Telangana: తెలంగాణలో విన్‌ఫాస్ట్‌ కంపెనీ పెట్టుబడులు..

తెలంగాణలో పెట్టుబడులు తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. అనేక సంస్థలతో చర్చలు జరుపుతోంది. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దావోస్ పర్యటన సందర్భంగా పలు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా చాలా కంపెనీలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. తాజాగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టేందుకు వియత్నాంకు చెందిన ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ ఆసక్తి చూపుతోంది.

బుధవారం తెలంగాణ సెక్రటేరియట్ లో విన్‌ఫాస్ట్‌ కంపెనీ భారత సీఈవో ఫామ్‌ సాన్హ చౌ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో సమావేశం అయింది. హైదరాబాద్ లో పెట్టుబడులపై వారు చర్చించారు. ప్రభుత్వ రంగంలో మౌలిక సదుపాయాల కల్పన, అర్బన్‌ మొబిలిటీలో సొల్యూషన్స్, భవిష్యత్‌లో నగరాల అభివృద్ధి పై మంత్రి వారితో మాట్లాడినట్లు తెలిసింది.

It seems that vinfast Company is ready to invest in Hyderabad

ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరల్లో హైదరాబాద్‌ ఒకటి అని శ్రీధర్ బాబు అన్నారు. వచ్చే 15 ఏళ్లలో తెలంగాణ జనాభాలో సగం జనాభాకు హైదరాబాద్ నిలయంగా మారుతుందని అన్నారు. హైదరాబాద్ లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విశ్వసనీయమైన భాగస్వాముల కోసం చూస్తున్నట్లు చెప్పారు.

తాము హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు విన్‌ఫాస్ట్‌ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. విన్‌ఫాస్ట్‌ ఇటీవలే తమిళనాడులో ఎలక్ట్రిక్‌ వాహనాల ఉత్పత్తి సంస్థను రూ.4 వేల కోట్ల పెట్టుబడులతో ప్రారంభించిన సంగతి తెలిసిందే. తదుపరి విస్తరణలో భాగంగా తెలంగాణపై సంస్థ దృష్టి సారించింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+