Accenture News: ఐటీ రంగంలో ప్రస్తుతం గడ్డు కాలం నడుస్తోంది. ఈ సమయంలో కంపెనీలు చెప్పినట్లు చేయటం తప్ప టెక్ ఉద్యోగులకు మరో అవకాశం లేదు. ఇన్నాళ్లు ఓపిక పట్టిన కంపెనీలు సైతం ప్రస్తుతం దీనిని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి.
ప్రఖ్యాత ఐటీ అండ్ కన్సలింటే దిగ్గజం యాక్సెంచర్ తమ ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి ఆఫీసులకు తిరిగి రావాలని కోరుతోంది. ఆఫీసుల నుంచి పనిచేయాలని ప్రోత్సహిస్తోంది. దీనికి ముందు టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి దేశీయ దిగ్గజ కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు ఈ విషయంలో డెడ్ లైన్స్ పెట్టిన సంగతి మనం గమనించాం. అదే దారిలో నడుస్తున్న యాక్సెంచర్ తన టీమ్ లీడర్స్, మేనేజర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఆగస్టు 31, 2023 నాటికి బేస్ లొకేషన్లలోని ఆఫీసుల నుంచి టీమ్స్ పనిచేసేలా చూడాలని వెల్లడించింది. దీనిద్వారా టీమ్ సభ్యులతో మెరుగ్గా కనెక్ట్ అవ్వాలని సూచించింది. క్లిష్టమైన ప్రాజెక్ట్ల్లో పని చేస్తూ.. క్లయింట్ల అవసరాలను తీర్చడానికి కలిసి తమ వంతు కృషి చేయాలని టెక్కీలను కంపెనీ కోరింది. దీనికి ముందు జనవరిలో టీసీఎస్ హైబ్రిడ్ ప్రక్రియలో వారంలో తప్పనిసరిగా మూడు రోజులు ఆఫీసులకు రావాల్సిందేనని తెలిపింది. పైగా దీనిని పనితీరు లెక్కింపులో పరిగణలోకి తీసుకోనున్నట్లు ప్రకటించింది.
అలాగే FY24 చివరి నాటికి 70 శాతం ఉద్యోగులు ఆఫీసుల నుంచి పనిచేయాలని దేశీయ ఐటీ మేజర్ హెచ్సీఎల్టెక్ ఆశిస్తోంది. కార్యాలయంలో పని చేసే విధానం 'అవసరాల ఆధారంగా' ఆధారపడి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. అనేక ప్రాజెక్టుల ఉద్యోగులు కనీసం వారానికి కొంత సమయం వరకు కార్యాలయాల నుంచి పని చేయాలని భావిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే తాము హైబ్రిడ్ -ఫస్ట్ వర్చువల్ ఆపరేటింగ్ మోడల్ని కలిగి ఉన్నట్లు సీఈవో సి విజయకుమార్ వెల్లడించారు. ఇదే బాటలో ఇన్ఫోసిస్, ఐబీఎమ్ వంటి టెక్ కంపెనీలు ముందుకు సాగుతున్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications