For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏపీలోని 38 పట్టణాల్లో... జియో స్టోర్స్‌లో ఎలక్ట్రానిక్ వస్తువుల సేల్స్

|

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలోని జియో పాయింట్ స్టోర్స్ ఆంధ్రప్రదేశ్ వాసులకు గుడ్‌న్యూస్ చెప్పింది! రాష్ట్రంలోని రాష్ట్రంలో 38 నగరాలు, పట్టణాల్లోని తమ జియో పాయింట్ స్టోర్లలో ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల అమ్మకాలను ప్రారంభించింది. కొత్తగా రూపుదిద్దుకున్న ఈ జియో పాయింట్ స్టోర్స్‌లో మొబైల్, రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్లు, టీవీలు, ఇతర గృహోపకరణాలు సహా అన్ని ఎలక్ట్రానిక్ వస్తువుల విక్రయాలను చేపడుతోంది. ఈ మేరకు ఏపీ సీఈవో మహేష్ కుమార్ తెలిపారు.

అమెజాన్ స్టాక్స్ అదుర్స్, జెఫ్ బెజోస్ సరికొత్త రికార్డ్: బిల్‌గేట్స్ కంటే ఎంత ఎక్కువ అంటే?అమెజాన్ స్టాక్స్ అదుర్స్, జెఫ్ బెజోస్ సరికొత్త రికార్డ్: బిల్‌గేట్స్ కంటే ఎంత ఎక్కువ అంటే?

ప్రారంభ ఆఫర్ కింద కస్టమర్లకు రూ.1100 విలువైన గిఫ్ట్స్, రూ.300 విలువైన గిఫ్ట్ వోచర్లు ఇస్తారు. ఈ ఆఫర్ సెప్టెంబర్ 10 వరకు అందుబాటులో ఉంటుంది.
ఇంటర్నెట్ సదుపాయం లేకుండా లేదా ఆన్‌లైన్లో ఎప్పుడు షాపింగ్ చేయని కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని జియో పాయింట్ స్టోర్స్ రూపొందించబడ్డాయి.

Jio Point Stores launch consumer electronics in Andhra Pradesh

పెద్ద నగరాలు మొదలు చిన్నస్థాయి పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల వరకు దేశవ్యాప్తంగా ఇప్పటికే ఈ జియో పాయింట్ స్టోర్స్ విస్తరించి ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ స్టోర్స్‌లలో కేవలం 4G మొబైల్స్, జియో సిమ్ అమ్మకాలు ఉండేవి. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల అమ్మకాలతో ఈ స్టోర్స్ కస్టమర్లకు మరింత చేరువవుతున్నాయి.

English summary

ఏపీలోని 38 పట్టణాల్లో... జియో స్టోర్స్‌లో ఎలక్ట్రానిక్ వస్తువుల సేల్స్ | Jio Point Stores launch consumer electronics in Andhra Pradesh

Jio Point concept stores have introduced a range of consumer electronics and small home appliances across the network in 38 cities and towns in Andhra Pradesh.
Story first published: Saturday, August 29, 2020, 8:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X