జియో సినిమా(Jio Cinema) ఓటీటీ ప్లాట్ ఫారమ్ వినియోగదారులకు షాక్ ఇవ్వనుంది. ప్రస్తుతం ఫ్రీగా సర్వీస్ అందిస్తున్న జియో సినిమా త్వరలో ఛార్జీలు వసూల్ చేయనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను జియో సినిమా కోట్లు పెట్టి దక్కించుకుంది. ప్రస్తుతం జియో సినిమాలో ఐపీఎల్ మ్యాచ్ లో ఫ్రీగా అందిస్తోంది. దీంతో జియో సినిమా ఓటీటీ సబ్ స్క్రిప్షన్ భారీగా పెరిగిపోయింది. వ్యూస్ కూడా భారీగా వస్తున్నాయి. అయితే ఐపీఎల్ ముగిసే నాటికి జియో సినిమా ఓటీటీకి డబ్బులు వసూల్ చేసే అవకాశం ఉంది.
అంతేకాకుండా జియో సినిమా ప్లాట్ఫారమ్లో 100 కంటే ఎక్కువ సినిమాలు, టీవీ సీరియల్లను జోడించాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. తద్వారా వాల్ట్ డిస్నీ, నెట్ఫ్లిక్స్ వంటి దిగ్గజాలకు పోటీ ఇవ్వాలని జియో ప్లాన్ చేస్తోంది. రిలయన్స్ మీడియా, కంటెంట్ బిజినెస్ ప్రెసిడెంట్ జ్యోతి దేశ్పాండే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా విస్తరణ తర్వాత జియో ఛార్జింగ్ ప్రారంభిస్తుందని బ్లూమ్బెర్గ్ నివేదిక పేర్కొంది. ధరకు సంబంధించి ఇంకా వ్యూహం ఖరారు కానప్పటికీ, త్వరలోనే ఖరారు కానుంది.

వచ్చే నెలలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ ముగిసేలోపు కొత్త టైటిల్స్ ప్రవేశపెడతామని , అప్పటి వరకు వీక్షకులు మ్యాచ్లను ఉచితంగా వీక్షించవచ్చని చెప్పారు . IPL తర్వాత జియో సినిమాలో సబ్స్క్రిప్షన్ ఛార్జీని ప్రవేశపెట్టవచ్చు. అటువంటి పరిస్థితిలో, మీరు సినిమా లేదా టీవీ సీరియల్ చూడటానికి రుసుము చెల్లించవలసి ఉంటుంది. ఎంత రుసుము వసూలు చేస్తారనేది జియో సినిమా త్వరలో తెలియజేస్తోంది.ముఖేష్ అంబానీ గ్లోబల్ మీడియా, ఆన్లైన్ స్ట్రీమింగ్ దిగ్గజంగా మారడానికి ఈ వేదికను సిద్ధం చేస్తున్నారు.
దీన్ని దృష్టిలో ఉంచుకుని గతేడాది ఐపీఎల్ డిజిటల్ హక్కులను వయాకామ్ 18 మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు చేసింది. దీని తర్వాత అంబానీ దీన్ని ఉచితంగా చూపించడానికి ఆఫర్ చేశాడు. పెరుగుతున్న ఇంటర్నెట్ వ్యాప్తితో భారతదేశంలో ఆన్ లైన్ ప్రేక్షకులు భారీగా ఉన్నారు. JioCinema ఏప్రిల్లో IPL ప్రారంభంలో 1.47 బిలియన్లకు పైగా వీడియో వీక్షణలను సంపాదించింది. బుధవారం జరిగిన ఒక మ్యాచ్కు 22 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.


Click it and Unblock the Notifications