చైనా కుబేరుడు, అలీబాబా అధినేత జాక్ మా రెండు నెలలుగా బయటకు కనిపించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.అతని నేతృత్వంలోని అలీబాబాకు వరుస షాక్లు తగులుతున్నాయి. జాక్ మాతో పాటు అతని ఫైనాన్షియల్ సామ్రాజ్యాన్ని కొద్ది రోజులుగా చైనీస్ ప్రభుత్వం టార్గెట్ చేస్తోంది. అలీబాబా గుత్తాధిపత్య నిబంధనల కింద దర్యాఫ్తుకు ఆదేశించాయి.
గత ఏడాది యాంట్ గ్రూప్, అనుబంధ సంస్థలపై దర్యాఫ్తు ప్రారంభించాయి. వివిధ కారణాలు చూపించి యాంట్ గ్రూప్ అతిపెద్ద ఐపీవోకు షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో జాక్ మా కనిపించకపోవడం చర్చకు దారి తీసింది. అయితే ఇప్పుడు ఆయన వీడియో సందేశం ద్వారా ప్రజలకు కనిపించారు.

నేడు బుధవారం గ్రామీణ పాఠశాల ఉపాధ్యాయులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జాక్ మా పాల్గొన్నట్లు చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ తెలిపింది. దీనికి సంబంధించి వీడియోను గ్లోబల్ టైమ్స్ రిపోర్టర్ తన ట్విట్టర్లో షేర్ చేశారు. 2015 నుంచి జాక్ మా ఫౌండేషన్ ద్వారా గ్రామీణ విద్య, ప్రజా సంక్షేమం వంటి అంశాలపై ఆయన దృష్టి సారించారు. ఇందులో భాగంగా ప్రతీ సంవత్సరం గ్రామీణ ఉపాధ్యాయులకు జాక్ మా ఫౌండేషన్ అవార్డులు ప్రధానం చేస్తోంది. కరోనా కారణంగా ఇప్పుడు ఆన్ లైన్ ద్వారా నిర్వహించారు.
ఇందుకు సంబంధించిన కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాక్ మా పాల్గొన్నారు. గత ఏడాది అక్టోబర్ నెలలో చైనా ప్రభుత్వ ఆర్థిక విధానాలపై, బ్యాంకు రెగ్యులేటరీపై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో అతనిని డ్రాగన్ దేశ ప్రభుత్వం టార్గెట్ చేసిందనే వాదనలు ఉన్నాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications