Infosys News: ప్రస్తుతం ఇన్ఫోసిస్ వార్తల్లో నానుతోంది. ఇటీవల ఫౌండర్ నారాయణ మూర్తి యువత వారంలో కనీసం 70 గంటలు పనిచేయాలంటూ చేసిన కామెంట్స్ పెద్ద దుమారానికి కారణం అయ్యాయి.
ఈ క్రమంలో దేశంలోని అగ్ర ఐటీ సేవల కంపెనీగా కొనసాగుతున్న ఇన్ఫోసిస్ తాజాగా కీలక ప్రకటన చేసింది. కంపెనీలు తన ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్ను రద్దు చేయటం చాలా మంది టెక్కీలను నిరాశకు గురిచేస్తోంది. ఎంట్రీ నుంచి మిడిల్ లెవెల్ ఉద్యోగులు నెలలో 10 రోజుల పాటు తప్పకుండా ఆఫీసుల నుంచి పనిచేయాల్సి ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు తీసుకొచ్చే క్రమంలో కంపెనీ హైబ్రిడ్ విధానంలోకి ప్రవేశించిందని తెలుస్తోంది.

ఇన్ఫోసిస్లోని వైస్ ప్రెసిడెంట్లలో ఒకరు ఎంపిక చేసిన వర్టికల్స్లోని ఉద్యోగులను, ప్రత్యేకంగా బ్యాండ్ 5, 6 (మిడ్-లెవల్ మేనేజర్లు, ప్రాజెక్ట్ హెడ్లు, ఎంట్రీ-లెవల్ ఉద్యోగులు)లోని ఉద్యోగులను నెలకు కనీసం 10 రోజులు ఆఫీసుల నుంచి పనిచేయాలని కోరారు. నవంబర్ 20, 2023 నుంచి ఈ విధానాన్ని కంపెనీ అమలు చేయాలని చూస్తోంది. "In Person Collab" కింద ఉద్యోగులు ఇన్ఫోసిస్ కార్యాలయాల నుంచి పనిచేయాలని కంపెనీ భావిస్తోంది.
ప్రస్తుతం ఐటీ సేవల రంగంలో వ్యాపారం చేస్తున్న కంపెనీలను తాజాగా ఇన్ఫోసిస్ ఫాలో అవుతోంది. దిగ్గజ కంపెనీలైన Wipro, Capgemini, LTIMindtree, TCS వంటి కంపెనీలు ఇప్పటికే ఉద్యోగులను క్రమ పద్ధతిలో కార్యాలయానికి తిరిగి వచ్చేలా ప్రోత్సహిస్తున్నాయి. అతిపెద్ద టెక్ కంపెనీగా ఉన్న టీసీఎస్ ఏకంగా వారంలో 5 రోజుల పాటు ఉద్యోగులు ఆఫీసుల నుంచి పనిచేయాల్సిందేనని తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే రెండవ అతిపెద్ద టెక్ కంపెనీ ఇన్ఫోసిస్ ఇదే బాటను ఎంచుకుంది. కరోనా తర్వాత ఉద్యోగుల్లో టీమ్ వర్క్ పెంచేందుకు భౌతికంగా బృందాలు ఆఫీసుల నుంచి కలిసి పనిచేసేలా ప్రోత్సహించేందుకు కంపెనీ కృషి చేస్తున్నట్లు ఉద్యోగులకు పంపిన మెయిల్ లో వెల్లడించింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications