For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆర్థికమాంద్యంలోకి ప్రపంచం, జాగ్రత్త పడుతున్న ఇండియన్ ఐటీ కంపెనీలు!

|

కరోనా మహమ్మారి నేపథ్యంలో 2020లో ఐటీ కంపెనీలు చేసే వ్యయాలు 8.1 శాతం తగ్గి 83.5 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.6.26 లక్షల కోట్లు) పరిమితం అయ్యే అవకాశం ఉందని రీసెర్చ్ ఫర్మ్ గార్ట్‌నర్ నివేదిక తెలిపింది. గత అయిదేళ్లలో ఐటీ కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడం ఇదే మొదటిసారి అని ఈ నివేదిక తెలిపింది. గతంలో పలుమార్లు ఐటీ కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ వ్యయాలు ఈసారి వ్యయాలు తగ్గించుకోవడం గమనార్హం. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచి, ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిన విషయం తెలిసిందే.

Moratorium: ఈఎంఐ వడ్డీ మాఫీకి ఆర్బీఐ నో, నిలదీసిన సుప్రీం కోర్టుMoratorium: ఈఎంఐ వడ్డీ మాఫీకి ఆర్బీఐ నో, నిలదీసిన సుప్రీం కోర్టు

మారిన ఐటీ బడ్జెట్ ప్రాధాన్యతలు

మారిన ఐటీ బడ్జెట్ ప్రాధాన్యతలు

2019 నవంబర్‌లో గార్డ్‌నర్ వెల్లడించిన అంచనా ప్రకారం 2020లో ఐటీ వ్యయాలు 6.6 శాతం వృద్ధితో 94 బిలియన్ డాలర్లకు చేరుతాయని పేర్కొంది. ఇండియాలోని ఆయా సంస్థల సీఎఫ్ఓలు, సీఐవోలు ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఐటీ బడ్జెట్ ప్రాధాన్యతల్ని కంపెనీలు మార్చుకుంటున్నాయని తెలిసిందని గార్ట్‌నర్ పేర్కొంది. ప్రపంచ ఆర్థిక మాంద్యాన్ని దృష్టిలో ఉంచుకొని వారు తమ బడ్జెట్ వ్యాయల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు గార్ట్‌నగర్ రీసెర్చ్ డైరెక్టర్ నవీన్ మిశ్రా తెలిపారు.

పెరగనున్న క్లౌడ్ సేవలు

పెరగనున్న క్లౌడ్ సేవలు

కరోనా వైరస్ నేపథ్యంలో సామాజిక దూరం వంటి ప్రభుత్వ మార్గదర్శకాలకు కట్టుబడుబడుతూ సంస్థలు ముందుకు నడవాలంటే మరింత ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపింది. రిమోట్ వర్కింగ్, శ్రామిక శక్తి సహకారం వంటి వివిధ అంశాలను కంపెనీలు ఎంచుకున్నాయని పేర్కొంది. ఇది పనితీరును మార్చివేయడంతో పాటు వ్యయాలు పెంచుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో భద్రత వంటి టెక్నాలజీ పరిజ్ఞానం వైపు ఖర్చులు పెరుగుతాయి. సంస్థలు డెస్క్ టాప్, మౌలిక సేవలు, వర్చువల్ ప్రయివేటు నెట్ వర్క్, భద్రత వంటి సాంకేతిక అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టడంతో దేశంలో క్లౌడ్ సేవలు పెరుగుతాయని వెల్లడించింది.

కొనుగోళ్లు ఆలస్యం

కొనుగోళ్లు ఆలస్యం

దేశంలో డివైస్‌లు, డేటా సెంటర్ సిస్టం వ్యవస్థలపై వ్యయాలు 2020లో వరుసగా మైనస్ 15.1 శాతం, మైనస్ 13.2 శాతంగా ఉన్నాయని తెలిపింది. సీఐవోలు (చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్) ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగనున్నారని, దీంతో కొత్త కొనుగోళ్లు ఆలస్యం కానున్నట్లు తెలిపింది. ఈ ఏడాది ఖర్చులు అన్ని విభాగాలలో పెరగనుందని పేర్కొంది. టెలిహెల్త్, స్మార్ట్ చాట్‌బోట్, మొబైల్ అప్లికేషన్స్, డిస్టెన్స్ లర్నింగ్ ఎడ్యుకేషన్ సాఫ్టువేర్ వంటి ఖర్చులు పెరుగుతాయని పేర్కొంది. దీంతో ఎంటర్‌ప్రైజ్ సాఫ్టువేర్‌పై ఖర్చు (మైనస్ 2.6) తగ్గుతుందని తెలిపింది.

ఆర్థిక మాంద్యం.. ఐటీ వ్యయాలపై జాగ్రత్త

ఆర్థిక మాంద్యం.. ఐటీ వ్యయాలపై జాగ్రత్త

డేటా కేంద్రాల వ్యవస్థలపై 13.2 శాతం వ్యయం క్షీణించి 318.6 కోట్ల డాలర్లకు, పరికరాల వ్యయాలు 15.1 శాతం క్షీణించి 3,107 కోట్ల డాలర్లకు పరిమితం అవుతుందని తెలిపింది. కరోనా వల్ల అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం తలెత్తే అవకాశముందని సీఐవోలు అభిప్రాయపడ్డారు. దీంతో ఐటీ వ్యయాలపై చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు మిశ్రా తెలిపారు.

English summary

ఆర్థికమాంద్యంలోకి ప్రపంచం, జాగ్రత్త పడుతున్న ఇండియన్ ఐటీ కంపెనీలు! | IT spending in India to fall 8 percent in 2020, says Gartner

IT spending in India will total $83.5 billion in 2020, a decline of 8.1%, showed latest forecast by research firm, Gartner. Though companies globally have often witnessed a fall, this is the first time in the past five years that the country's IT spending will drop.
Story first published: Friday, June 5, 2020, 7:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X