కొత్త పోస్ట్పెయిడ్ సబ్స్క్రైబర్లకు జియో ఫైబర్ అదిరిపోయే ఆఫర్
జియో ఫైబర్ అదిరిపోయే ఆఫర్. జియో ఫైబర్ పోస్ట్ పెయిడ్ విభాగంలో వినియోగదారులను ఆకర్షించే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నది. ఎంట్రీ ఫీజుతో పాటు ఇన్స్టలేషన్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. అంతేకాదు, ఈ విభాగంలో కొత్త పథకాలను తీసుకువచ్చింది. కొత్తగా జియో ఫైబర్ పోస్ట్పెయిడ్ సేవలను ఎంపిక చేసుకునే వారికి రూ.10వేలు విలువ చేసే ఇంటర్నెట్ బాక్స్, సెట్-టాప్ బాక్స్, వీటి ఇన్స్టలేషన్ను ఉచితంగా ఇస్తున్నట్లు జియో ప్రకటించింది.
సబ్స్క్రైబర్లకు నెలకు రూ.399, రూ.699 ప్రత్యేక ఇంటర్నెట్ పథకాలను తీసుకు వచ్చింది. వీటితో పాటు రూ.100 అదనంగా చెల్లిస్తే ఆరు ఎంటర్టైన్మెంట్ యాప్స్, రూ.200 చెల్లిస్తే 14 అదనపు ఎంటర్టైన్మెంట్ యాప్స్ను పొందవచ్చు. రూ.599 చెల్లించడం ద్వారా అన్-లిమిటెడ్ ఇంటర్నెట్ (30 Mbps) స్పీడ్, 14 ఓటీటీ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. మూడు నెలలకు ఓసారి కాకుండా ప్రతి నెల పోస్ట్ పెయిడ్ బిల్లు చెల్లించే అవకాశాన్ని తీసుకు వచ్చింది.
ఫిక్స్డ్ లైన్ బ్రాడ్ బ్యాండ్ సేవల విభాగంలో కొత్త కస్టమర్లను ఆకర్షించడంలో జియో ముందు ఉన్నది. కస్టమర్ల సంఖ్యాపరంగా దాదాపు దశాబ్దాలుగా అగ్రస్థానంలో ఉన్న బీఎస్ఎన్ఎల్ను వెనక్కి నెట్టి, గత నవంబర్ నెలలో జియో మొదటి స్థానానికి చేరుకున్నది.