రిలయన్స్ జియో వైఫై కాలింగ్ సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకు వచ్చింది. గత కొన్ని రోజులుగా టెస్టింగ్ దశలో ఉన్న ఈ సదుపాయాన్ని తాజాగా బుధవారం ప్రకటించింది. జనవరి 16వ తేదీ వరకు దశలవారీగా దీనిని దేశమంతా అందుబాటులోకి తీసుకు వస్తామని చెప్పింది. ఇప్పటికే ఈ ఫీచర్ కొందరికి అందుబాటులోకి వచ్చింది. వైఫై కాలింగ్ సేవలను ఉపయోగించి వాయిస్, వీడియో కాల్స్ చేసుకోవచ్చు.
ఇటీవల ఎయిర్ టెల్ వైఫై కాలింగ్ ఫీచర్ను ప్రకటించింది. అయితే ఇది కొన్ని మొబైల్ మోడళ్లకే పరిమితమైంది. జియో వైఫై కాలింగ్ మాత్రం దాదాపు 150కి పైగా మోడల్స్లలో పని చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ల ద్వారా వైఫై వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ చేసుకుంటే కేవలం డేటా మాత్రం ఖర్చవుతుంది. కొద్ది నెలలుగా వీటిని పరీక్షిస్తున్న జియో జనవరి 8న ప్రారంభించింది. రానున్న ఎనిమిది రోజుల్లో క్రమంగా అంతటా అందుబాటులోకి వస్తుంది.

కస్టమర్లు ఏ వైఫై నెట్వర్క్ను అయినా ఉపయోగించుకొని జియో వైఫై కాలింగ్ చేసుకోవచ్చు. VoLTE లేదా వైఫై ద్వారా వాయిస్, వీడియో కాల్స్కు ఈజీగా మారవచ్చు. స్మార్ట్ ఫోన్లో వైఫై కాలింగ్ సదుపాయం ఉంటే సర్వీస్ ఉచితం. అయితే మీ ఫోన్కు వైఫై సపోర్ట్ చేస్తుందా లేదా తెలుసుకోవాలి. దీనికి జియో వెబ్ సైట్లోకి వెళ్లి చూడవచ్చు. వైఫై కాలింగ్ ఉపయోగించేందుకు కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవాల్సి ఉంటుంది.
మొబైల్ నెట్ వర్క్ అందుబాటులో లేని సమయంలో ఫోన్ కాల్స్ చేసుకునేందుకు ఈ వైఫై కాలింగ్ సౌకర్యం ఎంతో ఉపయోగం. గ్రామీణ ప్రాంతాల్లో నెట్ వర్క్ అప్పుడప్పుడు లేకుండా పోతుంది. అలాంటి సందర్భాల్లో ఇది ప్రయోజనం. దగ్గరలోని ఏ వైఫై నెట్ వర్క్ అయినా ఉపయోగించుకొని కాల్ చేసుకోవచ్చు. దీని కోసం అదనంగా ఎలాంటి రుసుము ఉండదు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications