Jio SpaceFiber: అంబానీ తన ఆలోచనలతో అందరికీ అందనంత వేగంగా పనిచేస్తున్నారు. టెలికాం రంగంలో ఇప్పటికే 5జీ సేవలతో ప్రపంచ రికార్డు సృష్టించిన అంబానీలు తాజాగా మరో రికార్డుకు సిద్ధమయ్యారు. దీనిని భారత ప్రధాని మోదీ పరిశీలించారు.
అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సేవలకు ఇప్పటికే ఇండియాలో గుర్తింపు తెచ్చుకున్న రిలయన్స్ జియా నేడు తన జియో స్పేస్ ఫైబర్ సేవల నమూనాను ప్రజల ముందుకు తీసుకొచ్చారు. దీనికి ముందు కంపెనీ తన జియో ఎయిర్ ఫైబర్ సేవలను దేశంలో లాంచ్ చేసింది. తాజాగా తీసుకొస్తున్న Jio SpaceFiber శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించనుంది. దీని ద్వారా కంపెనీ దేశంలో మారుమూల ప్రాంతాల్లో సైతం జియో ట్రూ5జీ సేవలను అందించాలనే లక్ష్యంతో దీనిని ప్రవేశపెట్టింది.

ఈ క్రమంలోనే రిలయన్స్ జియో భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహ ఆధారిత గిగాబిట్ బ్రాడ్బ్యాండ్ సేవను ప్రదర్శించింది. ఇండియా మొబైల్ కాంగ్రెస్లో ఈ ప్రదర్శన జరిగింది. దేశంలో ప్రతి ఇంటికీ డిజిటల్ సేవలు అందుబాటులో ఉంచేలా చేసేందుకు జియో దీనిని వినియోగించనుంది. పైగా దీనిని పరీక్షించే క్రమంలో కంపెనీ గిర్ గుజరాత్, కోర్బా ఛత్తీస్గఢ్, నబ్రంగ్పూర్ ఒడిశా,ONGC-జోర్హాట్ అసోం ప్రాంతాల్లో సేవలను అందుబాటులో ఉంచింది. దీనికోసం జియో సరికొత్త మీడియం ఎర్త్ ఆర్బిట్(MEO) ఉపగ్రహ సాంకేతికతను SES సహకారంతో వాడుతోంది. ఈ సాంకేతికత జియోను అంతరిక్షం నుంచి గిగాబిట్, ఫైబర్ లాంటి సేవలను అందించడానికి అనుమతిస్తుంది.
ఈ సరికొత్త సేవలు దేశంలోని ప్రతి ఒక్కరిని విద్య, ఆరోగ్యం, వినోదం, ప్రభుత్వ సేవలను ఆన్ లైన్ ద్వారా పొందేందుకు వీలు కల్పిస్తుందని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ చైర్మన్ ఆకాష్ అంబానీ అన్నారు. గిగాబిట్ యాక్సెస్తో ప్రతి ఒక్కరూ, ప్రతిచోటా, కొత్త డిజిటల్ సొసైటీలో పూర్తిగా మారేందుకు వీలు కలుగుతుందని పేర్కొన్నారు. పైగా ఈ సాంకేతికత దేశంలోని లక్షల మంది గృహాలను, వ్యాపారులను మొదటిసారిగా బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ పొందేలా చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఇది దేశంలోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద డిజిటల్ పరివర్తనకు దారితీస్తుందని జియో ఆకాంక్షిస్తోంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications