IT News: టెక్ ఉద్యోగులు అనుకుంటున్నది, కోరుకుంటున్నది ఒకటైతే వాస్తవానికి జరుగుతుందో మరొకటి. చాలా కాలంగా ఊపిరి బిగబట్టుకుని తమ టైమ్ వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్న వారి నెత్తిన ప్రఖ్యాత ఫైనాన్స్ సంస్థ జేపీ మోర్గన్ బాంబు పేల్చింది.
అవును భారత ఐటీ పరిశ్రమపై జేపీ మోర్గన్ అనలిస్టులు నెగటివ్ ధృక్పదాన్ని కలిగి ఉన్నారు. రాబోయే సెప్టెంబరు త్రైమాసిక ఫలితాలు, భారతీయ IT కంపెనీల వ్యాఖ్యానాలను 'వాషౌట్' సంవత్సరంగా ఉంటాయని తేల్చి చెప్పారు. 2025 ఆర్థిక సంవత్సరంలో కంపెనీల డీల్స్ విషయంలో పురోగతి ఉండొచ్చని పేర్కొన్నారు. ఇటీవల తాము చేపట్టిన తనిఖీల ప్రకారం భారత ఐటీ రంగంలో చెప్పుకోదగిన పురోగతి కనిపించలేదని అందువల్ల తాము నెగజివ్ ధోరణిని కొనసాగిస్తామని విశ్లేషకులు అంకుర్ రుద్ర, భావిక్ మెహతా ఒక నోట్లో తెలిపారు.

ఇన్ఫోసిస్ లిమిటెడ్ , టీసీఎస్, విప్రో లిమిటెడ్, హెచ్సీఎల్టెక్తో సహా అన్ని ప్రధాన ఐటీ సంస్థలు గతంలో బలహీన పరిస్థితులపై హెచ్చరించాయి. అధిక వడ్డీ రేట్లు ఉన్న కాలంలో.. క్లయింట్లలో ఎక్కువ మంది యూఎస్కు చెందినవారు. పైగా ఆర్థిక వృద్ధి మందగించడం, కాంట్రాక్టులను వారు తగ్గించడం, ఆలస్యం చేయడం, ఒప్పందాలను రద్దు చేయడం వంటివి చేస్తున్నారని స్టేక్ హోల్డర్లకు తెలిపాయి. ఈ లెక్కన సెప్టెంబరుతో ముగిసే రెండవ త్రైమాసికంలో ఐటీ కంపెనీల ఆదాయాలు తప్పక మార్కెట్లను నిరుత్సాహ పరుస్తాయని తెలుస్తోంది.

విస్తృత మార్కెట్లో కంటే ఐటీ రంగంపై మరింత ప్రతికూలంగా ఉన్నాయని.. ఈ కారణంగా డీల్ ర్యాంప్-అప్లు నిదానంగా ఉంటాయని జేపీ మోర్గన్ వెల్లడించింది. JP మోర్గాన్ 2025 ఆర్థిక సంవత్సరంలో లార్జ్-క్యాప్ IT కంపెనీలకు ఎక్కువ శాతం పరంగా అధిక సింగిల్-డిజిట్ ఆదాయాల వృద్ధిని అంచనా వేస్తుంది. ఈ క్రమంలోనే ఐటీ కంపెనీల రేటింగ్ అప్ గ్రేడ్ చేసింది. రానున్న వారం టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్ తమ ఫలితాలను విడుదల చేస్తున్న తరుణంలో జేపీ మోర్గన్ నివేదిక మార్కెట్లలో పెను సంచలనానికి దారితీయనుంది.
More From GoodReturns

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications