Costliest Mango: ఎక్కడైనా మామిడి పండు రుచి చూడాలంటే మహా అయితే వంద రూపాయలు ఖర్చు అవుతుంది. అయితే ప్రపంచంలోనే ఖరీదైన మామిడి పండు తినాలంటే వేలల్లో వెచ్చించక తప్పదని వెల్లడైంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ప్రపంచంలోనే ఖరీదైన మియాజాకి మామిడి పళ్ల గురించే. ప్రస్తుతం ఈ రకం మామిడి ప్రపంచ వ్యాప్తంగా విలాసవంతమైన, అత్యంత ఖరీదైన రకాల్లో ఒకటిగా ఉంది. అయితే తాజాగా ఈ రకం మామిడి పళ్లను కేజీ రూ.1.9 లక్షలకు విక్రయించటం మామిడి పళ్ల ప్రియులను షాక్ కి గురిచేస్తోంది. అయితే అసలు వెండి కంటే ఈ మామిడి పండు ఎందుకు ఇంత కాస్ట్లీ, దీని ప్రత్యేకతలు ఏమిటనే అంశం పెద్ద చర్చకు దారితీసింది.

వాస్తవానికి జపాన్లోని మియాజాకి నగరం నుంచి ఈ మామిడి రకం ప్రధానంగా ఏప్రిల్-ఆగస్టు పంట కాలంలో పండిస్తారు. మియాజాకి మామిడి పండినప్పుడు మంత్రముగ్దులను చేసే పరివర్తనకు లోనవుతుంది. ఊదారంగులో ప్రారంభమై పూర్తిగా పక్వానికి వచ్చే సమయానికి ఎరుపు రంగులోకి మారుతుంది. సగటున ఒక్కో మియాజాకి మామిడి పండు దాదాపు 350 గ్రాముల బరువు ఉంటుంది. కొన్ని అనుకూల వాతావరణ పరిస్థితుల్లో ఏకంగా 900 గ్రాముల వరకు పండు బరువు పెరుగుతుంది.
ప్రస్తుతం ఈ సాధారణ పండు జపాన్ దాటి ప్రపంచ వ్యాప్తంగా భారత్, బంగ్లాదేశ్, థాయిలాండ్, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో సాగుకు విస్తరించింది. అంతర్జాతీయ మార్కెట్లో మియాజాకి మామిడి పండ్లకు అధిక విలువ ఉండటంతో కిలోకు ధర రూ.2.5 లక్షల వరకు పలుకుతోంది. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండుగా గుర్తింపు పొందిన మియాజాకిని పండించడానికి నిర్దిష్ట పరిస్థితులు చాలా కీలకం. వెచ్చని వాతావరణం, సమృద్ధిగా వర్షపాతం, దీర్ఘకాలం సూర్యకాంతి ఈ పండు అభివృద్ధి చెందడానికి, దాని సున్నితమైన రుచులను అభివృద్ధి చేయడానికి అవసరం.
ప్రపంచవ్యాప్తంగా ఆరు ఇతర రుచికరమైన మామిడి రకాలు ఉన్నాయి:
- అల్ఫోన్సో మామిడి
- చౌసా మామిడి
- కారబో మామిడి
- డైమండ్ మామిడి
- అటాల్ఫో మామిడి
- టామీ అట్కిన్స్ మామిడి


Click it and Unblock the Notifications