ఏపీలోని 38 పట్టణాల్లో... జియో స్టోర్స్‌లో ఎలక్ట్రానిక్ వస్తువుల సేల్స్

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలోని జియో పాయింట్ స్టోర్స్ ఆంధ్రప్రదేశ్ వాసులకు గుడ్‌న్యూస్ చెప్పింది! రాష్ట్రంలోని రాష్ట్రంలో 38 నగరాలు, పట్టణాల్లోని తమ జియో పాయింట్ స్టోర్లలో ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల అమ్మకాలను ప్రారంభించింది. కొత్తగా రూపుదిద్దుకున్న ఈ జియో పాయింట్ స్టోర్స్‌లో మొబైల్, రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్లు, టీవీలు, ఇతర గృహోపకరణాలు సహా అన్ని ఎలక్ట్రానిక్ వస్తువుల విక్రయాలను చేపడుతోంది. ఈ మేరకు ఏపీ సీఈవో మహేష్ కుమార్ తెలిపారు.

ప్రారంభ ఆఫర్ కింద కస్టమర్లకు రూ.1100 విలువైన గిఫ్ట్స్, రూ.300 విలువైన గిఫ్ట్ వోచర్లు ఇస్తారు. ఈ ఆఫర్ సెప్టెంబర్ 10 వరకు అందుబాటులో ఉంటుంది.
ఇంటర్నెట్ సదుపాయం లేకుండా లేదా ఆన్‌లైన్లో ఎప్పుడు షాపింగ్ చేయని కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని జియో పాయింట్ స్టోర్స్ రూపొందించబడ్డాయి.

Jio Point Stores launch consumer electronics in Andhra Pradesh

పెద్ద నగరాలు మొదలు చిన్నస్థాయి పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల వరకు దేశవ్యాప్తంగా ఇప్పటికే ఈ జియో పాయింట్ స్టోర్స్ విస్తరించి ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ స్టోర్స్‌లలో కేవలం 4G మొబైల్స్, జియో సిమ్ అమ్మకాలు ఉండేవి. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల అమ్మకాలతో ఈ స్టోర్స్ కస్టమర్లకు మరింత చేరువవుతున్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+