Johnson & Johnson: జాన్సన్ & జాన్సన్ బేబీ పౌడర్ అమ్మకాల నిలిపివేత.. క్యాన్సర్ కారకమంటూ ఫిర్యాదులతో..
Johnson & Johnson: జాన్సన్ & జాన్సన్ తన ఐకానిక్ టాల్క్-ఆధారిత జాన్సన్ బేబీ పౌడర్ అమ్మకాలను 2023 నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిపివేయనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అంతకుముందు J&J అమెరికా, కెనడాలో తన బేబీ పౌడర్ అమ్మకాలను ముగించింది. అక్కడ బేబీ పౌడర్ క్యాన్సర్కు కారణమైందని పేర్కొంటూ వేలాది వ్యాజ్యాల దాఖలు కావటంతో ఉత్పత్తికి డిమాండ్ తగ్గింది.
వేల సంఖ్యలో కేసులు..
పోర్ట్ఫోలియో మదింపులో భాగంగా కార్న్స్టార్చ్-ఆధారిత బేబీ పౌడర్ పోర్ట్ఫోలియోకు మారడానికి వాణిజ్య నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ గురువారం తన ప్రకటనలో తెలిపింది. అయితే ఈ టాల్కమ్ పౌడర్ వల్ల వినియోగదారులు అండాశయ క్యాన్సర్కు గురవుతున్నట్లు దాదాపు 19,400 కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా బేబీ పౌడర్లు క్యాన్సర్కు కారణమయ్యే కార్సినోజెనిక్ పదార్థాలను తీసుకువెళుతున్నాయని నివేదించినందుకు వివాదం పెద్దదైంది. ఈ కారణంగా జాన్సన్ & జాన్సన్ కంపెనీపై 38 వేల వ్యాజ్యాలు నమోదయ్యాయని తెలుస్తోంది.
తమ బేబీ పౌడర్ సురక్షితమంటూ..
అయితే కంపెనీ మాత్రం టాల్క్ బేబీ పౌడర్ సురక్షితమైనదని, క్యాన్సర్కు కారణం కాదని కంపెనీ నొక్కి చెబుతోంది. పౌడర్ వాస్తవానికి క్యాన్సర్ను కలిగిస్తుందో లేదో, ప్రజలు ఉత్పత్తిని ఉపయోగించడానికి వెనుకాడుతున్నారని మిచిగాన్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఎరిక్ గోర్డాన్ 2020లో అసోసియేటెడ్ ప్రెస్కి ఒక ఈ-మెయిల్లో తెలిపారు.
చట్టంలోని లొసుగులను వాడుకుంటూ..
అయితే సుదీర్ఘమైన వ్యాజ్యాలను నివారించడానికి J&J చట్టపరమైన లొసుగులను ఉపయోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫిర్యాదులపై స్టే పొందేందుకు 'టెక్సాస్ టూ-స్టెప్' అనే తెలివైన ఉపాయాన్ని కంపెనీ ఉపయోగించింది. J&J తన బేబీ పౌడర్ పై వస్తున్న నిందను LTL మేనేజ్మెంట్ పేరుతో కొత్తగా విస్తరించిన అనుబంధ సంస్థపై మోపింది. ఇదే సమయంలో కంపెనీ దివాలా కోసం దాఖలు చేసి కోర్టు అనుమతి పొందింది. దివాలా తీసినప్పుడు, వ్యక్తిగత వ్యాజ్యాలు తాత్కాలికంగా నిలిపివేయబడతాయి. ఈ లొసుగుని వినియోగించుకుని జాన్సన్ & జాన్సన్ చట్టపరమైన ప్రక్రియ నుండి తప్పించుకోగలిగింది.