Infosys News: భారీగా సీఈవో జీతం తగ్గించిన ఇన్ఫోసిస్.. ఆయన జీతం మాత్రం పెంచింది..

Infosys News: ఇండియన్ ఐటీ సేవల కంపెనీల్లో ఇప్పుడు జీతాల కోత కొనసాగుతోంది. వ్యాపార ఆదాయాల్లో వచ్చిన మార్పులు, తగ్గుతున్న లాభాలతో టెక్ కంపెనీలు ఖర్చుల కోతలను ప్రారంభించాయి.

దేశంలో టాప్ టెక్ కంపెనీల్లో ఒకటిగా ఉన్న ఇన్ఫోసిస్ కంపెనీ సీఈవో సలీల్ పరేఖ్ వార్షిక వేతనాన్ని 21 శాతం మేర తగ్గించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో తక్కువ జీతాన్ని పొందినట్లు వెల్లడైంది. ఈ క్రమంలో కంపెనీ నుంచి రూ.56.44 కోట్లను పరిహారంగా కంపెనీ నుంచి అందుకున్నారు. అయితే దీనికి ముందు ఏడాది ఆయన మెుత్తం పరిహారం రూ.71 కోట్లుగా ఉంది.

IT major Infosys cuts pay to ceo salil parekh amid business turbulances

ఇదే క్రమంలో ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు చెల్లించాల్సిన వేరియబుల్ వేతనాన్ని సైతం తగ్గించింది. మార్చి 2023తో ముగిసిన త్రైమాసికంలో ఇన్ఫోసిస్ తన ఉద్యోగుల సగటు వేరియబుల్ వేతనాన్ని 40 శాతం తగ్గించిన సంగతి తెలిసిందే. అంటే ఇన్ఫోసిస్ ఉద్యోగులు సగటున కంపెనీ ఇచ్చిన వాగ్దానంలో 60 శాతం వేరియబుల్ వేతనాన్ని మాత్రమే పొందారు.

ఇదే సమయంలో FY23లో ఇన్ఫోసిస్ CFO నిలంజన్ రాయ్ అందుకుంటున్న పరిహారం 28% పెరిగి రూ.10.61 కోట్లకు చేరుకున్నట్లు ఇన్ఫోసిస్ వార్షిక నివేదిక వెల్లడించింది. అలాగే ఇన్ఫోసిస్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నందన్ నీలేకని ఏడాదికి వేతనాలు తీసుకోలేదు. దీనికి ముందు గతవారం ఐటీ సేవల కంపెనీ హెచ్సీఎల్ టెక్ తన ఉద్యోగులకు అందించే వేతనాల విషయంలో హెచ్ ఆర్ పాలసీలను మార్చింది. దీని కారణంగా ఉద్యోగులు అందుకునే వేతనం తగ్గుతుందని వెల్లడైంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+