IT News: ఈ టెక్ కంపెనీ ఉద్యోగులకు శుభవార్త.. దీపావళికి ముందు మంచి సమయం..!!

Wipro Salary Hike: గడచిన రెండు ఏళ్లుగా భారతీయ ఐటీ రంగం భారీ ఒడిదొడుకులను చూసింది. ఈ క్రమంలో ప్రాజెక్టులు తగ్గిపోవటంతో పాటు, భారీ డీల్స్ తగ్గిపోయాయి. ఇది పరోక్షంగా ఉపాధి అవకాశాలను దెబ్బతీసింది. అయితే అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండటంతో తిరిగి సాధారణ పరిస్థితులు దగ్గరపడుతున్నాయి.

ఈ క్రమంలో భారతీయ టెక్ కంపెనీలు తమ రిక్రూట్మెంట్ సీజన్ ప్రారంభించాయి. తాజాగా దేశంలోని నాల్గవ అతిపెద్ద ఐటీ కంపెనీ విప్రో తన ఉద్యోగులకు పెద్ద శుభవార్తను సిద్ధం చేస్తోంది. అత్యుత్తమ పనితీరు కలిగిన టెక్కీలకు 8 శాతం వేతన పెంపును అందించనున్నట్లు సమాచారం. గడచిన ఏడాది కంపెనీ సగటున 6% శాలరీ హైక్ అందించింది. కానీ ప్రస్తుతం ఐటీ రంగంలోని పరిస్థితులు మెరుగుపడుతున్న వేళ పెంపులు అధికంగా ఉండనున్నాయని తెలుస్తోంది. పెంపులకు సంబంధించిన అంతర్గత పనితీరును పరిశీలిస్తే.. విప్రో 2,00,000 మంది ఆఫ్‌షోర్ ఉద్యోగులు, వీరిలో మూడింట మూడొంతుల మంది క్లయింట్ లొకేషన్‌లకు దూరంగా పనిచేస్తుండగా.. వారు దాదాపు 8 శాతం పెంపును పొందవచ్చని తెలుస్తోంది.

IT Major Wipro planning to give high Salary increments this September cycle

అయితే క్లయింట్ లొకేషన్ నుంచి పనిచేసే టెక్కీలకు దాదాపు 3 శాతం వేతన పెంపు ఉండనున్నట్లు సమాచారం. విప్రో చీఫ్ హెచ్‌ఆర్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ ఆగస్టు 29న ఉద్యోగులకు పంపిన అంతర్గత మెయిల్ ప్రకారం వేతన పెంపు సైకిల్ సెప్టెంబర్ 1, 2024 నుంచి అమలులోకి వస్తాయని వెల్లడించారు. సాధారణంగా కంపెనీ సెప్టెంబరు-అక్టోబర్‌లో ఇంక్రిమెంట్‌లను అందిస్తుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు, ప్రక్రియలను అన్ని టీమ్ మేనేజర్లకు అందిస్తారని గోవిల్ వెల్లడించారు. ఉద్యోగులకు కొత్తగా సవరించిన పరిహారం అక్టోబర్ పేరోల్‌తో పాటు సెప్టెంబర్ బకాయిలు కూడా అందుకోనున్నారు. టీసీఎస్ తర్వాత విప్రో వేతన పెంపులను ప్రకటించిన కంపెనీగా నిలిచింది.

టీసీఎస్ టాప్ పెర్ఫార్మర్‌లకు రెండంకెల వేతన పెంపుదలని అందించింది. మిగిలిన వారికి సగటున 4.5-7% వరకు అందించింది. అయితే నోయిడాకు చెందిన హెచ్‌సీఎల్ టెక్, బెంగళూరుకు చెందిన ఇన్ఫోసిస్ లిమిటెడ్‌తో అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. మునుపటి సంవత్సరంతో పోలిస్తే మార్చి 2024తో ముగిసిన సంవత్సరంలో హోల్-టైమ్ డైరెక్టర్లు మినహా ఉద్యోగులకు విప్రో సగటు జీతం 9.43% పెరిగింది.

ఉద్యోగులకు కొత్త కష్టాలు..
దేశీయ టాప్ టెక్ దిగ్గజాల్లో ఒకటిగా కొనసాగుతున్న విప్రో తన ఉద్యోగులను ఆఫీసులకు రప్పించేందుకు రంగంలోకి దిగింది. ఈ క్రమంలో టెక్కీలు ఆఫీసు నుంచి పనిచేయటాన్ని సెలవులకు లింక్ చేసింది. నివేదిక ప్రకారం బెంగళూరుకు చెందిన టెక్ మేజర్ తన సిబ్బందికి వారంలో కనీసం మూడు రోజులు కార్యాలయానికి హాజరు కావాలని లేదా హాజరుకాని రోజులకు లీవ్స్ కోల్పోయే ప్రమాదం ఉందని ఉద్యోగులకు మెయిల్ ద్వారా వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇంటి నుండి పని చేసేందుకు ఉద్యోగుల అభ్యర్థనలను అనుమతించవద్దని మేనేజ్‌మెంట్ HR బృందానికి సెప్టెంబర్ మెుటది వారంలోనే ఆదేశాలు జారీచేసినట్లు వార్తా నివేదికలు వెల్లడించాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+