అయిదేళ్ల తర్వాత మళ్లీ ప్రారంభమైన స్పెక్ట్రం వేలం ముగిసింది. నిన్న (సోమవారం, మార్చి 1) ప్రారంభమైన స్పెక్ట్రం వేలం నేడు (మంగళవారం, 2వ తేదీ) ముగిసింది. మొత్తం రూ.77,814.80 కోట్ల విలువైన బిడ్స్ దాఖలయ్యాయి. అత్యధికంగా రిలయన్స్ జియో రూ.57,122 కోట్ల బిడ్ దాఖలు చేయగా, ఎయిర్టెల్ రూ.18,669 కోట్ల బిడ్స్, వొడాఫోన్ ఐడియా రూ.1,993 కోట్ల బిడ్స్ దాఖలు చేశాయి. రూ.3.92 లక్షల కోట్ల విలువైన 2250 MHz స్పెక్ట్రంను ఏడు బాండ్స్లో అందుబాటులో ఉంచింది. ఇందులో అత్యధికంగా రిలయన్స్ జియో దక్కించుకుంది.
రూ.18,669 కోట్ల విలువైన స్పెక్ట్రంను దక్కించుకున్నట్లు భారతీ ఎయిర్టెల్.. సబ్ గిగా హెర్జ్ట్ కేటగిరీలో 355.45 MHz మిడ్ బ్యాండ్, 2300 MHz బ్యాండ్ స్పెక్ట్రంను సొంతం చేసుకుంది. భవిష్యత్తులో 5G సేవలను అందించేందుకు ఇది దోహదపడుతుందని తెలిపింది. సబ్ గిగా హెర్ట్జ్ స్పెక్ట్రంతో దేశవ్యాప్తంగా తమ సేవలను విస్తరించేందుకు వీలు కలిగిందని తెలిపింది. కొత్తగా తొమ్మిది కోట్లమంది కస్టమర్లను చేర్చుకోనున్నట్లు వెల్లడించింది.

ఇదిలా ఉండగా, ధరలు అధికంగా ఉండడం వల్లే 700 MHz బ్యాండ్కు ఎవరూ బిడ్స్ దాఖలు చేయలేదు. ఈ వేలంలో 5G సేవల కోసం గుర్తించిన 3300-3600 MHz బాండ్స్ను కలపలేదు. విజయవంతమైన బిడ్డర్లు ఒకేసారి బిడ్ మొత్తాన్ని చెల్లించవచ్చు. లేదంటే తొలుత నిర్దిష్ట మొత్తాన్ని చెల్లించి మిగతా డబ్బును రెండేళ్ల మారటోరియం అనంతరం గరిష్ఠంగా 16 వాయిదాల్లో చెల్లించవచ్చు. ఈ స్పెక్ట్రంను 20 ఏళ్ల పాటు టెలికాం నెట్వర్క్ సంస్థలు వినియోగించుకోవచ్చు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications