ఇతర సంస్థలు చర్యలపై దృష్టి పెట్టేలా తీవ్ర పరిణామం ఏర్పడింది. సరైన పెట్టుబడులు, పాలనా సమన్వయం ద్వారా మాత్రమే దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధర పెరగడంతో వినియోగదారులు కొత్త స్కెచ్.. రూ.4 లక్షల కోట్లు దాటిన పసిడి రుణాలు..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బెంగళూరు-హైదరాబాద్ మధ్య ప్రయాణం గంటలే.. 110 కి.మీ.వేగంతో కొత్త రైలు వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..

బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే.. 11 ఇంటర్ఛేంజెస్ కనెక్టివిటితో బిజినెస్ కారిడార్ రెడీ..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications