Infosys News: భారత ఐటీ దిగ్గజాల్లో ఒకటిగా ఉన్న ఇన్ఫోసిస్ భవిష్యత్ జాబ్ మార్కెట్ అవసరాలకు కావాల్సిన స్కిల్స్ అందించే పనిలో ఉంది. టెక్నాలజీ వినియోగంలో మార్పులను అందిపుచ్చుకోవాలనుకునే వారికి ఉచిత శిక్షణను అందిస్తోంది.
తమను తాము అప్ స్కిల్లింగ్ చేసుకోవాలనుకునే వారికి ఇన్ఫిస్స్ స్ప్రింగ్బోర్డ్ ద్వారా ఉచితంగా ఏఐ కోర్సుల్లో శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనికింద వివిధ రకాల AI కోర్సులను అందిస్తోంది. డీప్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్, జనరేటివ్ ఏఐ ఉన్నాయి. అలాగే పైథాన్, డేటా సైన్స్ , డేటా ఎనాలసిస్, ప్రాబబిలిటీ లాంటి మరిన్ని కోర్సులను అందుబాటులో ఉంచింది.

ఇన్ఫోసిస్ స్ప్రింగ్బోర్డ్ అనేది ఏ పరికరంలోనైనా యాక్సెస్ చేయగల డిజిటల్ లెర్నింగ్ ఫ్లాట్ ఫారమ్. దీనిని ఆరవ తరగతి నుంచి ఏ వయస్సు వారైనా ఉపయోగించుకోవచ్చు. ఇప్పటి వరకు 55 లక్షలకు పైగా వినియోగదారులను ఇది కలిగి ఉంది. ఇన్ఫోసిస్ స్ప్రింగ్బోర్డ్ ప్రపంచ విద్య, కెరీర్ అభివృద్ధిపై ప్రభావం చూపాలని లక్ష్యంగా పెట్టుకుంది. సమీప భవిష్యత్తులో జనరేటివ్ AI మరిన్ని అవకాశాలను సృష్టిస్తుందని సీఈవో సలీల్ పరేఖ్ తెలిపారు.
2015లో ఏఐ పాపులర్ కానప్పుడే ఇన్ఫోసిస్.. ఎలాన్ మస్క్, అమెజాన్ లతో కలిసి OpenAIకి 1 బిలియన్ డాలర్లను విరాళం అందించింది. ప్రస్తుతం చాట్ జీపీటీ ఎలాంటి మార్పులను తీసుకొచ్చిందో మనందరం చూస్తూనే ఉన్నాం. కోడింగ్ మరింత ఆటోమేటిక్ గా మారడంతో కంపెనీ తన దృష్టిని కోడింగ్ నుంచి అల్గారిథమ్లకు మారుస్తోంది.
ఇదే క్రమంలో ఇందుకు అనుగుణంగా ఉద్యోగుల మ్యాథమెటికల్ ఎబిలిటీస్ మెరుగుపరచటం, సంక్లిష్ట క్వాంట్ నమూనాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇది టెక్కీలకు ఎంతగానో ఉపయోగపడనుందని ఐటీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


Click it and Unblock the Notifications