కేంద్ర ప్రభుత్వం నవంబర్ 21, 2025న విడుదల చేసిన కొత్త Labour Code భారత కార్మిక వ్యవస్థలో పెద్ద మార్పులకు నాంది పలికింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఐటీ ఆధారిత సేవల రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ.. ప్రతి నెల 7వ తేదీలోపు ఉద్యోగులకు జీతాలు చెల్లించడం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నూతన నిబంధనలను అమలులోకి తెచ్చింది. వేతనాల ఆలస్యం కారణంగా తరచూ ఎదురయ్యే అసౌకర్యాలను నివారించేందుకు రూపొందించిన ఈ కోడ్, ముఖ్యంగా పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలను అందించే ఐటీ రంగానికి మరింత క్రమబద్ధతను తీసుకొచ్చే దిశగా సాగింది.
ప్రధాని నరేంద్ర మోడీ ఈ సంస్కరణలను స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అమలు చేసిన అత్యంత సమగ్రమైన, ప్రగతిశీలమైన కార్మిక సంస్కరణలుగా పేర్కొన్నారు. నాలుగు ప్రధాన కార్మిక కోడ్లను అమలు చేయడం ద్వారా ప్రభుత్వ సమ్మతి ప్రక్రియలను సులభతరం చేసి, వ్యాపారాలకు అనుకూల వాతావరణాన్ని కల్పించడం ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.

ప్రస్తుతం అమలులో ఉన్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను హేతుబద్ధీకరించి, వాటి స్థానంలో వేతన కోడ్ 2019, పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020, సామాజిక భద్రత కోడ్ 2020, వృత్తి భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్ 2020లను ప్రవేశపెట్టడం ద్వారా ఉద్యోగుల హక్కులను బలోపేతం చేసే జాతీయ స్థాయి వ్యవస్థను ప్రభుత్వం రూపొందించింది. ఇవి 2025 నవంబర్ 21 నుండి అమల్లోకి రానున్నాయి.
ఈ కోడ్లో మరో ముఖ్యమైన అంశం మహిళలకు రాత్రి షిఫ్టుల్లో పని చేయడానికి సంస్థలు అనుమతి ఇవ్వాలి అన్న నిబంధన. భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేస్తూ మహిళలకు రాత్రి పూట పనిచేసే అవకాశం కల్పించడం ద్వారా అధిక వేతనాలున్న ఉద్యోగాలకు వారు అడుగుపెట్టే మార్గం సుగమమవుతుంది. దీనితో పాటు సమాన పనికి సమాన వేతనం తప్పనిసరి చేయడం ద్వారా ఉద్యోగాల్లో లింగ వివక్షతకు చెక్ పెట్టే ప్రయత్నం కూడా ఈ కోడ్లో భాగమైంది. ఇది మహిళల శ్రామిక భాగస్వామ్యాన్ని పెంచే దిశగా ఒక సానుకూల ఆలోచనగా పరిగణించబడుతోంది.
కార్మిక కోడ్లో వేతన వివాదాలు, పని ప్రదేశంలో వేధింపులు, వివక్షత వంటి సమస్యలను సకాలంలో పరిష్కరించాలన్న నిబంధనలు ఉద్యోగుల రక్షణను మరింత బలోపేతం చేస్తాయి. సమయానుకూల న్యాయం, శీఘ్ర పరిష్కారం ఉద్యోగులకు నమ్మకాన్ని, సంస్థలకు బాధ్యతను కల్పించేలా ఉంటాయి. అలాగే స్థిర-కాలిక ఉపాధిలో ఉన్న ఉద్యోగులకు కూడా సామాజిక భద్రతా ప్రయోజనాలు అందేలా కోడ్ నిబంధనలు రూపొందించబడటం గిగ్ ఎకానమీ, కాంట్రాక్ట్ ఆధారిత ఉద్యోగాలలో పనిచేసే వారికి కూడా రక్షణ కల్పించే నిర్ణయంగా భావించాలి. ఇందువల్ల PF, ESI, గ్రాచ్యుటీ వంటి ప్రయోజనాలు మరింత విస్తృతంగా అందుబాటులోకి వస్తాయి.
కార్మిక వ్యవస్థను ప్రపంచ ప్రమాణాలకు దగ్గర చేసే విధంగా భారతదేశం చేస్తున్న కృషికి ఈ సంస్కరణలు కీలక మైలురాయిగా ప్రభుత్వం పేర్కొంది. PIB విడుదల చేసిన ప్రకటనలో, ఈ నూతన కోడ్లు శ్రామిక వర్గానికి మెరుగైన వేతనాలు, సామాజిక భద్రత, సురక్షితమైన పని వాతావరణం అందించడమే కాకుండా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను నెరవేర్చేలా బలమైన పరిశ్రమల నిర్మాణానికి దోహదం చేస్తాయని వెల్లడించింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications