ట్రంప్ సుంకాలతో మార్కెట్లు షేక్.. ఐటీ షేర్స్ 9% ఢమాల్.. సెన్సెక్స్ 500 పాయింట్లు ఫట్..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై 26 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించాక ఈ ప్రభావం నేడు భారత మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తుంది. ఉదయం 9:17 గంటలకు సెన్సెక్స్ 564 పాయింట్లు అంటే 0.74% తగ్గి 76,053 వద్ద ట్రేడవగా, నిఫ్టీ 138 పాయింట్లు అంటే 0.59% తగ్గి 23,193 వద్ద ఉంది. ఉదయం ట్రేడింగ్‌లో డాలర్‌తో పోలిస్తే రూపాయి కూడా 26 పైసలు బలహీనపడింది. ఈ సుంకాల నుండి మందుల కంపెనీలు మినహాయింపు పొందగా, మందుల కంపెనీల షేర్లు మాత్రం పెరుగుతున్నాయి. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ దాదాపు 5 శాతం పెరిగింది. గ్లాన్ ఫార్మా షేర్లు 15% పెరగగా, లుపిన్ షేర్లు 6% లాభంతో ట్రేడవుతున్నాయి. గ్లాన్ ఫార్మా ఆదాయంలో 50% అమెరికా నుండే వస్తుంది.

IT stocks fall up to 9 on Trump s tariff decision Sensex fell more than 500 points in early trade

ఇవాళ గురువారం టెక్ మహీంద్రా, టిసిఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) హెవీవెయిట్‌ల షేర్లు భారీగా అమ్ముడయ్యాయి. భారీ సుంకాలు ప్రపంచ ఆర్థిక వృద్ధికి తీవ్రంగా ఆటంకం కలిగిస్తాయనే ఆందోళనల మధ్య నాస్డాక్-100, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ అండ్ ఎస్&పి 500 వంటి యుఎస్ ఫ్యూచర్స్ 4.5% వరకు పడిపోయిన తరువాత సెంటిమెంట్ మరింత దెబ్బతింది. కార్పొరేట్ లాభాలను దెబ్బతీస్తుందనే ఆందోళనల మధ్య ద్రవ్యోల్బణం పెరుగుతుందని, ప్రస్తుత వాణిజ్య సంఘర్షణను తీవ్రతరం చేస్తుందనే భయాలతో ఈ పరిస్థితి నెలకొంది.

ఉదయం 11:25 గంటలకు, బిఎస్ఇ సెన్సెక్స్, ఎన్ఎస్ఇ నిఫ్టీ 0.35% క్షీణించాయి, దీనికి కారణం ఐటి రంగంలో అమ్మకాలు, బిఎస్ఇ ఐటి ఇండెక్స్ 3.6% వరకు పడిపోగా, బ్లూచిప్ ఐటి స్టాక్స్ టిసిఎస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్ టెక్ 3-4% మధ్య పడిపోయాయి. దేశంలో అత్యంత విలువైన ఐటీ స్టాక్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 3.6% వరకు క్షీణించగా, రెండవ అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సంస్థ ఇన్ఫోసిస్ ఇప్పటివరకు ట్రేడింగ్ ప్రారంభమైన మొదటి రెండు గంటల్లో 3.3% వరకు పడిపోయింది. ఇక టెక్ మహీంద్రా, హెచ్‌సిఎల్ టెక్, విప్రో, ఎల్‌టిఐమైండ్‌ట్రీ షేర్లు 3% వరకు తగ్గాయి.

మరోవైపు సెన్సెక్స్ స్టాక్స్‌లో టెక్ మహీంద్రా, భారతి ఎయిర్‌టెల్ అత్యధికంగా నష్టపోయాయి. ఈ కంపెనీల షేర్లు 2.5 శాతం తగ్గగా, మహీంద్రా & మహీంద్రా, అదానీ పోర్ట్స్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, మారుతి, టాటా మోటార్స్ షేర్లు కూడా క్షీణతతో మొదలయ్యాయి. సెక్టార్ల వారీగా చూస్తే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 2.5% పడిపోయింది. పెర్సిస్టెంట్ సిస్టమ్స్, కోఫోర్జ్, ఎంఫసిస్ షేర్లు తగ్గడం ఇందుకు కారణం. అమెరికాలో మాంద్యం ముప్పు పెరిగేకొద్దీ ఐటీ కంపెనీలు ఎక్కువగా నష్టపోతాయని బెర్న్‌స్టెయిన్ అభిప్రాయపడ్డారు.

విదేశీ మార్కెట్ల పరిస్థితి చూస్తే : అమెరికాకి సన్నిహిత మిత్రదేశమైన జపాన్‌పై 24 శాతం సుంకం విధించింది. దీని ప్రభావం జపాన్ స్టాక్ మార్కెట్లలో పెద్దగా కనిపిస్తోంది. నిక్కీ 4 శాతానికి పైగా పడిపోయి 8 నెలల కనిష్ట స్థాయికి చేరుకుంది. బ్యాంకుల పరిస్థితి కూడా అత్యంత దారుణంగా ఉంది. బ్యాంక్ ఇండెక్స్ 6.4% పడిపోయింది. అంతేకాకుండా, కార్ కంపెనీల షేర్లు కూడా క్షీణించాయి. ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ టయోటా మోటార్ షేర్లు 4.7 శాతం పడిపోయాయి. అదేవిధంగా, చిప్ తయారీ కంపెనీల షేర్లు కూడా పడిపోయాయి. టోక్యో ఎలక్ట్రాన్ 5.8%, అడ్వాంటెస్ట్ 4.9% పడిపోయాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+